ETV Bharat / bharat

'పక్కా ప్రణాళికతోనే జేఎన్​యూ విద్యార్థులపై దాడి'

author img

By

Published : Jan 6, 2020, 5:16 AM IST

Updated : Jan 6, 2020, 10:12 AM IST

జేఎన్​యూలో చెలరేగిన ఘర్షణపై కాంగ్రెస్​ సహా వివిధ పార్టీలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి. అధికార భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు ప్రియాంక గాంధీ. మరోవైపు.. జేఎన్​యూ ఘటనకు వ్యతిరేకంగా దిల్లీలో విద్యార్థులు అర్ధరాత్రి నిరసన చేపట్టారు.

OPPOSITION BLAMES GOVERNMENT FOR  JNU INCIDENT
'పక్కా ప్రణాళికతోనే జేఎన్​యూ విద్యార్థులపై దాడి'
'పక్కా ప్రణాళికతోనే జేఎన్​యూ విద్యార్థులపై దాడి'

జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్​ తీవ్రంగా ఖండించింది. దేశాన్ని నియంత్రిస్తున్న నియంతృత్వవాదులకు.. విద్యార్థుల పట్ల ఉన్న భయాన్ని ఈ హింసాత్మక ఘటన ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ పేర్కొన్నారు. వర్సిటీలో విద్యార్థుల భద్రతపై ఆవేదన వ్యక్తం చేశారు.

జేఎన్​యూ ఘటనపై స్పందనలు

ఆదివారం జేఎన్​యూ విశ్వవిద్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు.. ముఖాలకు మాస్కులు ధరించి.. విద్యార్థులపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 28 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎయిమ్స్​కు తరలించారు.​

మరోవైపు ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న 25మంది విద్యార్థులను కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్​ వేదికగా విమర్శలు చేశారు.

OPPOSITION BLAMES GOVERNMENT FOR  JNU INCIDENT
ప్రియాంక గాంధీ ట్వీట్​

"ఇప్పుడు మోదీ-షాకు చెందిన గూండాలు విశ్వవిద్యాలయాల్లో హింసను సృష్టిస్తున్నారు. బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్థులను భయపెడుతున్నారు. ఘటనతో సంబంధం లేదని భాజపా నేతల మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ప్రజలు అంతా చూస్తున్నారు. వారిని ఎవరూ మోసం చేయలేరు."
--- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

ఘటనతో షాక్​కు గురైనట్టు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ట్వీట్​ చేశారు. విద్యార్థులపై దారుణంగా దాడి జరిగిందని.. విశ్వవిద్యాలయంలో శాంతిని నెలకొల్పేందుకు పోలీసులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకే భద్రత లేకపోతే ఇక దేశం ఏలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.

OPPOSITION BLAMES GOVERNMENT FOR  JNU INCIDENT
కేజ్రీవాల్​ ట్వీట్​

వర్సిటీలో చెలరేగిన హింసకు ఘటనకు ఏబీవీపీ కారణమని ఆరోపించారు సీపీఐ(ఎం​) ప్రధాన కార్యదర్శి సీతారామ్​ ఏచూరీ. అధికారంలో ఉన్న వారు పక్కా ప్రణాళికతో దాడి జరిపించినట్టు అభిప్రాయపడ్డారు.

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేఎన్​యూ పూర్వవిద్యార్థులైన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​, విదేశాంగమంత్రి జైశంకర్​.. ఆదివారం జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అర్ధరాత్రి నిరసనలు...

మరోవైపు... జేఎన్​యూ ఘటనతో విద్యార్థి లోకం భగ్గుమంది. విశ్వవిద్యాలయం బయట విద్యార్థులు బైఠాయించారు. తమకు న్యాయం జరగాలంటూ డిమాండ్​ చేశారు. నినాదాలతో వర్సిటీ ప్రాంగణం హోరెత్తింది.

దిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయానికి నిరసన సెగ తాకింది. వందలాది మంది విద్యార్థులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దేశవ్యాప్తంగా...

ముంబయిలోని గేట్​ వే ఆఫ్​ ఇండియా వద్ద వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు నిరసనలు చేపట్టారు. జేఎన్​యూ ఘటనలో గాయపడిన వారికి సంఘీభావం తెలిపారు. కోల్​కతాలోనూ ఇదే తరహా నిరసన చేపట్టారు విద్యార్థులు. పోస్టర్లతో నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు కూడా జేఎన్​యూ ఘటనపై ఆందోళన చేపట్టారు.

'పక్కా ప్రణాళికతోనే జేఎన్​యూ విద్యార్థులపై దాడి'

జవహర్​లాల్​ నెహ్రూ విశ్వవిద్యాలయంలో విద్యార్థులపై జరిగిన దాడి ఘటనను కాంగ్రెస్​ తీవ్రంగా ఖండించింది. దేశాన్ని నియంత్రిస్తున్న నియంతృత్వవాదులకు.. విద్యార్థుల పట్ల ఉన్న భయాన్ని ఈ హింసాత్మక ఘటన ప్రతిబింబిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్​ గాంధీ పేర్కొన్నారు. వర్సిటీలో విద్యార్థుల భద్రతపై ఆవేదన వ్యక్తం చేశారు.

