ETV Bharat / bharat

'రాజ్​పథ్​' పునర్నిర్మాణ పనులకు భూమిపూజ

author img

By

Published : Feb 4, 2021, 11:46 PM IST

'రాజ్​పథ్'ను పునర్నిర్మాణ పనులకు కేంద్రం గురువారం శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమానికి ​కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ హాజరై భూమి పూజ నిర్వహించారు.

rajpath revamp
'రాజ్​పథ్​' పునర్నిర్మాణ పనులకు భూమిపూజ

సెంట్రల్‌ విస్టా ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా.. 'రాజ్​పథ్​'ను పునర్మించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. రాష్ట్రపతి భవన్​ నుంచి ఇండియా గేట్​ వరకు ఉన్న ఈ దారి పునర్నిర్మాణ పనులకు ​కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ.. గురువారం భూమి పూజ చేశారు.

ఇండియా గేట్​ లాన్​లో సీనియర్ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 2022 రిపబ్లిక్​ డే నాటికి ఈ ప్రాంతంలో పరేడ్​ నిర్వహంచాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించుకుంది. రాజ్​పథ్​ పునర్నిర్మాణ పనుల కాంట్రాక్టును షాపుర్​జీ పల్లోంజి గ్రూప్ దక్కించుకుంది. అంచనా వ్యయం కంటే 4.99 శాతం తక్కువకు (రూ.477.08 కోట్లకు) బిడ్​ దాఖలు చేసి ఈ ప్రాజెక్టు దక్కించుకుకోవడం గమనార్హం.

సెంట్రల్‌ విస్టా ఆధునికీకరణ ప్రాజెక్టులో భాగంగా.. 'రాజ్​పథ్​'ను పునర్మించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. రాష్ట్రపతి భవన్​ నుంచి ఇండియా గేట్​ వరకు ఉన్న ఈ దారి పునర్నిర్మాణ పనులకు ​కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్‌ సింగ్‌ పూరీ.. గురువారం భూమి పూజ చేశారు.

ఇండియా గేట్​ లాన్​లో సీనియర్ అధికారుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. 2022 రిపబ్లిక్​ డే నాటికి ఈ ప్రాంతంలో పరేడ్​ నిర్వహంచాలని కేంద్రం లక్ష్యం నిర్దేశించుకుంది. రాజ్​పథ్​ పునర్నిర్మాణ పనుల కాంట్రాక్టును షాపుర్​జీ పల్లోంజి గ్రూప్ దక్కించుకుంది. అంచనా వ్యయం కంటే 4.99 శాతం తక్కువకు (రూ.477.08 కోట్లకు) బిడ్​ దాఖలు చేసి ఈ ప్రాజెక్టు దక్కించుకుకోవడం గమనార్హం.

ఇదీ చదవండి:'వాళ్లు.. రేపు మరొకరిని బెదిరించొచ్చు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.