ETV Bharat / bharat

మోదీ భారీ రోడ్​ షో వెనుక వ్యూహమిదే..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలో భారీస్థాయిలో రోడ్​షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. భాజపా అధ్యక్షుడు అమిత్​షా సహా ముఖ్యనేతలు పాల్గొన్నారు. అయితే, నామినేషన్​కు ఒక్కరోజు ముందు మోదీ ఇంత భారీస్థాయిలో రోడ్​ షో నిర్వహించడం వెనుక వ్యూహాలేమిటి. 2014తో పోలిస్తే తనకు ప్రజల మద్దతు తగ్గలేదని మోదీ నిరూపించాలనుకున్నారా? వారణాసిలో తనకెవరూ పోటీనివ్వలేరనే సంకేతాలు పంపాలనుకున్నారా? దేశాన్ని తాము మాత్రమే కాపాడగలమని చెప్పేందుకేనా?

author img

By

Published : Apr 26, 2019, 8:28 AM IST

రోడ్​షోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
మోదీ భారీ రోడ్​ షో వెనుక వ్యూహమిదే..

ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో ఏడు కిలోమీటర్ల పాటు మెగా రోడ్​షో నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రోడ్​షోకు హాజరైన ప్రజలతో నగర వీధులు కిక్కిరిసిపోయాయి. ప్రధాని మోదీకి మద్దతుగా నినాదాలు హోరెత్తాయి. రోడ్​షోలో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ సహా పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. వారణాసి లోక్​సభ స్థానానికి నామినేషన్​ వేసే ఒక్కరోజు ముందే మోదీ ఇంత పెద్దస్థాయిలో రోడ్​షో నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.

ప్రజాబలం భాజపా వైపేనని చెప్పేందుకే..

2014 కంటే భాజపాకు, తనకు ప్రజాదరణ ఇప్పుడు మరింత పెరిగిందని చాటిచెప్పుకునేందుకే వారణాసిలో భారీస్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్​షో నిర్వహించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారణాసి స్థానం నుంచి దాదాపు మూడు లక్షల 70వేల ఓట్ల మెజార్టీతో గత ఎన్నికల్లో విజయం సాధించారు మోదీ.

ఈ ఐదేళ్లలో వారణాసి ప్రజల్లో మోదీ పట్ల వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయిందని కాంగ్రెస్​ నేతలు కొంతకాలంగా విమర్శిస్తున్నారు. ఆ నియోజకవర్గాన్ని ఆయన అసలు పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసిపై ప్రత్యేక దృష్టి సారించారు.

కాంగ్రెస్​ నేతల ఆరోపణలకు సమాధానమిచ్చేందుకే మోదీ ఇంత భారీ స్థాయిలో రోడ్​షో నిర్వహించారు. తన గెలుపు ఈసారి కూడా నల్లేరుపై నడకేనని చెప్పే ప్రయత్నం చేశారు.

భాజపాలో ఉత్సాహం.. కాంగ్రెస్​లో నిస్తేజం

వారణాసిలో ప్రధాని మోదీ రోడ్​షో విజయవంతమవడం భాజపా శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఎవరు పోటీకి దిగినా భాజపా విజయం తథ్యమనే విశ్వాసాన్ని కలిగించింది.

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారనే ఊహాగానాలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. మోదీపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రియాంక కూడా ప్రకటించారు. ఇక ఆ స్థానంలో హోరాహోరీ తప్పదని అందరూ భావించారు. మోదీకి గట్టిపోటీ తప్పదనుకున్నారు. అంచనాలను తలకిందులు చేస్తూ వారణాసి నుంచి మళ్లీ అజయ్​రాయ్​ పోటీ చేస్తారని కాంగ్రెస్​ ప్రకటించింది. దీంతో అక్కడి కాంగ్రెస్​ శ్రేణులు నిరుత్సాహపడ్డారు.

దేశ భద్రతపై మరోసారి

జాతీయవాదం, దేశ భద్రతపై మరోసారి వారణాసిలో ప్రసంగించారు ప్రధాని మోదీ. దేశం తమ పార్టీ ప్రభుత్వ హయాంలోనే భద్రంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. తనకు దేశ ప్రయోజనాలే ప్రథమమని మోదీ అన్నారు. ఆ తర్వాతే మిగతా విషయాలని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వంలోనే దేశరక్షణ పటిష్ఠంగా ఉంటుందన్నారు.

" గడిచిన ఐదేళ్లలో దేశంలోని ఏ పట్టణం, పవిత్ర స్థలాలు, ఆలయాలపై ఎలాంటి ఉగ్రదాడులు జరగలేదు. పుల్వామాలో 40 మంది జవాన్ల ప్రాణాలను ముష్కరులు బలిగొన్నారు. ఆ ఘటన తర్వాత అదే ప్రాంతంలో ఇప్పటి వరకు 42 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఇదీ మా ప్రభుత్వ పనితీరు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి"

మోదీ భారీ రోడ్​ షో వెనుక వ్యూహమిదే..

ఉత్తరప్రదేశ్​లోని వారణాసిలో ఏడు కిలోమీటర్ల పాటు మెగా రోడ్​షో నిర్వహించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రోడ్​షోకు హాజరైన ప్రజలతో నగర వీధులు కిక్కిరిసిపోయాయి. ప్రధాని మోదీకి మద్దతుగా నినాదాలు హోరెత్తాయి. రోడ్​షోలో భాజపా జాతీయాధ్యక్షుడు అమిత్​ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ సహా పార్టీ ముఖ్యనేతలు పాల్గొన్నారు. వారణాసి లోక్​సభ స్థానానికి నామినేషన్​ వేసే ఒక్కరోజు ముందే మోదీ ఇంత పెద్దస్థాయిలో రోడ్​షో నిర్వహించడం ఆసక్తికరంగా మారింది.

