ETV Bharat / bharat

'దేశంలో పుల్వామా తరహా దాడికి జైషే కుట్ర'

భారత్​లో అలజడులు సృష్టించడానికి జైషే ఉగ్రవాది సజ్జద్​ అహ్మద్​ కుట్రపన్నినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) దిల్లీకోర్టుకు తెలిపింది. ఆరోపితుడు సజ్జద్​.. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ముదస్సిర్​కు అత్యంత సన్నిహితుడు అని న్యాయస్థానంలో దాఖలు చేసిన ఛార్జ్​షీట్​లో ఎన్​ఐఏ పేర్కొంది.

author img

By

Published : Sep 16, 2019, 10:13 PM IST

Updated : Sep 30, 2019, 9:25 PM IST

'దేశంలో పుల్వామా తరహా దాడికి జైషే కుట్ర'

దిల్లీ సహా భారత్​లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరపడానికి జైషే మహ్మద్​ ఉగ్రవాది సజ్జద్​ అహ్మద్​ ఖాన్​ ప్రణాళికలు రచించాడని ఆరోపిస్తూ దిల్లీ కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ).

కశ్మీర్​లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఆత్మహుతి దాడిలో 40మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి సూత్రధారి అయిన ముదస్సిర్​ అహ్మద్​ ఖాన్​కు సజ్జద్​ అత్యంత సన్నిహితుడు. పుల్వామా కుట్రలోనూ సజ్జద్​ హస్తముందని అనుమానాలున్నాయి.

పుల్వామా దాడికి సంబంధించి.. నలుగురు ఉగ్రవాదులపై(సజ్జద్​, తన్వీర్​, బిలాల్​, ముజఫ్ఫర్​) 120-బీ, 121-ఏ సెక్షన్ల కింద ఛార్జ్​షీట్​ దాఖలైంది. మార్చిలో జరిగిన ఎన్​కౌంటర్​లో పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ముదస్సిర్​ మరణించడం వల్ల అతడి పేరును ఛార్జ్​షీట్​ నుంచి తొలగించారు.

"ఈ నలుగురు ఉగ్రవాదులు పుల్వామాకు చెందిన వారు. తన్వీర్​, బిలాల్​.. పుల్వామా తరహా దాడి చేయాలనుకున్నారు. వీరు సజ్జద్​ సోదరులు, జైషే ఉగ్రవాదులు. వివిధ ఎన్​కౌంటర్లలో వీరిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంతరం సజ్జద్​ జైషేలో చేరాడు. దిల్లీ-ఎన్​ఆర్​సీ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశాలు అందాయి."
-- జాతీయ నిఘా సంస్థ.

దిల్లీ లజ్​పత్​ రాయ్​ మార్కెట్​ సమీపంలో సంచరిస్తూ పోలీసులకు చిక్కాడు సజ్జద్​.

ఇదీ చూడండి:- కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

దిల్లీ సహా భారత్​లోని వివిధ ప్రాంతాల్లో ఉగ్రదాడులు జరపడానికి జైషే మహ్మద్​ ఉగ్రవాది సజ్జద్​ అహ్మద్​ ఖాన్​ ప్రణాళికలు రచించాడని ఆరోపిస్తూ దిల్లీ కోర్టులో ఛార్జీషీటు దాఖలు చేసింది జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ).

కశ్మీర్​లోని పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగిన ఆత్మహుతి దాడిలో 40మంది సీఆర్​పీఎఫ్​ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి సూత్రధారి అయిన ముదస్సిర్​ అహ్మద్​ ఖాన్​కు సజ్జద్​ అత్యంత సన్నిహితుడు. పుల్వామా కుట్రలోనూ సజ్జద్​ హస్తముందని అనుమానాలున్నాయి.

పుల్వామా దాడికి సంబంధించి.. నలుగురు ఉగ్రవాదులపై(సజ్జద్​, తన్వీర్​, బిలాల్​, ముజఫ్ఫర్​) 120-బీ, 121-ఏ సెక్షన్ల కింద ఛార్జ్​షీట్​ దాఖలైంది. మార్చిలో జరిగిన ఎన్​కౌంటర్​లో పుల్వామా ఉగ్రదాడి సూత్రధారి ముదస్సిర్​ మరణించడం వల్ల అతడి పేరును ఛార్జ్​షీట్​ నుంచి తొలగించారు.

"ఈ నలుగురు ఉగ్రవాదులు పుల్వామాకు చెందిన వారు. తన్వీర్​, బిలాల్​.. పుల్వామా తరహా దాడి చేయాలనుకున్నారు. వీరు సజ్జద్​ సోదరులు, జైషే ఉగ్రవాదులు. వివిధ ఎన్​కౌంటర్లలో వీరిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అనంతరం సజ్జద్​ జైషేలో చేరాడు. దిల్లీ-ఎన్​ఆర్​సీ ప్రాంతంలో నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశాలు అందాయి."
-- జాతీయ నిఘా సంస్థ.

దిల్లీ లజ్​పత్​ రాయ్​ మార్కెట్​ సమీపంలో సంచరిస్తూ పోలీసులకు చిక్కాడు సజ్జద్​.

ఇదీ చూడండి:- కర్తార్​పుర్​ నడవా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

AP Video Delivery Log - 1300 GMT Horizons
Monday, 16 September, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1225: HZ Hungary Star Wars Exhibit AP Clients Only 4230185
Star Wars exhibit marks 40 years since Hungary premiere
AP-APTN-1203: HZ Russia China Festival AP Clients Only 4230182
Festival celebrates 70 years of Chinese-Russian relations
AP-APTN-1057: HZ UK Design Festival AP Clients Only 4230163
Designers embrace sustainability at London festival
AP-APTN-1043: HZ Tanzania Rhino Relocation AP Clients Only 4229878
Ambitious conservation project lands nine black rhinos in the Serengeti ++CORRECTED SCRIPT++
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Sep 30, 2019, 9:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.