అరుదైన పసుపు రంగు తాబేలును బంగాల్ తూర్పు బుర్ద్వాన్లోని కలిగ్రామ్ దాస్పుర ప్రాంతంలో గుర్తించారు. అనంతరం దాన్ని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భారతీయ అటవీ సేవల అధికారి దెబాషిస్ శర్మ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలిపారు. ఆ తాబేలు చిత్రాన్ని పంచుకున్నారు.
జన్యుపరమైన మార్పులతో లేదా పుట్టుకతో వచ్చే వ్యాధుల వల్ల ఇలా రంగుల్లో మార్పులు వస్తాయని అధికారులు తెలిపారు. ఈ ఏడాదిలో రెండు పసుపు తాబేళ్లను అధికారులు గుర్తించారు. అంతకుముందు జులై నెలలో ఒడిశాలోని బాలేశ్వర్లో ఒక కూర్మాన్ని పట్టుకున్నారు.
![Rare yellow tortoise rescued in East Burdwan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/wb-bwn-01-burdwanturterecover-7204528_29102020012628_2910f_1603914988_234_2910newsroom_1603947072_1073.jpg)
ఇదీ చూడండి:మంత్రాల నెపంతో ఒకే కుటుంబంలోని ముగ్గురి శిరచ్ఛేదం