ETV Bharat / bharat

'సాధారణ స్థితికి జమ్ముకశ్మీర్ జనజీవనం'

జమ్ముకశ్మీర్​ పరిస్థితిపై ఆ రాష్ట్ర అధికారులు సోమవారం ప్రకటన విడుదల చేశారు. పరిస్థితి అదుపులోనే ఉందని, ఎలాంటి శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాలేదని వెల్లడించారు. కశ్మీర్ ​లోయలో రాళ్లదాడి వంటి ఘటనలు అతిస్వల్పంగా జరిగాయని... నిందితులతో చట్టప్రకారం వ్యవహరిస్తామని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

author img

By

Published : Aug 20, 2019, 6:51 AM IST

Updated : Sep 27, 2019, 2:50 PM IST

'సాధారణ స్థితికి జమ్ముకశ్మీర్ జనజీవనం'
'సాధారణ స్థితికి జమ్ముకశ్మీర్ జనజీవనం'

జమ్ముకశ్మీర్​లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు నమోదు కాలేదని ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. కశ్మీర్​ లోయలో నెమ్మదిగా జనజీవనం సాధారణ స్థితికి చేరుతోందని స్పష్టం చేశారు.

"కశ్మీర్​లోయలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాలేదు...జనజీవనం సాధారణ స్థితికి వస్తోంది. ప్రజలు సహకరిస్తున్నారు. జమ్ము ప్రాంతంలో ఎలాంటి సంఘటన జరగలేదు. ఆదివారం కొన్ని వదంతులు వ్యాపించాయి. స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఎలాంటి వార్తలను నమ్మవద్దని ప్రభుత్వం తరఫున ప్రజలకు విన్నవిస్తున్నాం."

-సయీద్ సెరిష్ అస్గర్, సమాచార ప్రజా సంబంధాల అధికారిణి

సోమవారం చాలా ప్రాంతాల్లో ఆంక్షల ఎత్తివేత, సడలింపు చేపట్టామని కశ్మీర్ సెంట్రల్ డీఐజీ వీకే బిర్ది వెల్లడించారు. అక్కడక్కడా రాళ్లదాడి జరిగిందని... చట్టానికి అనుగుణంగా నిందితులతో వ్యవహరిస్తామని వెల్లడించారు.

మోగిన బడి గంట...

సోమవారమే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటిరోజు పాఠశాలలకు హాజరైన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని సమాచారం. ప్రభుత్వ అధీనంలోని పాఠశాలలు ప్రారంభం కాగా.... ప్రైవేటు బడుల మూసివేత కొనసాగింది. భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో పిల్లలను స్కూలుకు పంపించడం ఆందోళనకరంగా ఉందని పలువురు తల్లిదండ్రులు వాపోయారు.

వైద్యానికి ఇబ్బంది...

కశ్మీర్ ప్రజలు మందుల కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండు వారాలపాటు కర్ఫ్యూ విధించిన కారణంగా శ్రీనగర్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో సరుకు రవాణా నిలిచిపోయింది. ఈ కారణంగా వైద్య సామగ్రి తరలింపునకు ఇబ్బంది కలిగింది. 14 రోజులుగా కశ్మీర్​లోయలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రవాణా, సమాచార సేవలు నిలిచిపోయాయి.

ఇదీ చూడండి: నేరగాళ్లకు వింజామరలు

'సాధారణ స్థితికి జమ్ముకశ్మీర్ జనజీవనం'

జమ్ముకశ్మీర్​లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ఘటనలు నమోదు కాలేదని ఆ రాష్ట్ర అధికారులు వెల్లడించారు. కశ్మీర్​ లోయలో నెమ్మదిగా జనజీవనం సాధారణ స్థితికి చేరుతోందని స్పష్టం చేశారు.

"కశ్మీర్​లోయలో ఎలాంటి శాంతిభద్రతల సమస్య ఉత్పన్నం కాలేదు...జనజీవనం సాధారణ స్థితికి వస్తోంది. ప్రజలు సహకరిస్తున్నారు. జమ్ము ప్రాంతంలో ఎలాంటి సంఘటన జరగలేదు. ఆదివారం కొన్ని వదంతులు వ్యాపించాయి. స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఎలాంటి వార్తలను నమ్మవద్దని ప్రభుత్వం తరఫున ప్రజలకు విన్నవిస్తున్నాం."

-సయీద్ సెరిష్ అస్గర్, సమాచార ప్రజా సంబంధాల అధికారిణి

సోమవారం చాలా ప్రాంతాల్లో ఆంక్షల ఎత్తివేత, సడలింపు చేపట్టామని కశ్మీర్ సెంట్రల్ డీఐజీ వీకే బిర్ది వెల్లడించారు. అక్కడక్కడా రాళ్లదాడి జరిగిందని... చట్టానికి అనుగుణంగా నిందితులతో వ్యవహరిస్తామని వెల్లడించారు.

మోగిన బడి గంట...

సోమవారమే పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. మొదటిరోజు పాఠశాలలకు హాజరైన విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉందని సమాచారం. ప్రభుత్వ అధీనంలోని పాఠశాలలు ప్రారంభం కాగా.... ప్రైవేటు బడుల మూసివేత కొనసాగింది. భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో పిల్లలను స్కూలుకు పంపించడం ఆందోళనకరంగా ఉందని పలువురు తల్లిదండ్రులు వాపోయారు.

వైద్యానికి ఇబ్బంది...

కశ్మీర్ ప్రజలు మందుల కొరతతో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. రెండు వారాలపాటు కర్ఫ్యూ విధించిన కారణంగా శ్రీనగర్​ అంతర్జాతీయ విమానాశ్రయంలో సరుకు రవాణా నిలిచిపోయింది. ఈ కారణంగా వైద్య సామగ్రి తరలింపునకు ఇబ్బంది కలిగింది. 14 రోజులుగా కశ్మీర్​లోయలో కర్ఫ్యూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో రవాణా, సమాచార సేవలు నిలిచిపోయాయి.

ఇదీ చూడండి: నేరగాళ్లకు వింజామరలు

New Delhi, Aug 20 (ANI): Scientists have identified biologically active molecular components of humic substances extracted from coal, and discovered substances with antiviral activity against the tick-borne encephalitis virus. The study was published in the journal 'Scientific Reports'. Natural multicomponent mixtures, such as humic substances found in soil, peat, and coal are a significant source of biologically active compounds. Understanding their composition and extracting active components can be a great help in creating new drugs. However, finding a specific compound in these environments is a highly challenging task that requires advanced methods capable of differentiating and separating one substance from another. The study revealed that humic substances inhibit the reproduction of a dangerous human pathogen, tick-borne encephalitis virus. The authors relied on high-resolution mass spectrometry to study the composition of humic samples and chemoinformatics to analyse their findings.
Last Updated : Sep 27, 2019, 2:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.