ప్రజాబలం భాజపా వైపేనని చెప్పేందుకే..

2014 కంటే భాజపాకు, తనకు ప్రజాదరణ ఇప్పుడు మరింత పెరిగిందని చాటిచెప్పుకునేందుకే వారణాసిలో భారీస్థాయిలో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్​షో నిర్వహించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. వారణాసి స్థానం నుంచి దాదాపు మూడు లక్షల 70వేల ఓట్ల మెజార్టీతో గత ఎన్నికల్లో విజయం సాధించారు మోదీ.

ఈ ఐదేళ్లలో వారణాసి ప్రజల్లో మోదీ పట్ల వ్యతిరేకత తీవ్రంగా పెరిగిపోయిందని కాంగ్రెస్​ నేతలు కొంతకాలంగా విమర్శిస్తున్నారు. ఆ నియోజకవర్గాన్ని ఆయన అసలు పట్టించుకోలేదని ఆరోపించారు. ముఖ్యంగా కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వారణాసిపై ప్రత్యేక దృష్టి సారించారు.

కాంగ్రెస్​ నేతల ఆరోపణలకు సమాధానమిచ్చేందుకే మోదీ ఇంత భారీ స్థాయిలో రోడ్​షో నిర్వహించారు. తన గెలుపు ఈసారి కూడా నల్లేరుపై నడకేనని చెప్పే ప్రయత్నం చేశారు.

భాజపాలో ఉత్సాహం.. కాంగ్రెస్​లో నిస్తేజం

వారణాసిలో ప్రధాని మోదీ రోడ్​షో విజయవంతమవడం భాజపా శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. ఎవరు పోటీకి దిగినా భాజపా విజయం తథ్యమనే విశ్వాసాన్ని కలిగించింది.

వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బరిలోకి దిగుతారనే ఊహాగానాలు చాలా కాలం నుంచి వినిపిస్తున్నాయి. మోదీపై పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రియాంక కూడా ప్రకటించారు. ఇక ఆ స్థానంలో హోరాహోరీ తప్పదని అందరూ భావించారు. మోదీకి గట్టిపోటీ తప్పదనుకున్నారు. అంచనాలను తలకిందులు చేస్తూ వారణాసి నుంచి మళ్లీ అజయ్​రాయ్​ పోటీ చేస్తారని కాంగ్రెస్​ ప్రకటించింది. దీంతో అక్కడి కాంగ్రెస్​ శ్రేణులు నిరుత్సాహపడ్డారు.

దేశ భద్రతపై మరోసారి

జాతీయవాదం, దేశ భద్రతపై మరోసారి వారణాసిలో ప్రసంగించారు ప్రధాని మోదీ. దేశం తమ పార్టీ ప్రభుత్వ హయాంలోనే భద్రంగా ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. తనకు దేశ ప్రయోజనాలే ప్రథమమని మోదీ అన్నారు. ఆ తర్వాతే మిగతా విషయాలని స్పష్టం చేశారు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకున్నామని తెలిపారు. సమర్థవంతమైన నాయకత్వంలోనే దేశరక్షణ పటిష్ఠంగా ఉంటుందన్నారు.

" గడిచిన ఐదేళ్లలో దేశంలోని ఏ పట్టణం, పవిత్ర స్థలాలు, ఆలయాలపై ఎలాంటి ఉగ్రదాడులు జరగలేదు. పుల్వామాలో 40 మంది జవాన్ల ప్రాణాలను ముష్కరులు బలిగొన్నారు. ఆ ఘటన తర్వాత అదే ప్రాంతంలో ఇప్పటి వరకు 42 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాం. ఇదీ మా ప్రభుత్వ పనితీరు."
-నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి"

AP Video Delivery Log - 2000 GMT News
Thursday, 25 April, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last hour. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-1932: US MD Baltimore Mayor Must Credit WMAR, No Access Baltimore, No Use U.S. Broadcast Networks 4207815
Agents search Baltimore mayor’s homes, City Hall
AP-APTN-1920: Sudan Protest AP Clients Only 4207814
Sudan protesters attempt 'million man' march
AP-APTN-1913: US CA Pedestrians Struck Part must credit KGO; Part no access San Francisco; Part no use US broadcast networks; Part must credit Sunnyvale Dept of Public Safety 4207813
US police say car ramming not terror related
AP-APTN-1855: US NY Candidates AP Clients Only 4207812
Biden makes 20 seeking to beat Trump in 2020
AP-APTN-1848: Belgium EU Japan Briefing AP Clients Only 4207810
Abe, EU leaders hold briefing after trade talks
AP-APTN-1821: Chile Student Protest AP Clients Only 4207808
Violence erupts during student protest in Chile
AP-APTN-1815: France Macron AP Clients Only 4207800
Macron unveils plans to quell yellow vest protests
AP-APTN-1802: Spain Germans Suspect No access Spain 4207807
Father accused of killing German wife, son in Spain
AP-APTN-1801: US Venezuela Abrams AP Clients Only 4207806
US official condemns anti-US protesters
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.