ETV Bharat / bharat

'బిహార్​ ఎన్నికల్లో ఎన్​డీఏకు 220 సీట్లు ఖాయం' - నిత్యానంద రాయ్

బిహార్​ శాసనసభ ఎన్నికల్లో ఎన్​డీఏ 220 స్థానాల్లో విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్​ జోస్యం చెప్పారు. ప్రధాని మోదీ నాయకత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులే రాష్ట్రంలో భారీ విజయాన్ని అందిస్తాయని అభిప్రాయపడ్డారు.

bihar elections
నిత్యానంద రాయ్
author img

By

Published : Sep 12, 2020, 2:31 PM IST

బిహార్​లో మళ్లీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్​డీఏ)దే అధికారమని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్​ ధీమా వ్యక్తం చేశారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్​డీఏ 220 స్థానాలకు గెలుచుకోవటం ఖాయమని జోస్యం చెప్పారు.

బిహార్​ ఎన్నికలపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు నిత్యానంద రాయ్​. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులే తమకు విజయాన్ని అందిస్తాయన్నారు రాయ్​.

పరిశ్రమలకు ఊతం..

ఈ ఎన్నికల్లో కరోనా సంక్షోభంలో నిరుపేదలకు అందించిన సాయం, అయోధ్య రామాలయం నిర్మాణ ప్రారంభం వంటివి ముఖ్యమైన అంశాలుగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో అనేక పరిశ్రమలను ప్రారంభించనున్నట్లు తెలిపారు రాయ్​.

బిహార్ ఎన్నికలు..

బిహార్​లోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్​- నవంబర్​లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే పోలింగ్​ తేదీలను ఇంతవరకు వెల్లడించలేదు ఎన్నికల సంఘం. నవంబర్​ 29న ఎన్నికలు ముగిస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'బిహార్​లో అధికారం మళ్లీ ఎన్​డీఏదే'

బిహార్​లో మళ్లీ జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్​డీఏ)దే అధికారమని కేంద్ర మంత్రి నిత్యానంద రాయ్​ ధీమా వ్యక్తం చేశారు. బిహార్ శాసనసభ ఎన్నికల్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్​డీఏ 220 స్థానాలకు గెలుచుకోవటం ఖాయమని జోస్యం చెప్పారు.

బిహార్​ ఎన్నికలపై భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు నిత్యానంద రాయ్​. ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనులే తమకు విజయాన్ని అందిస్తాయన్నారు రాయ్​.

పరిశ్రమలకు ఊతం..

ఈ ఎన్నికల్లో కరోనా సంక్షోభంలో నిరుపేదలకు అందించిన సాయం, అయోధ్య రామాలయం నిర్మాణ ప్రారంభం వంటివి ముఖ్యమైన అంశాలుగా ఉంటాయన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, మత్స్య, పశుసంవర్ధక రంగాల్లో అనేక పరిశ్రమలను ప్రారంభించనున్నట్లు తెలిపారు రాయ్​.

బిహార్ ఎన్నికలు..

బిహార్​లోని 243 అసెంబ్లీ స్థానాలకు అక్టోబర్​- నవంబర్​లో ఎన్నికలు నిర్వహించనున్నారు. అయితే పోలింగ్​ తేదీలను ఇంతవరకు వెల్లడించలేదు ఎన్నికల సంఘం. నవంబర్​ 29న ఎన్నికలు ముగిస్తామని స్పష్టం చేసింది.

ఇదీ చూడండి: 'బిహార్​లో అధికారం మళ్లీ ఎన్​డీఏదే'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.