ETV Bharat / bharat

శనివారం తమిళనాట రాహుల్ ప్రచార శంఖారావం

జనవరి 23న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార పర్వాన్ని కాంగ్రెస్​ ప్రారంభించనుంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు.

author img

By

Published : Jan 21, 2021, 11:46 AM IST

TN assembly polls
జనవరి 23 నుంచి తమిళనాడులో కాంగ్రెస్​ ప్రచార పర్వం

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని జనవరి 23న ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్​ అధ్యక్షుడు కేఎస్​ అళగిరి వెల్లడించారు. ఈ ఎన్నికల్లోనూ డీఎంకేతో పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కమల్​ హాసన్​ తమతో చేరాలనుకుంటే స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు.

"జనవరి 23న కోయంబత్తూర్​, త్రిస్సూర్​ జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచార సభలో రాహుల్​ గాంధీ పాల్గొంటారు. ఈరోడ్​లో జరిగే సభకు హాజరయ్యేందుకు కూడా ఆయన అంగీకరించారు"

-- కేఎస్​ అళగిరి, టీఎన్​సీసీ అధ్యక్షుడు

ఎన్నికల్లో తమదే విజయమని అళగిరి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో నీట్​ పరీక్షను రద్దు చేస్తామని చెప్పారు. విద్య, వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. విధానాల పరంగా డీఎంకేతో కొన్ని అంతరాలు ఉన్నప్పటికీ.. లౌకికవాదానికి తామంతా కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు.

ఈ నెల 14న మధురైలో జరిగిన జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొనేందుకు తమిళనాడుకు రాహల్​ వచ్చారు.

ఏప్రిల్​-మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:'కమలం' విరిసింది.. తులసేంద్రపురం మురిసింది!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని జనవరి 23న ఆ పార్టీ అగ్రనేత రాహుల్​ గాంధీ ప్రారంభించనున్నారు. ఈ మేరకు తమిళనాడు కాంగ్రెస్​ అధ్యక్షుడు కేఎస్​ అళగిరి వెల్లడించారు. ఈ ఎన్నికల్లోనూ డీఎంకేతో పొత్తు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. కమల్​ హాసన్​ తమతో చేరాలనుకుంటే స్వాగతం పలుకుతామని పేర్కొన్నారు.

"జనవరి 23న కోయంబత్తూర్​, త్రిస్సూర్​ జిల్లాలో జరిగే ఎన్నికల ప్రచార సభలో రాహుల్​ గాంధీ పాల్గొంటారు. ఈరోడ్​లో జరిగే సభకు హాజరయ్యేందుకు కూడా ఆయన అంగీకరించారు"

-- కేఎస్​ అళగిరి, టీఎన్​సీసీ అధ్యక్షుడు

ఎన్నికల్లో తమదే విజయమని అళగిరి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో నీట్​ పరీక్షను రద్దు చేస్తామని చెప్పారు. విద్య, వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తామని తెలిపారు. విధానాల పరంగా డీఎంకేతో కొన్ని అంతరాలు ఉన్నప్పటికీ.. లౌకికవాదానికి తామంతా కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు.

ఈ నెల 14న మధురైలో జరిగిన జల్లికట్టు కార్యక్రమంలో పాల్గొనేందుకు తమిళనాడుకు రాహల్​ వచ్చారు.

ఏప్రిల్​-మే నెలలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

ఇదీ చూడండి:'కమలం' విరిసింది.. తులసేంద్రపురం మురిసింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.