ETV Bharat / bharat

వలస కార్మికుల రైల్​ టికెట్​పై రాజకీయ రగడ - RAILWAY CHARGING FAIRS FOR MIGRANTS

రైలు ప్రయాణం కోసం వలస కూలీల నుంచి ఛార్జీలు వసూలు చేయడం ఏంటని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ ప్రశ్నించారు. భారతీయ రైల్వే ఓవైపు ఛార్జీలు వసూలు చేస్తూనే.. మరోవైపు పీఎం సహాయ నిధికి విరాళాలు ఇస్తోందని తెలిపారు. రాహుల్​ ఆరోపణలపై స్పందించిన భాజపా.. 85శాతం రాయితీతో రైల్వే టికెట్లు అందిస్తున్నట్టు పేర్కొన్నారు.

Railway has subsidised 85 per cent fare for migrant workers: BJP
వలస కార్మికుల ప్రయాణంపై రాజకీయ రగడ
author img

By

Published : May 4, 2020, 12:28 PM IST

దేశవ్యాప్తంగా వలస కార్మికుల తరలింపుపై రాజకీయ దుమారం రేగింది. వలస కూలీల నుంచి రైలు ప్రయాణ ఖర్చులు వసూలు చేయడంపై కాంగ్రెస్​ తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఆ ఛార్జీలను కూలీలు చెల్లించనవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని భాజపా స్పష్టంచేసింది. ఈ మేరకు కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించింది.

'వసూలు చేస్తూ విరాళాలిస్తారా?'

కరోనా సంక్షోభంలో రైలు ప్రయాణం కోసం భారతీయ రైల్వే.. వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేయడాన్ని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ తప్పుబట్టారు. కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తూనే.. మరోవైపు పీఎం సహాయ నిధికి భారతీయ రైల్వే విరాళాలు ఇస్తోందని విమర్శించారు.

  • एक तरफ रेलवे दूसरे राज्यों में फँसे मजदूरों से टिकट का भाड़ा वसूल रही है वहीं दूसरी तरफ रेल मंत्रालय पीएम केयर फंड में 151 करोड़ रुपए का चंदा दे रहा है।

    जरा ये गुत्थी सुलझाइए! pic.twitter.com/qaN0k5NwpG

    — Rahul Gandhi (@RahulGandhi) May 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఓవైపు వలస కార్మికుల నుంచి టికెట్​ ఛార్జీలు వసూలు చేస్తూనే.. మరోవైపు పీఎం సహాయ నిధికి రైల్వేశాఖ రూ.151కోట్లను విరాళంగా అందిస్తోంది. ఈ పజిల్​ను మీరే పరిష్కరించండి."

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత

వలస కూలీల రైలు ఖర్చులను కాంగ్రెస్​ భరిస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించిన కొద్ది గంటల అనంతరం రాహుల్​ ఈ ట్వీట్​ చేశారు.

'మీరు ఇలాగే చేయండి...'

వలస కార్మికుల కోసం ఛార్జీల్లోని 85శాతాన్ని భారతీయ రైల్వే రాయితీగా అందిస్తోందని భాజపా పేర్కొంది. రైల్వే తీరును రాహుల్​ గాంధీ ప్రశ్నించిన నేపథ్యంలో భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్రా ఈ మేరకు వ్యాఖ్యానించారు. మిగిలిన 15శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని తెలిపారు.

వలస కూలీలకు రైలు టికెట్లను రాష్ట్ర ప్రభుత్వాలే కొనిపెట్టవచ్చని సంబిత్​ పాత్రా సూచించారు. మధ్యప్రదేశ్​ ప్రభుత్వం ఇలాగే చేస్తోందని.. దీనిని కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలు అనుసరించాలని పేర్కొన్నారు.

  • Rahul Gandhi ji,
    I have attached guidelines of MHA which clearly states that “No tickets to be sold at any station”
    Railways has subsidised 85% & State govt to pay 15%
    The State govt can pay for the tickets(Madhya Pradesh’s BJP govt is paying)
    Ask Cong state govts to follow suit https://t.co/Hc9pQzy8kQ pic.twitter.com/2RIAMyQyjs

    — Sambit Patra (@sambitswaraj) May 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రాహుల్​ జీ... ఏ స్టేషన్​లోనూ ఒక్క టికెట్​ కూడా అమ్మకూడదని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. 85శాతం రైల్వే రాయితీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు 15శాతం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వాలే వలస కూలీలకు టికెట్లు కొనుగోలు చేయవచ్చు. మధ్యప్రదేశ్​ ప్రభుత్వం అదే చేస్తోంది. ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్​ పాలిత ప్రాంతాలను అనుసరించమని చెప్పండి."

--- సంబిత్​ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి.

'టికెట్లు అమ్మట్లేదు..'

ఈ వ్యవహారంపై రైల్వేశాఖ స్పష్టతనిచ్చింది. టికెట్​ రేటులోని 15శాతం మాత్రమే వసూలు చేస్తున్నట్టు పేర్కొంది. వలస కార్మికులకు టికెట్లు అమ్మడం లేదని.. ప్రభుత్వం అందిస్తున్న జాబితా ప్రకారమే వారిని రైళ్లలోకి ఎక్కించుకుంటున్నట్టు వెల్లడించింది.

సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ శ్రామిక్​ రైళ్లను నడుపుతున్నట్టు భారతీయ రైల్వే స్పష్టం చేసింది. రైలులో ప్రయాణిస్తున్న వారందరికీ తాగు నీరు, భోజనం ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. గమ్యస్థానాల నుంచి వెనక్కి వచ్చేడప్పుడు రైళ్లు ఖాళీగానే వస్తున్నాయని చెప్పింది.