జేఎన్​యూ ఘటనపై స్పందనలు

ఆదివారం జేఎన్​యూ విశ్వవిద్యాలయంలో గుర్తుతెలియని వ్యక్తులు.. ముఖాలకు మాస్కులు ధరించి.. విద్యార్థులపై దాడికి తెగబడ్డారు. విచక్షణారహితంగా కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో 28 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఎయిమ్స్​కు తరలించారు.​

మరోవైపు ఎయిమ్స్​లో చికిత్స పొందుతున్న 25మంది విద్యార్థులను కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పరామర్శించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వంపై ట్విట్టర్​ వేదికగా విమర్శలు చేశారు.

OPPOSITION BLAMES GOVERNMENT FOR  JNU INCIDENT
ప్రియాంక గాంధీ ట్వీట్​

"ఇప్పుడు మోదీ-షాకు చెందిన గూండాలు విశ్వవిద్యాలయాల్లో హింసను సృష్టిస్తున్నారు. బంగారు భవిష్యత్తు కోసం కలలు కంటున్న విద్యార్థులను భయపెడుతున్నారు. ఘటనతో సంబంధం లేదని భాజపా నేతల మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ ప్రజలు అంతా చూస్తున్నారు. వారిని ఎవరూ మోసం చేయలేరు."
--- ప్రియాంక గాంధీ, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి.

ఘటనతో షాక్​కు గురైనట్టు దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ ట్వీట్​ చేశారు. విద్యార్థులపై దారుణంగా దాడి జరిగిందని.. విశ్వవిద్యాలయంలో శాంతిని నెలకొల్పేందుకు పోలీసులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. విద్యార్థులకే భద్రత లేకపోతే ఇక దేశం ఏలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు.

OPPOSITION BLAMES GOVERNMENT FOR  JNU INCIDENT
కేజ్రీవాల్​ ట్వీట్​

వర్సిటీలో చెలరేగిన హింసకు ఘటనకు ఏబీవీపీ కారణమని ఆరోపించారు సీపీఐ(ఎం​) ప్రధాన కార్యదర్శి సీతారామ్​ ఏచూరీ. అధికారంలో ఉన్న వారు పక్కా ప్రణాళికతో దాడి జరిపించినట్టు అభిప్రాయపడ్డారు.

బంగాల్​ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జేఎన్​యూ పూర్వవిద్యార్థులైన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్​, విదేశాంగమంత్రి జైశంకర్​.. ఆదివారం జరిగిన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

అర్ధరాత్రి నిరసనలు...

మరోవైపు... జేఎన్​యూ ఘటనతో విద్యార్థి లోకం భగ్గుమంది. విశ్వవిద్యాలయం బయట విద్యార్థులు బైఠాయించారు. తమకు న్యాయం జరగాలంటూ డిమాండ్​ చేశారు. నినాదాలతో వర్సిటీ ప్రాంగణం హోరెత్తింది.

దిల్లీ పోలీసు ప్రధాన కార్యాలయానికి నిరసన సెగ తాకింది. వందలాది మంది విద్యార్థులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

దేశవ్యాప్తంగా...

ముంబయిలోని గేట్​ వే ఆఫ్​ ఇండియా వద్ద వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులు నిరసనలు చేపట్టారు. జేఎన్​యూ ఘటనలో గాయపడిన వారికి సంఘీభావం తెలిపారు. కోల్​కతాలోనూ ఇదే తరహా నిరసన చేపట్టారు విద్యార్థులు. పోస్టర్లతో నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. ఉత్తర్​ప్రదేశ్​లోని అలీగఢ్​ ముస్లిం యూనివర్సిటీ విద్యార్థులు కూడా జేఎన్​యూ ఘటనపై ఆందోళన చేపట్టారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
TWITTER/@realDonaldTrump - AP CLIENTS ONLY
Internet - 5 January 2020
1. STILL: screengrab of tweet by US President Donald Trump reading (English): "These Media Posts will serve as notification to the United States Congress that should Iran strike any U.S. person or target, the United States will quickly & fully strike back, & perhaps in a disproportionate manner. Such legal notice is not required, but is given nevertheless!"
STORYLINE:
US President Donald Trump on Sunday tweeted that the US would strike back "quickly & fully" should Iran strike any US targets in the Middle East.
Trump added any US response could be in a "disproportionate manner".
Meanwhile, residents of the Iraq's capital of Baghdad said three explosions were heard inside the heavily-fortified Green Zone, home to the US Embassy and the seat of Iraq's government.
This was the second such attack in recent days.
Alert sirens were sounded Sunday in the area on the west bank of the Tigris River.
There was no immediate confirmation from authorities but the explosions were believed to have been from mortars or rockets that struck the area.
The strikes come after top Iranian General Qassem Soleimani was killed in a US drone strike in Baghdad.
His killing has escalated the crisis between Iran and the US.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Jan 6, 2020, 10:12 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.