ETV Bharat / bharat

'కరోనా నియంత్రణలో మైనారిటీలూ కీలక పాత్ర'

author img

By

Published : May 9, 2020, 6:38 PM IST

Updated : May 9, 2020, 7:30 PM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు దేశంలోని ఇతరులతో సమానంగా మైనారిటీలు పాలుపంచుకుంటున్నారని పేర్కొన్నారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ. ప్రధాని, సీఎం సహాయ నిధులకు విరాళాలు, నిరుపేదలకు నిత్యావసరాలు, ఆహారం అందిస్తూ ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు.

Naqvi
ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ

కరోనాపై పోరులో దేశంలోని ఇతరులతో సమానంగా మైనారిటీ సమాజం పాలుపంచుకుంటోందని పేర్కొన్నారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​​ నఖ్వీ. భౌతికదూరం పాటించటం సహా ఇతర అంశాలపై అవగాహన కల్పించేందుకు త్వరలోనే దేశవ్యాప్తంగా జాన్​ భి, జహాన్​ భి అవగాహన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

" మైనారిటీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న 1500 మందికిపైగా ఆరోగ్య సహాయకులు.. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరిలో 50 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ ఏడాది మరో 2000 మంది ఆరోగ్య సహాయకులకు శిక్షణ ఇవ్వనున్నాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సహాయ నిధులకు వివిధ వక్ఫ్​ బోర్డులు సుమారు రూ. 51 కోట్లు అందించాయి. అలాగే నిరుపేదలకు ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 16 హజ్​ హౌజులను క్వారంటైన్​, ఐసోలేషన్​ సౌకర్యాల కోసం ఇచ్చారు. వివిధ రాష్ట్రాలు వీటిని ఉపయోగిస్తున్నాయి. మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీఖో ఔర్​ కమావో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భారీ సంఖ్యలో మాస్కులు తయారు చేసి.. అవసరమైన వారికి పంపిణీ చేశాం."

- ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి

కలిసికట్టుగా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా కట్టడికి దేశంలోని ప్రజలంతా కలిసికట్టుగా పోరాడుతున్నారని తెలిపారు కేంద్ర మంత్రి. ఇతర సమాజంలోని వ్యక్తులతో పాటు ఈ పోరాటంలో మైనారిటీలూ సమానంగా సహకరిస్తున్నారని నొక్కిచెప్పారు. అలీఘడ్​ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) రూ.1.40 కోట్లు పీఎం కేర్స్​ నిధికి అందించినట్లు గుర్తు చేశారు. ఏఎంయూ వైద్య కళాశాలలో 100 పడకలు ఏర్పాటు సహా.. ఇప్పటివరకు 9వేలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

కరోనాపై పోరులో దేశంలోని ఇతరులతో సమానంగా మైనారిటీ సమాజం పాలుపంచుకుంటోందని పేర్కొన్నారు కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్​ అబ్బాస్​​ నఖ్వీ. భౌతికదూరం పాటించటం సహా ఇతర అంశాలపై అవగాహన కల్పించేందుకు త్వరలోనే దేశవ్యాప్తంగా జాన్​ భి, జహాన్​ భి అవగాహన కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు.

" మైనారిటీ వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలోని నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో శిక్షణ తీసుకున్న 1500 మందికిపైగా ఆరోగ్య సహాయకులు.. దేశవ్యాప్తంగా వివిధ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నారు. వీరిలో 50 మంది అమ్మాయిలు ఉన్నారు. ఈ ఏడాది మరో 2000 మంది ఆరోగ్య సహాయకులకు శిక్షణ ఇవ్వనున్నాం. ప్రధానమంత్రి, ముఖ్యమంత్రుల సహాయ నిధులకు వివిధ వక్ఫ్​ బోర్డులు సుమారు రూ. 51 కోట్లు అందించాయి. అలాగే నిరుపేదలకు ఆహారం, నిత్యావసరాలు అందిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 16 హజ్​ హౌజులను క్వారంటైన్​, ఐసోలేషన్​ సౌకర్యాల కోసం ఇచ్చారు. వివిధ రాష్ట్రాలు వీటిని ఉపయోగిస్తున్నాయి. మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని సీఖో ఔర్​ కమావో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా భారీ సంఖ్యలో మాస్కులు తయారు చేసి.. అవసరమైన వారికి పంపిణీ చేశాం."

- ముఖ్తార్​ అబ్బాస్​ నఖ్వీ, కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి

కలిసికట్టుగా..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు కరోనా కట్టడికి దేశంలోని ప్రజలంతా కలిసికట్టుగా పోరాడుతున్నారని తెలిపారు కేంద్ర మంత్రి. ఇతర సమాజంలోని వ్యక్తులతో పాటు ఈ పోరాటంలో మైనారిటీలూ సమానంగా సహకరిస్తున్నారని నొక్కిచెప్పారు. అలీఘడ్​ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) రూ.1.40 కోట్లు పీఎం కేర్స్​ నిధికి అందించినట్లు గుర్తు చేశారు. ఏఎంయూ వైద్య కళాశాలలో 100 పడకలు ఏర్పాటు సహా.. ఇప్పటివరకు 9వేలకుపైగా కరోనా పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు.

Last Updated : May 9, 2020, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.