ETV Bharat / bharat

'ఈ రైలు సర్వీసులతో కేవడియా పర్యటకానికి ఫుల్​ జోష్'​

author img

By

Published : Jan 17, 2021, 12:06 PM IST

Updated : Jan 17, 2021, 1:07 PM IST

ఐక్యతా విగ్రహం ఉన్న గుజరాత్​లోని కేవడియా ప్రాంతాన్ని కలిపే 8 రైళ్లను ప్రధాని మోదీ లాంఛనంగా ప్రారంభించారు. ఈ రైలు సర్వీసుల సదుపాయంతో పర్యటకుల సంఖ్య పెరగడం సహా.. స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలను కల్పిస్తుందని మోదీ తెలిపారు.

Kevadia trains
'కేవడియా'ను కలిపే 8 రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఐక్యతా విగ్రహం ఉన్న గుజరాత్​లోని కేవడియా ప్రాంతంలో పర్యటకుల సంఖ్య పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేవడియా ప్రాంతాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలతో కలిపే 8 రైళ్లకు ప్రధాని పచ్చజెండా ఊపి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసుల ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  • Prime Minister Narendra Modi flags off eight trains connecting Statue of Unity in Kevadia, Gujarat with different regions of the country, via video conference. pic.twitter.com/QkzIB0bnKG

    — ANI (@ANI) January 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

''ఈరోజు ప్రారంభించిన రైలు సర్వీసుల్లో ఒకటి పురుచ్చి తలైవార్​ డా.ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్​)​ మధ్య రైల్వే స్టేషన్​ నుంచి ప్రారంభమైంది. ఈరోజే ఎంజీఆర్​ జయంతి కావడం కాకతాళీయం. పేద ప్రజల సేవ కోసం ఎంజీఆర్​ తన జీవితాన్ని అంకితం చేశారు. ఐక్యతా విగ్రహాన్ని చూసేందుకు వచ్చే పర్యటకులకు ఈ కనెక్టివిటీ.. ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కేవడియా గిరిజన తెగల జీవితాలను మార్చేందుకు దోహద పడుతుంది. వారికి ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.''

-- ప్రధాని నరేంద్ర మోదీ.

ఐక్యతా విగ్రహం ఉన్న కేవడియా నుంచి దాదర్​, అహ్మదాబాద్​, హజ్రత్​ నిజాముద్దీన్​, రేవా, చెన్నై, ప్రతాప్​నగర్​ ప్రాంతాలను ఈ సర్వీసులు కలపనున్నాయి. వీటితో పాటు బ్రాడ్‌గేజ్‌ మార్గం సహా దాబోయ్‌, చందోడ్‌, కేవడియాల్లో రైల్వే స్టేషన్‌ భవనాలనూ మోదీ ఆదివారం ఆవిష్కరించారు. రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​, గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే, ఉత్తర్​ ప్రదేశ్​ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధాని ప్రారంభించిన 8 రైళ్లలో జన్​శతాబ్ది ఎక్స్​ప్రెస్​ కూడా ఉంది. దీంట్లో విస్టాడోమ్‌ కోచ్‌లు ఉండటం విశేషం.

ఐక్యతా విగ్రహం ఉన్న గుజరాత్​లోని కేవడియా ప్రాంతంలో పర్యటకుల సంఖ్య పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేవడియా ప్రాంతాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలతో కలిపే 8 రైళ్లకు ప్రధాని పచ్చజెండా ఊపి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసుల ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

  • Prime Minister Narendra Modi flags off eight trains connecting Statue of Unity in Kevadia, Gujarat with different regions of the country, via video conference. pic.twitter.com/QkzIB0bnKG

    — ANI (@ANI) January 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

''ఈరోజు ప్రారంభించిన రైలు సర్వీసుల్లో ఒకటి పురుచ్చి తలైవార్​ డా.ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్​)​ మధ్య రైల్వే స్టేషన్​ నుంచి ప్రారంభమైంది. ఈరోజే ఎంజీఆర్​ జయంతి కావడం కాకతాళీయం. పేద ప్రజల సేవ కోసం ఎంజీఆర్​ తన జీవితాన్ని అంకితం చేశారు. ఐక్యతా విగ్రహాన్ని చూసేందుకు వచ్చే పర్యటకులకు ఈ కనెక్టివిటీ.. ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కేవడియా గిరిజన తెగల జీవితాలను మార్చేందుకు దోహద పడుతుంది. వారికి ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.''

-- ప్రధాని నరేంద్ర మోదీ.

ఐక్యతా విగ్రహం ఉన్న కేవడియా నుంచి దాదర్​, అహ్మదాబాద్​, హజ్రత్​ నిజాముద్దీన్​, రేవా, చెన్నై, ప్రతాప్​నగర్​ ప్రాంతాలను ఈ సర్వీసులు కలపనున్నాయి. వీటితో పాటు బ్రాడ్‌గేజ్‌ మార్గం సహా దాబోయ్‌, చందోడ్‌, కేవడియాల్లో రైల్వే స్టేషన్‌ భవనాలనూ మోదీ ఆదివారం ఆవిష్కరించారు. రైల్వే మంత్రి పీయూష్​ గోయల్​, గుజరాత్​ ముఖ్యమంత్రి విజయ్​ రూపానీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్​ ఠాక్రే, ఉత్తర్​ ప్రదేశ్​ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ప్రధాని ప్రారంభించిన 8 రైళ్లలో జన్​శతాబ్ది ఎక్స్​ప్రెస్​ కూడా ఉంది. దీంట్లో విస్టాడోమ్‌ కోచ్‌లు ఉండటం విశేషం.

Last Updated : Jan 17, 2021, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.