ETV Bharat / bharat

హాథ్రస్ ఘటనపై ఐరాస వ్యాఖ్యలు అనవసరం: భారత్ - The Ministry of External Affairs criticised UN Resident Coordinator's statement

యూపీలో హాథ్రస్, బలరాంపుర్​ అత్యాచార ఘటనలపై ఐరాస కోఆర్డినేటర్ చేసిన వ్యాఖ్యలను భారత్ తప్పుబట్టింది. విచారణ కొనసాగుతున్న సమయంలో బయటి సంస్థలు అనవసర వ్యాఖ్యలు చేయకుండా ఉంటేనే ఉత్తమమని వ్యాఖ్యానించింది. ఈ ఘటనలను భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని పేర్కొంది.

MEA calls UN official's remark on violence against women in India as 'unwarranted and unnecessary'
హాథ్రస్ ఘటనపై ఐరాస వ్యాఖ్యలు అనవసరం: భారత్
author img

By

Published : Oct 6, 2020, 10:32 AM IST

భారత్​లో మహిళలపై ఇటీవల హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ చేసిన ప్రకటనను విదేశీ వ్యవహారాల శాఖ తప్పుబట్టింది. ఈ ప్రకటన అనవసరమని పేర్కొంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన కేసులపై విచారణ కొనసాగుతోందని స్పష్టం చేసింది. బయటి సంస్థలు అనవరసర వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికింది.

ఈ విషయంపై భారత్​లోని ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్​కు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అసమ్మతిని తెలియజేశారు.

"ఇటీవల మహిళలపై జరుగుతున్న హింస గురించి ఐరాస రెసిడెంట్ కోఆర్టినేటర్​ కొన్ని అనవసర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని వారు తెలుసుకోవాలి. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు బాహ్య సంస్థలు ఏదైనా అనవసర వ్యాఖ్యలు చేయకుండా ఉండటం ముఖ్యం. భారత్​లోని పౌరులందరికీ రాజ్యాంగం సమానత్వం ఇచ్చింది. ప్రజాస్వామ్య దేశంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం అందించిన ఘనత మాకు ఉంది."

-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి

అంతకుముందు.. ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​, బలరాంపుర్​ ప్రాంతాల్లో జరిగిన అత్యాచార ఘటనలపై ఐక్యరాజ్య సమితి భారత విభాగం విచారం వ్యక్తం చేసింది. వెనకబడిన సామాజిక వర్గాల మహిళలు, బాలికలే లింగ ఆధారిత హింసకు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారనే విషయాన్ని ఈ రెండు ఘటనలు గుర్తు చేస్తున్నాయని పేర్కొంది.

ఇవీ చదవండి

భారత్​లో మహిళలపై ఇటీవల హింసాత్మక ఘటనల నేపథ్యంలో ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్ చేసిన ప్రకటనను విదేశీ వ్యవహారాల శాఖ తప్పుబట్టింది. ఈ ప్రకటన అనవసరమని పేర్కొంది. ఇటీవల వెలుగులోకి వచ్చిన కేసులపై విచారణ కొనసాగుతోందని స్పష్టం చేసింది. బయటి సంస్థలు అనవరసర వ్యాఖ్యలు చేయడం మానుకుంటే మంచిదని హితవు పలికింది.

ఈ విషయంపై భారత్​లోని ఐరాస రెసిడెంట్ కోఆర్డినేటర్​కు విదేశాంగ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ అసమ్మతిని తెలియజేశారు.

"ఇటీవల మహిళలపై జరుగుతున్న హింస గురించి ఐరాస రెసిడెంట్ కోఆర్టినేటర్​ కొన్ని అనవసర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసులను ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని వారు తెలుసుకోవాలి. దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు బాహ్య సంస్థలు ఏదైనా అనవసర వ్యాఖ్యలు చేయకుండా ఉండటం ముఖ్యం. భారత్​లోని పౌరులందరికీ రాజ్యాంగం సమానత్వం ఇచ్చింది. ప్రజాస్వామ్య దేశంగా అన్ని వర్గాల ప్రజలకు న్యాయం అందించిన ఘనత మాకు ఉంది."

-అనురాగ్ శ్రీవాస్తవ, విదేశాంగ శాఖ ప్రతినిధి

అంతకుముందు.. ఉత్తర్​ప్రదేశ్​ హాథ్రస్​, బలరాంపుర్​ ప్రాంతాల్లో జరిగిన అత్యాచార ఘటనలపై ఐక్యరాజ్య సమితి భారత విభాగం విచారం వ్యక్తం చేసింది. వెనకబడిన సామాజిక వర్గాల మహిళలు, బాలికలే లింగ ఆధారిత హింసకు ఎక్కువగా బాధితులుగా మారుతున్నారనే విషయాన్ని ఈ రెండు ఘటనలు గుర్తు చేస్తున్నాయని పేర్కొంది.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.