ETV Bharat / bharat

రాజకీయ పొత్తులపై కమల్​ పార్టీ స్పష్టత

author img

By

Published : Nov 3, 2020, 10:55 AM IST

ప్రజలతోనే తమ కూటమి ఉంటుందని కమల్ ​హాసన్ నేతృత్వంలోని మక్కల్ నీది మయ్యమ్ పార్టీ స్పష్టం చేసింది. కమల్ అధ్యక్షతన జరిగిన జిల్లా స్థాయి కార్యదర్శుల సమావేశం అనంతరం అధికారిక ప్రకటన విడుదల చేసింది. విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది.

'Our Alliance is with the people' says Kamal's party statement
మా కూటమి ప్రజలతోనే: కమల్​హాసన్

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ సమావేశమైంది. కమల్​హాసన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా స్థాయి కార్యదర్శులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ విధివిధానాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

'Our Alliance is with the people' says Kamal's party statement
జిల్లా స్థాయి కార్యదర్శుల సమావేశం

తమ కూటమి ప్రజలతోనే ఉంటుందని సమావేశం అనంతరం పార్టీ స్పష్టం చేసింది. విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కార్యకర్తలకు సూచించింది.

తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలైన డీఎంకే, ఎండీఎంకే మధ్యే పోటీ నెలకొనే అవకాశం ఉంది.

తమిళనాడులో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో మక్కల్ నీది మయ్యమ్ పార్టీ సమావేశమైంది. కమల్​హాసన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా స్థాయి కార్యదర్శులు పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ విధివిధానాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

'Our Alliance is with the people' says Kamal's party statement
జిల్లా స్థాయి కార్యదర్శుల సమావేశం

తమ కూటమి ప్రజలతోనే ఉంటుందని సమావేశం అనంతరం పార్టీ స్పష్టం చేసింది. విజయం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కార్యకర్తలకు సూచించింది.

తమిళనాడు అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీలైన డీఎంకే, ఎండీఎంకే మధ్యే పోటీ నెలకొనే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.