తమిళనాడులో సంచలనం సృష్టించిన తూత్తుకుడి తండ్రి-కొడుకుల లాకప్డెత్ లాంటి మరొక ఉదంతం వెలుగుచూసింది. సాతాంకుళం స్టేషన్ అధికారులు ఓ వ్యక్తిపై దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
ఇదీ జరిగింది...
సాతాంకుళంలోని తైక్కా వీధిలో నివాసం ఉంటున్న మార్టిన్ను ఆగస్టు 23న ఇన్స్పెక్టర్ జేవియర్, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ పోలీస్ స్టేషన్కు తీసుకొని వెళ్లి చితకబాదారు. మరుసటి రోజు తీవ్రగాయాల కారణంగా తూత్తుకుడి ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించినట్లు బాధితుడు వెల్లడించాడు. ఆగస్టు 24 నుంచి 28 వరకు చట్టవిరుద్ధంగా పోలీసు కస్టడిలో ఉంచారని , తన తరపు న్యాయవాది కోరిన తర్వాతే.. కోర్టులో హాజరు పరిచినట్లు పేర్కొన్నాడు బాధితుడు. తన వాంగ్మూలం విన్న కోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు తెలిపాడు.
మార్టిన్ను అన్యాయంగా పోలీసు కస్టడిలో ఉంచిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అతని కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. అలాగే తమకు రక్షణ కల్పించాలని తమిళనాడు ప్రభుత్వాన్ని కోరారు.