ETV Bharat / bharat

దిల్లీ: ప్రధాన ప్రతిపక్షనేత పదవికి భాజపాలో తీవ్ర పోటీ

author img

By

Published : Feb 15, 2020, 6:00 AM IST

Updated : Mar 1, 2020, 9:30 AM IST

70 స్థానాలున్న దిల్లీ అసెంబ్లీలో 62 స్థానాలను సాధించింది ఆప్​. మిగిలిన 8 స్థానాలను భాజపా తన ఖాతాలో వేసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షనేత హోదా కోసం భాజపా శాసనసభ్యులు పోటీ పడుతున్నారు. అధిష్ఠాన వర్గం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే పార్టీ ఉన్నత శ్రేణి నాయకత్వం దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.

bjp
దిల్లీ: ప్రధాన ప్రతిపక్షనేత పదవికి భాజపాలో తీవ్ర పోటీ

దిల్లీ: ప్రధాన ప్రతిపక్షనేత పదవికి భాజపాలో తీవ్ర పోటీ

దిల్లీ శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 8 సీట్లను భాజపా తన ఖాతాలో వేసుకుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం అవసరమైన సంఖ్యాబలం తమకు ఉన్న కారణంగా ఈ పదవికి ప్రస్తుతం తీవ్రపోటీ నెలకొంది. సీనియర్ నేతలు సహా మొత్తంగా ఐదుగురు శాసనసభ్యులు ఈ పదవికి ఔత్సాహికులని తెలుస్తోంది.

రోహిణి నియోజకవర్గ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా, కరవాల్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ సింగ్ బిస్త్, బదర్​పుర్​ శాసనసభ్యుడు రామ్​వీర్ సింగ్ భిదూరీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొందని సమాచారం. ప్రస్తుతం ఎన్నికైన శాసనసభ్యుల్లో మోహన్ బిస్త్ సీనియర్. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదేసమయంలో విజేందర్ గుప్తా భాజపా దిల్లీ విభాగం మాజీ అధ్యక్షుడు. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రయాణం.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రామ్​వీర్ భిదూరీ ప్రతిపక్షనేత పదవికి మరో ఔత్సాహికుడు. ఈయనను 2003-04 సంవత్సరంలో ఉత్తమ శాసనసభ్యుడి అవార్డు వరించింది.

వీరు కాకుండా మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలైన అజయ్ మహావర్, అభయ్ వర్మలకు విపక్షనేత పదవి ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

'ఇప్పటికే ఔత్సాహిక ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతలను కలుస్తున్నారు. త్వరలో వారిలో ఒకరిని ప్రతిపక్షనేతగా ఎన్నుకునే అవకాశం ఉంద'ని దిల్లీకి చెందిన భాజపా నేత ఒకరు వ్యాఖ్యానిచారు.

ఇదీ చూడండి: ఆధార్​తో పాన్ లింక్ తప్పనిసరి... లేదంటే!

దిల్లీ: ప్రధాన ప్రతిపక్షనేత పదవికి భాజపాలో తీవ్ర పోటీ

దిల్లీ శాసనసభ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 8 సీట్లను భాజపా తన ఖాతాలో వేసుకుంది. ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం అవసరమైన సంఖ్యాబలం తమకు ఉన్న కారణంగా ఈ పదవికి ప్రస్తుతం తీవ్రపోటీ నెలకొంది. సీనియర్ నేతలు సహా మొత్తంగా ఐదుగురు శాసనసభ్యులు ఈ పదవికి ఔత్సాహికులని తెలుస్తోంది.

రోహిణి నియోజకవర్గ ఎమ్మెల్యే విజేందర్ గుప్తా, కరవాల్ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ సింగ్ బిస్త్, బదర్​పుర్​ శాసనసభ్యుడు రామ్​వీర్ సింగ్ భిదూరీల మధ్యే ప్రధానంగా పోటీ నెలకొందని సమాచారం. ప్రస్తుతం ఎన్నికైన శాసనసభ్యుల్లో మోహన్ బిస్త్ సీనియర్. ఆయన ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అదేసమయంలో విజేందర్ గుప్తా భాజపా దిల్లీ విభాగం మాజీ అధ్యక్షుడు. ఐదు దశాబ్దాల రాజకీయ ప్రయాణం.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రామ్​వీర్ భిదూరీ ప్రతిపక్షనేత పదవికి మరో ఔత్సాహికుడు. ఈయనను 2003-04 సంవత్సరంలో ఉత్తమ శాసనసభ్యుడి అవార్డు వరించింది.

వీరు కాకుండా మొదటిసారి ఎన్నికైన ఎమ్మెల్యేలైన అజయ్ మహావర్, అభయ్ వర్మలకు విపక్షనేత పదవి ఇచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

'ఇప్పటికే ఔత్సాహిక ఎమ్మెల్యేలు పార్టీ ముఖ్యనేతలను కలుస్తున్నారు. త్వరలో వారిలో ఒకరిని ప్రతిపక్షనేతగా ఎన్నుకునే అవకాశం ఉంద'ని దిల్లీకి చెందిన భాజపా నేత ఒకరు వ్యాఖ్యానిచారు.

ఇదీ చూడండి: ఆధార్​తో పాన్ లింక్ తప్పనిసరి... లేదంటే!

Last Updated : Mar 1, 2020, 9:30 AM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.