ETV Bharat / bharat

"రోడ్​షోలు, బైక్​ర్యాలీలపై నిషేధం లేదు"

ఎన్నికల ప్రచారాల్లో రోడ్​షోలను, బైక్​ ర్యాలీలను నిషేధించాలన్న వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఇలాంటి పిటిషన్​లను ప్రోత్సహించేది లేదని స్పష్టం చేసింది.

author img

By

Published : Mar 25, 2019, 10:05 PM IST

Updated : Mar 25, 2019, 11:19 PM IST

రోడ్​షోలు, బైక్​ర్యాలీలపై నిషేధం లేదు
రోడ్​షోలు, బైక్​ర్యాలీలపై నిషేధం లేదు
ఎన్నికల ప్రచారాల్లో రోడ్​ షోలు, బైక్ ర్యాలీలను నిషేధించాలన్న పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇలాంటి వ్యాజ్యాలను ప్రోత్సహించేది లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఎన్నికల్లో రోడ్​ షోలు, బైక్​ ర్యాలీలు... వాయు, శబ్ద కాలుష్యాలకు కారణమవుతున్నాయని ఉత్తర్​ప్రదేశ్​ డీజీపీ, వాతావరణ అధికారులు సుప్రీంలో వ్యాజ్యం వేశారు. రాజకీయ నేతల ప్రచారాలు ట్రాఫిక్​ జామ్​లకు కారణమవుతున్నాయని, ప్రజాజీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల నేతల రోడ్​షోలు, బైక్​ ర్యాలీలపై నిషేధం విధించాల్సిందిగా ఎన్నికల సంఘానికి ఆదేశించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రోడ్ షోలో పాల్గొనే వాహనాలకు రిజిస్ట్రేషన్​ తప్పనిసరి. ఒక కాన్వాయ్​కి 10కి మించి చక్రాలు ఉండకూడదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈసీ నిబంధనలను ఏ రాజకీయ పార్టీ పాటించడం లేదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం వ్యాజ్యాన్ని కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది.

రోడ్​షోలు, బైక్​ర్యాలీలపై నిషేధం లేదు
ఎన్నికల ప్రచారాల్లో రోడ్​ షోలు, బైక్ ర్యాలీలను నిషేధించాలన్న పిటిషన్​ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఇలాంటి వ్యాజ్యాలను ప్రోత్సహించేది లేదని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్​ గొగొయ్​ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పునిచ్చింది.

ఎన్నికల్లో రోడ్​ షోలు, బైక్​ ర్యాలీలు... వాయు, శబ్ద కాలుష్యాలకు కారణమవుతున్నాయని ఉత్తర్​ప్రదేశ్​ డీజీపీ, వాతావరణ అధికారులు సుప్రీంలో వ్యాజ్యం వేశారు. రాజకీయ నేతల ప్రచారాలు ట్రాఫిక్​ జామ్​లకు కారణమవుతున్నాయని, ప్రజాజీవనానికి ఆటంకం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు. అందువల్ల నేతల రోడ్​షోలు, బైక్​ ర్యాలీలపై నిషేధం విధించాల్సిందిగా ఎన్నికల సంఘానికి ఆదేశించాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రోడ్ షోలో పాల్గొనే వాహనాలకు రిజిస్ట్రేషన్​ తప్పనిసరి. ఒక కాన్వాయ్​కి 10కి మించి చక్రాలు ఉండకూడదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. ఈసీ నిబంధనలను ఏ రాజకీయ పార్టీ పాటించడం లేదని వ్యాజ్యంలో పేర్కొన్నారు. వాదనలు విన్న ధర్మాసనం వ్యాజ్యాన్ని కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది.

Intro:Body:

gbnhgf


Conclusion:
Last Updated : Mar 25, 2019, 11:19 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.