ETV Bharat / bharat

'నిరంకుశ పాలనను మాకూ రుచి చూపించారు'

ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్​ ప్రజలను కలిసేందుకు వెళ్లిన విపక్షాల ప్రతినిధి బృందాన్ని రాష్ట్ర సర్కారు వెనక్కి పంపడాన్ని కాంగ్రెస్ నేత రాహుల్​ గాంధీ తప్పుబట్టారు. కశ్మీరీలపై సర్కారు నిరంకుశ వైఖరిని తామూ స్వయంగా అనుభవించామన్నారు.

author img

By

Published : Aug 26, 2019, 6:01 AM IST

Updated : Sep 28, 2019, 7:01 AM IST

'నిరంకుశ పాలనను మాకూ రుచి చూపించారు'
'నిరంకుశ పాలనను మాకూ రుచి చూపించారు'

శ్రీనగర్ సందర్శనకు ప్రయత్నించిన సమయంలో సర్కారు నిరంకుశ, క్రూరమైన పాలనను విపక్షాలు, మీడియా రుచి చూశాయని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్​లోయలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు రాహుల్ సహా విపక్ష నేతలతో కూడిన ప్రతినిధి బృందం శ్రీనగర్​కు వెళ్లింది. కానీ అధికారులు విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లేందుకు నేతలను అనుమతించకపోయిన కారణంగా... రాష్ట్రంలో పర్యటించకుండానే వెనుదిరిగారు.

rahul
రాహుల్ ట్వీట్

"జమ్ముకశ్మీర్ ప్రజల స్వాతంత్య్రాన్ని రద్దు చేసి 20 రోజులవుతుంది. జమ్ముకశ్మీర్​లో నెలకొన్న నిరంకుశ పాలనను విపక్షనేతలు, మీడియా రుచిచూశారు."

- ట్విట్టర్​లో రాహుల్ గాంధీ

విపక్ష నేతలు శ్రీనగర్​ను వీడాలన్న ఆదేశాలను చదివి వినిపిస్తోన్న అధికారుల దృశ్యాలు, రాహుల్ మాట్లాడుతున్న వీడియోను పోస్ట్​ చేశారు కాంగ్రెస్ నేత.

ఇదీ చూడండి: గంటలపాటు పాముకు శస్త్రచికిత్స... ప్రాణాలు సేఫ్

'నిరంకుశ పాలనను మాకూ రుచి చూపించారు'

శ్రీనగర్ సందర్శనకు ప్రయత్నించిన సమయంలో సర్కారు నిరంకుశ, క్రూరమైన పాలనను విపక్షాలు, మీడియా రుచి చూశాయని వ్యాఖ్యానించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆర్టికల్ 370 రద్దు అనంతరం కశ్మీర్​లోయలో నెలకొన్న పరిస్థితులను తెలుసుకునేందుకు రాహుల్ సహా విపక్ష నేతలతో కూడిన ప్రతినిధి బృందం శ్రీనగర్​కు వెళ్లింది. కానీ అధికారులు విమానాశ్రయం నుంచి బయటకు వెళ్లేందుకు నేతలను అనుమతించకపోయిన కారణంగా... రాష్ట్రంలో పర్యటించకుండానే వెనుదిరిగారు.

rahul
రాహుల్ ట్వీట్

"జమ్ముకశ్మీర్ ప్రజల స్వాతంత్య్రాన్ని రద్దు చేసి 20 రోజులవుతుంది. జమ్ముకశ్మీర్​లో నెలకొన్న నిరంకుశ పాలనను విపక్షనేతలు, మీడియా రుచిచూశారు."

- ట్విట్టర్​లో రాహుల్ గాంధీ

విపక్ష నేతలు శ్రీనగర్​ను వీడాలన్న ఆదేశాలను చదివి వినిపిస్తోన్న అధికారుల దృశ్యాలు, రాహుల్ మాట్లాడుతున్న వీడియోను పోస్ట్​ చేశారు కాంగ్రెస్ నేత.

ఇదీ చూడండి: గంటలపాటు పాముకు శస్త్రచికిత్స... ప్రాణాలు సేఫ్

Biarritz (France), Aug 26 (ANI): Prime Minister Narendra Modi gathered with the leaders of G7 member countries for a group photo in French city Biarritz. US President Donald Trump, French President Emmanuel Macron, Canadian Prime Minister Justin Trudeau among others gathered for the family picture. Earlier, PM Modi was received by French President Emmanuel Macron at the Hotel du Palais where the G7 Summit will be held on August 26.

Last Updated : Sep 28, 2019, 7:01 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.