ETV Bharat / bharat

'కాంగ్రెస్​ అధికారంలోకి వస్తే జీఎస్​టీని మార్చేస్తాం'

author img

By

Published : Jan 23, 2021, 10:12 PM IST

తమ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్​టీని పునర్నిర్మిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ అన్నారు. జీఎస్​టీ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ నాశమైందన్నారు. తమిళనాడు పర్యటనలో ఉన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Rahul Gandhi assures revisiting GST when Cong is voted to power at Centre
'మేం అధికారంలోకి వస్తే జీఎంస్​టీపై సమీక్షిస్తాం'

కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్​టీని పునర్నిర్మిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తమిళనాడు పర్యటనలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) ప్రతినిధులతో మాట్లాడిన రాహుల్​.. జీఎస్​టీ వల్ల ఆ పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనలో ఎంఎస్ఎంఈలను వెన్నెముఖగా అభివర్ణించిన రాహుల్​.. వాటి ద్వారానే చైనా, బంగ్లాదేశ్​ వంటి దేశాలతో పోటీ పడగలమన్నారు.

"ఈ జీఎస్​టీ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీని వల్ల ఎంఎస్​ఎంఈలపై అధిక భారం పడింది. ఆర్థిక వ్యవస్థ కూడా నాశనమైంది. వ్యాపారవేత్తలే జీఎస్​టీకీ మద్దతు పలుకుతున్నారు. వారికి సాయం చేయడానికే దీనిని తీసుకొచ్చారు. ఎంఎస్​ఎంఈల కోసం కాదు."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

భాజపా సర్కార్​ దేశంలో భారీ అసమానతలు సృష్టించిందని ఆరోపించారు రాహుల్​. "భాజపా సర్కార్​ జీఎస్​టీ గురించి అర్థం చేసుకోదు. దాని ప్రభావం గురించి వారికి తెలియదు. అలాగే దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇవి తగ్గుతాయి," అని అన్నారు.

వ్యవసాయ చట్టాలు రైతులకు డీమోనిటైజేషన్​ లాంటివన్న రాహుల్​.. వాటిని అమలు చేయకుండా ఆందోళనలు చేస్తున్న అన్నదాతలను చూస్తే గర్వంగా ఉందన్నారు. పేదప్రజల శక్తి మోదీకి తెలియదని.. దానిని ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.

ఇదీ చూడండి: 8 రోజుల్లో 15లక్షల మందికి కరోనా టీకా

కేంద్రంలో తమ పార్టీ అధికారంలోకి వస్తే జీఎస్​టీని పునర్నిర్మిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. తమిళనాడు పర్యటనలో భాగంగా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) ప్రతినిధులతో మాట్లాడిన రాహుల్​.. జీఎస్​టీ వల్ల ఆ పరిశ్రమలు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. ఉద్యోగ కల్పనలో ఎంఎస్ఎంఈలను వెన్నెముఖగా అభివర్ణించిన రాహుల్​.. వాటి ద్వారానే చైనా, బంగ్లాదేశ్​ వంటి దేశాలతో పోటీ పడగలమన్నారు.

"ఈ జీఎస్​టీ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. దీని వల్ల ఎంఎస్​ఎంఈలపై అధిక భారం పడింది. ఆర్థిక వ్యవస్థ కూడా నాశనమైంది. వ్యాపారవేత్తలే జీఎస్​టీకీ మద్దతు పలుకుతున్నారు. వారికి సాయం చేయడానికే దీనిని తీసుకొచ్చారు. ఎంఎస్​ఎంఈల కోసం కాదు."

- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

భాజపా సర్కార్​ దేశంలో భారీ అసమానతలు సృష్టించిందని ఆరోపించారు రాహుల్​. "భాజపా సర్కార్​ జీఎస్​టీ గురించి అర్థం చేసుకోదు. దాని ప్రభావం గురించి వారికి తెలియదు. అలాగే దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలో ఉంటే ఇవి తగ్గుతాయి," అని అన్నారు.

వ్యవసాయ చట్టాలు రైతులకు డీమోనిటైజేషన్​ లాంటివన్న రాహుల్​.. వాటిని అమలు చేయకుండా ఆందోళనలు చేస్తున్న అన్నదాతలను చూస్తే గర్వంగా ఉందన్నారు. పేదప్రజల శక్తి మోదీకి తెలియదని.. దానిని ఆయనకు అర్థమయ్యేలా చెప్పాలన్నారు.

ఇదీ చూడండి: 8 రోజుల్లో 15లక్షల మందికి కరోనా టీకా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.