ఐక్యతా విగ్రహం ఉన్న గుజరాత్లోని కేవడియా ప్రాంతంలో పర్యటకుల సంఖ్య పెరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కేవడియా ప్రాంతాన్ని దేశంలోని వివిధ ప్రాంతాలతో కలిపే 8 రైళ్లకు ప్రధాని పచ్చజెండా ఊపి ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సర్వీసుల ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
-
Prime Minister Narendra Modi flags off eight trains connecting Statue of Unity in Kevadia, Gujarat with different regions of the country, via video conference. pic.twitter.com/QkzIB0bnKG
— ANI (@ANI) January 17, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Prime Minister Narendra Modi flags off eight trains connecting Statue of Unity in Kevadia, Gujarat with different regions of the country, via video conference. pic.twitter.com/QkzIB0bnKG
— ANI (@ANI) January 17, 2021Prime Minister Narendra Modi flags off eight trains connecting Statue of Unity in Kevadia, Gujarat with different regions of the country, via video conference. pic.twitter.com/QkzIB0bnKG
— ANI (@ANI) January 17, 2021
''ఈరోజు ప్రారంభించిన రైలు సర్వీసుల్లో ఒకటి పురుచ్చి తలైవార్ డా.ఎంజీ రామచంద్రన్(ఎంజీఆర్) మధ్య రైల్వే స్టేషన్ నుంచి ప్రారంభమైంది. ఈరోజే ఎంజీఆర్ జయంతి కావడం కాకతాళీయం. పేద ప్రజల సేవ కోసం ఎంజీఆర్ తన జీవితాన్ని అంకితం చేశారు. ఐక్యతా విగ్రహాన్ని చూసేందుకు వచ్చే పర్యటకులకు ఈ కనెక్టివిటీ.. ఎంతో ఉపయోగపడుతుంది. ఇది కేవడియా గిరిజన తెగల జీవితాలను మార్చేందుకు దోహద పడుతుంది. వారికి ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది.''
-- ప్రధాని నరేంద్ర మోదీ.
ఐక్యతా విగ్రహం ఉన్న కేవడియా నుంచి దాదర్, అహ్మదాబాద్, హజ్రత్ నిజాముద్దీన్, రేవా, చెన్నై, ప్రతాప్నగర్ ప్రాంతాలను ఈ సర్వీసులు కలపనున్నాయి. వీటితో పాటు బ్రాడ్గేజ్ మార్గం సహా దాబోయ్, చందోడ్, కేవడియాల్లో రైల్వే స్టేషన్ భవనాలనూ మోదీ ఆదివారం ఆవిష్కరించారు. రైల్వే మంత్రి పీయూష్ గోయల్, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే, ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగీ ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ప్రధాని ప్రారంభించిన 8 రైళ్లలో జన్శతాబ్ది ఎక్స్ప్రెస్ కూడా ఉంది. దీంట్లో విస్టాడోమ్ కోచ్లు ఉండటం విశేషం.