ETV Bharat / bharat

రాజ్​భవన్​లో 'రాజ'కీయం- అసెంబ్లీ సమావేశం కోసం ధర్నా

author img

By

Published : Jul 24, 2020, 7:35 PM IST

రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. అసెంబ్లీ సమావేశాలకు నోటిఫికేషన్ జారీ చేయాలని మరోసారి గవర్నర్ కల్​రాజ్ మిశ్రాకు విజ్ఞప్తి చేశారు సీఎం అశోక్ గహ్లోత్. అనంతరం తమ వర్గం ఎమ్మెల్యేలతో కలిసి రాజ్​భవన్ ఆవరణలో ధర్నాకు దిగారు. సభల నిర్వహణపై హామి వచ్చేవరకు అక్కడే బైఠాయించనున్నట్లు ప్రకటించారు.

rajasthan politics
రాజ్​భవన్​లో 'రాజ'కీయం

రాజస్థాన్ రాజకీయం రాజ్​భవన్​కు చేరింది. శాసనసభ సమావేశాల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ అధికారిక నివాసం ఆవరణలో ధర్నాకు దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

కాంగ్రెస్ క్యాంప్​ నుంచి నాలుగు బస్సుల్లో రాజ్​భవన్​కు చేరుకున్న ఎమ్మెల్యేలు.. గవర్నర్​తో ముఖ్యమంత్రి సమావేశం పూర్తయ్యేవరకు బయటే ఉన్నారు. అనంతరం ముఖ్యనేతల నిర్ణయం మేరకు ధర్నాకు దిగారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నినాదాలు చేశారు. తమ ఎమ్మెల్యేలు హరియాణా క్యాంప్​లో పట్టుబడ్డారని పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు గహ్లోత్.

'ఒత్తిళ్ల వల్లే ఆదేశాలు ఇవ్వట్లేదు'

గవర్నర్​తో సమావేశానికి ముందు.. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు గహ్లోత్. శాసనసభ సమావేశాల నిర్వహణకు అనుమతించకూడదని రాష్ట్ర గవర్నర్ కల్​రాజ్ మిశ్రాపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు.

న్యాయస్థానంలో పైలట్​కు ఊరట

హైకోర్టులోనూ గహ్లోత్​ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు నేత పైలట్​ వర్గం ఎమ్మెల్యేలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. శాసనసభ్యులపై ఎలాంటి స్పీకర్ చర్యలు తీసుకోకుండా యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది కోర్టు.

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్​ ఫిర్యాదు నేపథ్యంలో 19 మంది ఎమ్మెల్యేలకు​ అనర్హత నోటీసులు పంపించారు స్పీకర్​ సీపీ జోషి. స్పీకర్​ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్​ను విచారించిన కోర్టు.. సభాపతి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

అయితే హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు స్పీకర్​ జోషి. అక్కడా సానుకూల ఫలితం రాలేదు.

'భాజపా ఆతిథ్యం నిజం కాదు'

ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపిస్తున్నట్లుగా తమకు దిల్లీలో భాజపా ఆతిథ్యం ఇవ్వడం లేదని పేర్కొన్నారు పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు. వారి సొంత నిర్ణయానికి అనుగుణంగానే క్యాంప్​లో ఉన్నట్లు పేర్కొన్నారు. తమ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన డిమాండ్లను సీఎం నెరవేర్చని కారణంగానే అసమ్మతి బాట పట్టినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ: మన్మోహన్​

రాజస్థాన్ రాజకీయం రాజ్​భవన్​కు చేరింది. శాసనసభ సమావేశాల నిర్వహణకు ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ గవర్నర్ అధికారిక నివాసం ఆవరణలో ధర్నాకు దిగారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు.

కాంగ్రెస్ క్యాంప్​ నుంచి నాలుగు బస్సుల్లో రాజ్​భవన్​కు చేరుకున్న ఎమ్మెల్యేలు.. గవర్నర్​తో ముఖ్యమంత్రి సమావేశం పూర్తయ్యేవరకు బయటే ఉన్నారు. అనంతరం ముఖ్యనేతల నిర్ణయం మేరకు ధర్నాకు దిగారు. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నినాదాలు చేశారు. తమ ఎమ్మెల్యేలు హరియాణా క్యాంప్​లో పట్టుబడ్డారని పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు గహ్లోత్.

'ఒత్తిళ్ల వల్లే ఆదేశాలు ఇవ్వట్లేదు'

గవర్నర్​తో సమావేశానికి ముందు.. సోమవారం నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని అనుకుంటున్నట్లు పేర్కొన్నారు గహ్లోత్. శాసనసభ సమావేశాల నిర్వహణకు అనుమతించకూడదని రాష్ట్ర గవర్నర్ కల్​రాజ్ మిశ్రాపై రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు.

న్యాయస్థానంలో పైలట్​కు ఊరట

హైకోర్టులోనూ గహ్లోత్​ సర్కారుకు ఎదురుదెబ్బ తగిలింది. తిరుగుబాటు నేత పైలట్​ వర్గం ఎమ్మెల్యేలకు న్యాయస్థానంలో ఊరట లభించింది. శాసనసభ్యులపై ఎలాంటి స్పీకర్ చర్యలు తీసుకోకుండా యథాతథస్థితి కొనసాగించాలని ఆదేశించింది కోర్టు.

కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్​ ఫిర్యాదు నేపథ్యంలో 19 మంది ఎమ్మెల్యేలకు​ అనర్హత నోటీసులు పంపించారు స్పీకర్​ సీపీ జోషి. స్పీకర్​ నిర్ణయాన్ని సవాల్​ చేస్తూ రెబల్ ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్​ను విచారించిన కోర్టు.. సభాపతి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

అయితే హైకోర్టు ఆదేశాలపై సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేశారు స్పీకర్​ జోషి. అక్కడా సానుకూల ఫలితం రాలేదు.

'భాజపా ఆతిథ్యం నిజం కాదు'

ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ ఆరోపిస్తున్నట్లుగా తమకు దిల్లీలో భాజపా ఆతిథ్యం ఇవ్వడం లేదని పేర్కొన్నారు పైలట్ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు. వారి సొంత నిర్ణయానికి అనుగుణంగానే క్యాంప్​లో ఉన్నట్లు పేర్కొన్నారు. తమ నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించిన డిమాండ్లను సీఎం నెరవేర్చని కారణంగానే అసమ్మతి బాట పట్టినట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి: ఆర్థిక సంస్కరణల పితామహుడు పీవీ: మన్మోహన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.