మణిపుర్ కంగ్పోక్పీ జిల్లాలో ఉగ్రమూకల కదలికలపై సమాచారం మేరకు తనిఖీలు చేపట్టాయి భద్రతా దళాలు. ఈ క్రమంలో ఉగ్రవాద రహస్య స్థావరాన్ని ఛేదించాయి. సంఘటనా స్థలంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి.
![terror Hideout in manipur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9312349_587_9312349_1603679221102.png)
రహస్య స్థావరంలో 5.56 ఎంఎం ఎం16 రైఫిల్, 9ఎంఎం తుపాకీ, ఒక నాటు తుపాకీ, 60 రైడ్ల తూటాలు స్వాధీనం చేసుకున్నట్లు భారత సైన్యం ప్రకటించింది.
ఇదీ చూడండి: బంగాల్లో మెడికల్ షాపులో పేలిన బాంబు