ETV Bharat / bharat

కశ్మీర్​పై కాంగ్రెస్​ది మొసలి కన్నీరు: మోదీ

author img

By

Published : Oct 14, 2019, 5:12 PM IST

Updated : Oct 14, 2019, 5:56 PM IST

హరియాణా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. కాంగ్రెస్​పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకిస్తూ కశ్మీర్​పై కాంగ్రెస్​ మొసలి కన్నీరు కారుస్తోందని ఎద్దేవా చేశారు.

మోదీ

రఫేల్​ ఒప్పందంపై కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు ప్రధాని నరేంద్రమోదీ. కాంగ్రెస్​ తరహాలో కాకుండా దేశ భద్రతకు భాజపా కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకిస్తున్నవారు.. అమరులైన సైనిక కుటుంబాలకు సమాధానమివ్వాలని డిమాండ్​ చేశారు.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వల్లభ్​గఢ్​ బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ.

"ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకించే వారు స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని వారి మేనిఫెస్టోలో చేర్చే ధైర్యం ఉందా? ఈ విషయంలో కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది. కశ్మీర్​లో అమాయక ప్రజలను కాపాడే క్రమంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారు. వారి కుటుంబాలకు కాంగ్రెస్ సమాధానమివ్వాలి. మేం కశ్మీర్​ను అభివృద్ధి పథంలోకి నడిపిస్తాం. "

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: తమిళనాడులో మరో ఇస్రో కేంద్రం! కారణం?

రఫేల్​ ఒప్పందంపై కాంగ్రెస్ చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టారు ప్రధాని నరేంద్రమోదీ. కాంగ్రెస్​ తరహాలో కాకుండా దేశ భద్రతకు భాజపా కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకిస్తున్నవారు.. అమరులైన సైనిక కుటుంబాలకు సమాధానమివ్వాలని డిమాండ్​ చేశారు.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వల్లభ్​గఢ్​ బహిరంగ సభలో ప్రసంగించారు మోదీ.

"ఆర్టికల్​ 370 రద్దును వ్యతిరేకించే వారు స్వయం ప్రతిపత్తిని పునరుద్ధరిస్తామని వారి మేనిఫెస్టోలో చేర్చే ధైర్యం ఉందా? ఈ విషయంలో కాంగ్రెస్ మొసలి కన్నీరు కారుస్తోంది. కశ్మీర్​లో అమాయక ప్రజలను కాపాడే క్రమంలో ఎంతో మంది సైనికులు అమరులయ్యారు. వారి కుటుంబాలకు కాంగ్రెస్ సమాధానమివ్వాలి. మేం కశ్మీర్​ను అభివృద్ధి పథంలోకి నడిపిస్తాం. "

-నరేంద్రమోదీ, ప్రధానమంత్రి

ఇదీ చూడండి: తమిళనాడులో మరో ఇస్రో కేంద్రం! కారణం?

New Delhi, Oct 14 (ANI): King of Netherlands, Willem-Alexander and Queen Maxima paid tribute to Mahatma Gandhi at Rajghat on October 14. King of Netherlands, Willem-Alexander received a ceremonial reception at Rashtrapati Bhavan on their arrival. He was received by President Ram Nath Kovind at Rashtrapati Bhavan. Later King of Netherlands and Queen Maxima met Prime Minister Narendra Modi and other dignitaries at Rashtrapati Bhavan.
Last Updated : Oct 14, 2019, 5:56 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.