ETV Bharat / bharat

మే 12 నుంచి ప్రయాణికుల రైళ్ల కూత!

author img

By

Published : May 10, 2020, 8:47 PM IST

Updated : May 10, 2020, 9:48 PM IST

trains
మే 12 నుంచి ప్రయాణికుల రైళ్ల కూత!

21:01 May 10

రైళ్ల పునరుద్ధరణ

లాక్​డౌన్​ కారణంగా నిలిచిపోయిన ప్రయాణికుల​ రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. దశల వారిగా రైళ్ల పునరుద్ధరణ జరపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు మే 12 నుంచి 15 ప్రత్యేక​ రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది.  

దిల్లీ రైల్వే స్టేషన్​ నుంచి దిబ్రుగఢ్​, అగర్తలా, హౌారా, పట్నా, బిలాస్​పుర్​, రాంచీ, భువనేశ్వర్​, సికింద్రాబాద్​, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్​గావ్​, ముంబయి సెంట్రల్​, అహ్మదాబాద్​, జమ్ము తావిలకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.  

మే 11 సాయంత్రం 4 గంటల నుంచి ఈ రైళ్ల కోసం ఆన్​లైన్​ రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి. టికెట్లను ఐఆర్​సీటీసీ  వెబ్​సైట్​(https://www.irctc.co.in/) ద్వారా బుక్​ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలోని టికెట్​ కౌంటర్లు మాత్రం మూసే ఉంటాయి.  

టికెట్​ ఉన్న ప్యాసింజర్లనే రైళ్లలో ఎక్కించుకుంటారు. బయలుదేరే సమయంలో స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహిస్తారు. వైరస్​ లక్షణాలు లేని వారు మాత్రమే ప్రయాణించడానికి అనుమతినిస్తారు.

ఇప్పటికే 20వేలకుపైగా బోగీలు కరోనా కేంద్రాలుగా మారాయి. దాదాపు 300 రైళ్లు వలస కార్మికుల ప్రయాణం కోసం ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్నవాటిని లెక్కించి.. దశలవారిగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనుంది భారతీయ రైల్వే.

దేశంలో లాక్​డౌన్​ కారణంగా మార్చి 25న ప్యాసింజర్​ రైళ్ల సేవలను రద్దు చేశారు.

20:43 May 10

మే 12 నుంచి ప్రయాణికుల​ రైళ్ల కూత!

ప్రయాణికుల​ రైళ్ల రాకపోకలపై కీలక ప్రకటన చేసింది రైల్వేశాఖ. మే 12 నుంచి సేవలు క్రమంగా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. మొదటగా.. దిల్లీ నుంచి దిబ్రుగఢ్​, అగర్తలా, హౌరా, పట్నా, బిలాస్​పుర్​, రాంచీ, భువనేశ్వర్​, సికింద్రాబాద్​, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్​గావ్​, ముంబై సెంట్రల్​, అహ్మదాబాద్​, జమ్ము తావికి నడపనున్నట్లు స్పష్టం చేసింది.

21:01 May 10

రైళ్ల పునరుద్ధరణ

లాక్​డౌన్​ కారణంగా నిలిచిపోయిన ప్రయాణికుల​ రైళ్లు తిరిగి పట్టాలెక్కనున్నాయి. దశల వారిగా రైళ్ల పునరుద్ధరణ జరపాలని భారతీయ రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు మే 12 నుంచి 15 ప్రత్యేక​ రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది.  

దిల్లీ రైల్వే స్టేషన్​ నుంచి దిబ్రుగఢ్​, అగర్తలా, హౌారా, పట్నా, బిలాస్​పుర్​, రాంచీ, భువనేశ్వర్​, సికింద్రాబాద్​, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్​గావ్​, ముంబయి సెంట్రల్​, అహ్మదాబాద్​, జమ్ము తావిలకు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.  

మే 11 సాయంత్రం 4 గంటల నుంచి ఈ రైళ్ల కోసం ఆన్​లైన్​ రిజర్వేషన్లు అందుబాటులో ఉంటాయి. టికెట్లను ఐఆర్​సీటీసీ  వెబ్​సైట్​(https://www.irctc.co.in/) ద్వారా బుక్​ చేసుకోవచ్చు. రైల్వే స్టేషన్లలోని టికెట్​ కౌంటర్లు మాత్రం మూసే ఉంటాయి.  

టికెట్​ ఉన్న ప్యాసింజర్లనే రైళ్లలో ఎక్కించుకుంటారు. బయలుదేరే సమయంలో స్క్రీనింగ్​ పరీక్షలు నిర్వహిస్తారు. వైరస్​ లక్షణాలు లేని వారు మాత్రమే ప్రయాణించడానికి అనుమతినిస్తారు.

ఇప్పటికే 20వేలకుపైగా బోగీలు కరోనా కేంద్రాలుగా మారాయి. దాదాపు 300 రైళ్లు వలస కార్మికుల ప్రయాణం కోసం ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో అందుబాటులో ఉన్నవాటిని లెక్కించి.. దశలవారిగా మరికొన్ని ప్రత్యేక రైళ్లను పునరుద్ధరించనుంది భారతీయ రైల్వే.

దేశంలో లాక్​డౌన్​ కారణంగా మార్చి 25న ప్యాసింజర్​ రైళ్ల సేవలను రద్దు చేశారు.

20:43 May 10

మే 12 నుంచి ప్రయాణికుల​ రైళ్ల కూత!

ప్రయాణికుల​ రైళ్ల రాకపోకలపై కీలక ప్రకటన చేసింది రైల్వేశాఖ. మే 12 నుంచి సేవలు క్రమంగా ప్రారంభించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. మొదటగా.. దిల్లీ నుంచి దిబ్రుగఢ్​, అగర్తలా, హౌరా, పట్నా, బిలాస్​పుర్​, రాంచీ, భువనేశ్వర్​, సికింద్రాబాద్​, బెంగళూరు, చెన్నై, తిరువనంతపురం, మడ్​గావ్​, ముంబై సెంట్రల్​, అహ్మదాబాద్​, జమ్ము తావికి నడపనున్నట్లు స్పష్టం చేసింది.

Last Updated : May 10, 2020, 9:48 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.