ETV Bharat / bharat

పాక్​ దుశ్చర్య- రాజౌరీలో కాల్పులు

author img

By

Published : Jan 2, 2021, 9:14 PM IST

నియంత్రణ రేఖ వెంబడి జమ్ముకశ్మీర్​లోని రాజౌరీలో పాక్​ మరోసారి తన వక్రబుద్ధిని చాటుకుంది. చిన్న ఆయుధాలు, మోర్టార్​ షెల్స్​తో దాడికి దిగింది. మరోవైపు జమ్ముకశ్మీర్​ కుల్గాం​లో జరిపిన తనిఖీల్లో ఓ ఉగ్రవాదికి సహాయం చేసే వ్యక్తి నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

Pak Army shells J&K's Rajouri
పాక్​ దుశ్చర్య- రాజౌరీలో కాల్పులు

జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్థాన్. తాజాగా రాజౌరీ జిల్లాలో మోర్టార్​ షెల్స్​తో దాడికి దిగింది. పాక్​ దుశ్చర్యకు భారత్​ దీటుగా బదులిచ్చింది.

"రాజౌరీ జిల్లాలోని నౌషేరా సెక్టార్​లో సాయంత్రం 4.45 గంటలకు పాక్ కాల్పులకు పాల్పడింది. చిన్న ఆయుధాలు, మోర్టార్​ షెల్స్​తో దాడికి దిగింది. ఇందుకు భారత ఆర్మీ బదులిచ్చింది."

-రక్షణ శాఖ ప్రతినిధి.

పాక్​ శుక్రవారం జరిపిన కాలుల్లో జేసీఓ నాయబ్ సుబేదార్ రవీందర్ మృతిచెందారని రక్షణ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:2020లో 5,100సార్లు పాక్ కాల్పులు

ఆయుధాలు స్వాధీనం..

శనివారం.. జమ్ముకశ్మీర్​ కుల్గాంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భాగంగా ఓ ఉగ్రవాదికి సహాయం చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చైనీస్ గ్రెనేడ్​, పిస్టోల్​ మొదలైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

police recovered arms and ammunition in Kulgam
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

ఇదీ చదవండి:కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి

జమ్ముకశ్మీర్​లోని నియంత్రణ రేఖ వెంబడి మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచింది పాకిస్థాన్. తాజాగా రాజౌరీ జిల్లాలో మోర్టార్​ షెల్స్​తో దాడికి దిగింది. పాక్​ దుశ్చర్యకు భారత్​ దీటుగా బదులిచ్చింది.

"రాజౌరీ జిల్లాలోని నౌషేరా సెక్టార్​లో సాయంత్రం 4.45 గంటలకు పాక్ కాల్పులకు పాల్పడింది. చిన్న ఆయుధాలు, మోర్టార్​ షెల్స్​తో దాడికి దిగింది. ఇందుకు భారత ఆర్మీ బదులిచ్చింది."

-రక్షణ శాఖ ప్రతినిధి.

పాక్​ శుక్రవారం జరిపిన కాలుల్లో జేసీఓ నాయబ్ సుబేదార్ రవీందర్ మృతిచెందారని రక్షణ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.

ఇదీ చదవండి:2020లో 5,100సార్లు పాక్ కాల్పులు

ఆయుధాలు స్వాధీనం..

శనివారం.. జమ్ముకశ్మీర్​ కుల్గాంలో పోలీసులు జరిపిన తనిఖీల్లో భాగంగా ఓ ఉగ్రవాదికి సహాయం చేసే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. చైనీస్ గ్రెనేడ్​, పిస్టోల్​ మొదలైన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.

police recovered arms and ammunition in Kulgam
పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆయుధాలు

ఇదీ చదవండి:కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి సీడీఎస్‌సీఓ అనుమతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.