ఇదీ చూడండి:- కరోనా భయాలు బేఖాతరు- మద్యం కోసం ఎగబడ్డ జనం

దేశవ్యాప్తంగా వలస కార్మికుల తరలింపుపై రాజకీయ దుమారం రేగింది. వలస కూలీల నుంచి రైలు ప్రయాణ ఖర్చులు వసూలు చేయడంపై కాంగ్రెస్​ తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఆ ఛార్జీలను కూలీలు చెల్లించనవసరం లేదని, రాష్ట్ర ప్రభుత్వాలే భరించాలని భాజపా స్పష్టంచేసింది. ఈ మేరకు కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలు చర్యలు చేపట్టాలని సూచించింది.

'వసూలు చేస్తూ విరాళాలిస్తారా?'

కరోనా సంక్షోభంలో రైలు ప్రయాణం కోసం భారతీయ రైల్వే.. వలస కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేయడాన్ని కాంగ్రెస్​ సీనియర్​ నేత రాహుల్​ గాంధీ తప్పుబట్టారు. కార్మికుల నుంచి ఛార్జీలు వసూలు చేస్తూనే.. మరోవైపు పీఎం సహాయ నిధికి భారతీయ రైల్వే విరాళాలు ఇస్తోందని విమర్శించారు.

  • एक तरफ रेलवे दूसरे राज्यों में फँसे मजदूरों से टिकट का भाड़ा वसूल रही है वहीं दूसरी तरफ रेल मंत्रालय पीएम केयर फंड में 151 करोड़ रुपए का चंदा दे रहा है।

    जरा ये गुत्थी सुलझाइए! pic.twitter.com/qaN0k5NwpG

    — Rahul Gandhi (@RahulGandhi) May 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"ఓవైపు వలస కార్మికుల నుంచి టికెట్​ ఛార్జీలు వసూలు చేస్తూనే.. మరోవైపు పీఎం సహాయ నిధికి రైల్వేశాఖ రూ.151కోట్లను విరాళంగా అందిస్తోంది. ఈ పజిల్​ను మీరే పరిష్కరించండి."

--- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత

వలస కూలీల రైలు ఖర్చులను కాంగ్రెస్​ భరిస్తుందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రకటించిన కొద్ది గంటల అనంతరం రాహుల్​ ఈ ట్వీట్​ చేశారు.

'మీరు ఇలాగే చేయండి...'

వలస కార్మికుల కోసం ఛార్జీల్లోని 85శాతాన్ని భారతీయ రైల్వే రాయితీగా అందిస్తోందని భాజపా పేర్కొంది. రైల్వే తీరును రాహుల్​ గాంధీ ప్రశ్నించిన నేపథ్యంలో భాజపా అధికార ప్రతినిధి సంబిత్​ పాత్రా ఈ మేరకు వ్యాఖ్యానించారు. మిగిలిన 15శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చెల్లించాలని తెలిపారు.

వలస కూలీలకు రైలు టికెట్లను రాష్ట్ర ప్రభుత్వాలే కొనిపెట్టవచ్చని సంబిత్​ పాత్రా సూచించారు. మధ్యప్రదేశ్​ ప్రభుత్వం ఇలాగే చేస్తోందని.. దీనిని కాంగ్రెస్​ పాలిత రాష్ట్రాలు అనుసరించాలని పేర్కొన్నారు.

  • Rahul Gandhi ji,
    I have attached guidelines of MHA which clearly states that “No tickets to be sold at any station”
    Railways has subsidised 85% & State govt to pay 15%
    The State govt can pay for the tickets(Madhya Pradesh’s BJP govt is paying)
    Ask Cong state govts to follow suit https://t.co/Hc9pQzy8kQ pic.twitter.com/2RIAMyQyjs

    — Sambit Patra (@sambitswaraj) May 4, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

"రాహుల్​ జీ... ఏ స్టేషన్​లోనూ ఒక్క టికెట్​ కూడా అమ్మకూడదని కేంద్రం మార్గదర్శకాలు ఇచ్చింది. 85శాతం రైల్వే రాయితీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు 15శాతం చెల్లించాలి. రాష్ట్ర ప్రభుత్వాలే వలస కూలీలకు టికెట్లు కొనుగోలు చేయవచ్చు. మధ్యప్రదేశ్​ ప్రభుత్వం అదే చేస్తోంది. ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్​ పాలిత ప్రాంతాలను అనుసరించమని చెప్పండి."

--- సంబిత్​ పాత్రా, భాజపా అధికార ప్రతినిధి.

'టికెట్లు అమ్మట్లేదు..'

ఈ వ్యవహారంపై రైల్వేశాఖ స్పష్టతనిచ్చింది. టికెట్​ రేటులోని 15శాతం మాత్రమే వసూలు చేస్తున్నట్టు పేర్కొంది. వలస కార్మికులకు టికెట్లు అమ్మడం లేదని.. ప్రభుత్వం అందిస్తున్న జాబితా ప్రకారమే వారిని రైళ్లలోకి ఎక్కించుకుంటున్నట్టు వెల్లడించింది.

సామాజిక దూరం నిబంధనను పాటిస్తూ శ్రామిక్​ రైళ్లను నడుపుతున్నట్టు భారతీయ రైల్వే స్పష్టం చేసింది. రైలులో ప్రయాణిస్తున్న వారందరికీ తాగు నీరు, భోజనం ఉచితంగా అందిస్తున్నట్టు తెలిపింది. గమ్యస్థానాల నుంచి వెనక్కి వచ్చేడప్పుడు రైళ్లు ఖాళీగానే వస్తున్నాయని చెప్పింది.

ఇదీ చూడండి:- కరోనా భయాలు బేఖాతరు- మద్యం కోసం ఎగబడ్డ జనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.