ఉత్తర్ప్రదేశ్ ఝాన్సీలోని రాణి లక్ష్మీబాయి కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (ఆర్ఎల్బీ) పరిపాలన, కళాశాల భవనాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ప్రధామంత్రి నరేంద్ర మోదీ. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.
2014-15లో తొలి విద్యా సంవత్సరాన్ని ప్రారంభించింది ఆర్ఎల్బీ విశ్వవిద్యాలయం. వ్యవసాయ, ఉద్యానవన, అటవీ సంరక్షణలో డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తోంది.
సొంత భవనాలు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. ప్రస్తుతం ఝాన్సీలోని భారతీయ పచ్చికబయళ్లు, పశుగ్రాస పరిశోధన ఇన్స్టిట్యూట్ (ఐజీఎఫ్ఆర్ఐ) లో తరగతులను నిర్వహిస్తున్నారు.
ఇదీ చూడండి: జపాన్ ప్రధాని త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్ష