మేఘాలయ షీల్లాంగ్లోని వెస్ట్ఖాసీ హిల్స్కి చెందిన మోరిస్ మారంగర్ అనే 80 ఏళ్ల వ్యక్తిని.. బంధువులే సజీవంగా ఖననం చేశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న తమ మేనకోడలిపై మంత్రపూజలు నిర్వహించాడనే సాకుతో.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు అతని నలుగురు మేనల్లుళ్లతో సహా కేసుతో సంబంధం ఉన్న మరో నలుగురిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
వీరంతా మోరిస్ను ముఖ్యమైన పని ఉంది అని చెప్పి తీసుకుపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఏంతకీ రాకపోవడం వల్ల పోలీసులను ఆశ్రయించామన్నారు. ఈ క్రమంలో మృతదేహాన్ని వెలికి తీసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై ఆ రాష్ట్ర హోంమంత్రి స్పందించారు.
"ఈ ఘటన జరగడం చాలా విచారకరం. శాంతిభద్రతలను కాపాడటానికి పోలీసు, న్యాయ వ్యవస్థలు ఉన్నాయి. కేసుపై దర్యాప్తు జరుగుతోంది."
-హోంమంత్రి లఖ్మెన్ రింబుయ్
ఇదీ చూడండి: జరజాగ్రత్త: భారత్లో 'రీఇన్ఫెక్షన్' కేసులు నమోదు