ETV Bharat / bharat

ఈనెల 20న నీతి ఆయోగ్​ కౌన్సిల్​ భేటీ!

author img

By

Published : Feb 4, 2021, 5:42 PM IST

ఫిబ్రవరి 20న జరగనున్న నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నట్లు అధికార వర్గాలు తెలిపారు. ఈ భేటీలో ఆరోగ్య, ఆర్థిక, శ్రామిక సంస్కరణలు సహా పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం.

PM Modi to chair Niti Aayog's Governing Council meeting on Feb 20
ఈ నెల 20న మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్​ భేటీ!

ఈ నెల 20న నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశం కానుంది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య, ఆర్థిక, శ్రామిక సంస్కరణలు సహా కరోనా వ్యాక్సినేషన్​ కార్యక్రమం గురించి చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. గత సమావేశంలో ఎజెండా అంశాలపై తీసుకున్న చర్యలపై సమీక్షించి.. భవిష్యత్​ అభివృద్ధి కార్యకలాపాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్​ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు సహా సీనియర్​ ప్రభుత్వాధికారులు దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్రధాని నీతి ఆయోగ్​ ఛైర్మన్​గా ఉంటారు. నీతి ఆయోగ్​ పాలక మండలి క్రమం తప్పకుండా సమావేశమవుతుంది. అయితే కరోనా కారణంగా గతేడాది భేటీ కాలేదు.

ఈ నెల 20న నీతి ఆయోగ్​ పాలక మండలి సమావేశం కానుంది. ఈ భేటీకి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు. ఈ సందర్భంగా ఆరోగ్య, ఆర్థిక, శ్రామిక సంస్కరణలు సహా కరోనా వ్యాక్సినేషన్​ కార్యక్రమం గురించి చర్చించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపారు. గత సమావేశంలో ఎజెండా అంశాలపై తీసుకున్న చర్యలపై సమీక్షించి.. భవిష్యత్​ అభివృద్ధి కార్యకలాపాలపై కూడా చర్చించనున్నట్లు సమాచారం.

రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్​ గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు సహా సీనియర్​ ప్రభుత్వాధికారులు దీనిలో సభ్యులుగా ఉంటారు. ప్రధాని నీతి ఆయోగ్​ ఛైర్మన్​గా ఉంటారు. నీతి ఆయోగ్​ పాలక మండలి క్రమం తప్పకుండా సమావేశమవుతుంది. అయితే కరోనా కారణంగా గతేడాది భేటీ కాలేదు.

ఇదీ చూడండి: సాగు చట్టాలపై విపక్షాల నిరసన- లోక్​సభ వాయిదా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.