భారత్లో కరోనా టీకా అభివృద్ధి చేస్తున్న సంస్థల వివరాలు, వ్యాక్సిన్ నిల్వలను తెలుసుకునేందుకు ఎలక్ట్రానిక్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్(ఈ-విన్ ) అనే డిజిటల్ ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయనుంది కేంద్రం. ఈ ఆన్లైన్ వేదిక ద్వారా వ్యాక్సిన్ తయారీ, నిర్వహణ, రవాణా, సేకరణ నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చేంత వరకు వివిధ దశల్లోని సమాచారాన్ని తెలుసుకోవచ్చని అధికార వర్గాలు తెలిపాయి.
"ప్రస్తుత ప్రణాళిక ప్రకారం అన్నీ అనుకున్నట్లు జరిగితే కేంద్రం అంచనా మేరకు 2021 జులై నాటికి దేశంలో 20నుంచి 25కోట్లమందికి వ్యాక్సిన్ అందజేస్తాం. ముందుగా ఏ వయస్సు వారికి వ్యాక్సిన్ ఇవ్వనున్నారో రాష్ట్రాలు ఒక జాబితాను కేంద్రానికి అందజేయాలి."
---హర్షవర్ధన్, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి.