కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ సంయుక్తంగా నిర్వహించనున్న కాంక్లెవ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. 'జాతీయ విద్యా విధానంలో భాగంగా ఉన్నత విద్యలో పరివర్తన, సంస్కరణల' అంశంపై మోదీ ప్రసంగించనున్నారు.
కాంక్లేవ్లో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన నూతన విద్యా విధానానికి సంబంధించి ప్రత్యేక చర్చలు జరగనున్నాయి. మల్టీడిసిప్లినరీ, ఫ్యూచరిస్టిక్ విద్య, నాణ్యమైన పరిశోధనలో మెరుగైన ఫలితాల కోసం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడంపై నిపుణులు తమ అభిప్రాయాలు పంచుకోనున్నారు.
మంత్రుల నుంచి ప్లిన్సిపల్స్ వరకు..
మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్, కేంద్ర సహాయ మంత్రి సంజయ్ ధోత్రే ఈ సమావేశానికి హాజరుకానున్నారు. జాతీయ విద్యా విధానం ముసాయిదా రూపొందించిన కమిటీ ఛైర్మన్, సభ్యులతో పాటు ప్రముఖ విద్యావేత్తలు, శాస్త్రవేత్తలు కార్యక్రమంలో పాల్గొననున్నారు. విద్యా విధానానికి సంబంధించి వివిధ అంశాలపై మాట్లాడనున్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతులు, విద్యా సంస్థల డైరెక్టర్లు, ప్రిన్సిపల్స్ తదితరులు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కానున్నారు.