ETV Bharat / bharat

'మణిపుర్​ రాజకీయ ప్రభావం మేఘాలయపై ఉండదు'

author img

By

Published : Jun 19, 2020, 8:19 AM IST

మణిపుర్​లో ఎన్​పీపీ మద్దతు ఉపసంహరణతో భాజపా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వంలో లుకలుకలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్​ ప్రయత్నాలు ప్రారంభించింది. అయితే భాజాపా మద్దతుతో మేఘాలయలో ఏర్పాటైన ఎన్​పీపీ ప్రభుత్వంపై ఈ ప్రభావం ఉండదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా స్పష్టం చేశారు.

MG-MANIPUR-SANGMA
పాత చిత్రం

మణిపుర్​ రాజకీయ పరిస్థితులు తమ రాష్ట్రంపై ప్రభావం చూపవని మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్​ పార్టీ (ఎన్​పీపీ) అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా వ్యాఖ్యానించారు. మణిపుర్​లో ఎన్​పీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు భాజపా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్​కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఈ విషయంపై స్పందించిన సంగ్మా.. మేఘాలయలో అటువంటి పరిస్థితులు లేవని స్పష్టం చేశారు.

"మణిపుర్​లో ఏర్పడిన పరిస్థితులు నాయకత్వానికి సంబంధించినవి. అందులోనూ ఇది వ్యక్తి కేంద్రీకృత సమస్య. ఈ ప్రభావం మేఘాలయపై ఏమాత్రం ఉండదు. ఈ శుక్రవారం జరిగే రాజ్యసభ ఎన్నికపైనా ఈ పరిస్థితుల ప్రభావం ఉండదు."

-కాన్రాడ్​ సంగ్మా

మణిపుర్​లోని 60 స్థానాలున్న అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 28, భాజపా 21 సీట్లు సాధించాయి. ఎన్​పీపీ 4, ఎన్​పీఎఫ్​ 4, జన్​శక్తి పార్టీ 1 స్థానాలు గెలిచాయి. వీటితో కలిపి భాజపా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీనికి భాజపాకు చెందిన బీరెన్ సింగ్​ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేఘాలయలో భాజపా మద్దతుతో ఎన్​పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

మేఘాలయ సేఫ్​..

తాజా పరిస్థితులపై మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి (ఎండీఏ)లోని మిత్ర పక్షాలతో చర్చించినట్లు సంగ్మా తెలిపారు. ఈ కూటమిలో భాజపా కూడా ఉంది. మణిపుర్​లో ముగ్గురు భాజపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎన్​పీపీ మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు సంగ్మా.

"మణిపుర్​ ముఖ్యమంత్రి బీరెన్​ సింగ్​ నాయకత్వానికి సంబంధించిన సమస్యలే ప్రధాన కారణం. మా మంత్రుల నుంచి కొన్ని శాఖలకు లాక్కోవటం వల్ల సమస్య మొదలైంది. ఈ విషయాన్ని దిల్లీలోని భాజపా కేంద్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఇద్దరు ఎన్​పీపీ జాతీయ కార్యదర్శులను మణిపుర్​ ఎమ్మెల్యేలతో చర్చలకు పంపాం."

- కాన్రాడ్ సంగ్మా

ఎన్​పీపీ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్​ ప్రయత్నాలు మొదలుపెట్టింది. భాజపా నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మణిపుర్​లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయంగానే కనిపిస్తోంది.

మణిపుర్​ రాజకీయ పరిస్థితులు తమ రాష్ట్రంపై ప్రభావం చూపవని మేఘాలయ ముఖ్యమంత్రి, నేషనల్ పీపుల్స్​ పార్టీ (ఎన్​పీపీ) అధ్యక్షుడు కాన్రాడ్ సంగ్మా వ్యాఖ్యానించారు. మణిపుర్​లో ఎన్​పీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు భాజపా నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్​కు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.

ఈ విషయంపై స్పందించిన సంగ్మా.. మేఘాలయలో అటువంటి పరిస్థితులు లేవని స్పష్టం చేశారు.

"మణిపుర్​లో ఏర్పడిన పరిస్థితులు నాయకత్వానికి సంబంధించినవి. అందులోనూ ఇది వ్యక్తి కేంద్రీకృత సమస్య. ఈ ప్రభావం మేఘాలయపై ఏమాత్రం ఉండదు. ఈ శుక్రవారం జరిగే రాజ్యసభ ఎన్నికపైనా ఈ పరిస్థితుల ప్రభావం ఉండదు."

-కాన్రాడ్​ సంగ్మా

మణిపుర్​లోని 60 స్థానాలున్న అసెంబ్లీకి 2017లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 28, భాజపా 21 సీట్లు సాధించాయి. ఎన్​పీపీ 4, ఎన్​పీఎఫ్​ 4, జన్​శక్తి పార్టీ 1 స్థానాలు గెలిచాయి. వీటితో కలిపి భాజపా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. దీనికి భాజపాకు చెందిన బీరెన్ సింగ్​ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేఘాలయలో భాజపా మద్దతుతో ఎన్​పీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

మేఘాలయ సేఫ్​..

తాజా పరిస్థితులపై మేఘాలయ ప్రజాస్వామ్య కూటమి (ఎండీఏ)లోని మిత్ర పక్షాలతో చర్చించినట్లు సంగ్మా తెలిపారు. ఈ కూటమిలో భాజపా కూడా ఉంది. మణిపుర్​లో ముగ్గురు భాజపా ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన తర్వాత ఆ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వానికి ఎన్​పీపీ మద్దతు ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు సంగ్మా.

"మణిపుర్​ ముఖ్యమంత్రి బీరెన్​ సింగ్​ నాయకత్వానికి సంబంధించిన సమస్యలే ప్రధాన కారణం. మా మంత్రుల నుంచి కొన్ని శాఖలకు లాక్కోవటం వల్ల సమస్య మొదలైంది. ఈ విషయాన్ని దిల్లీలోని భాజపా కేంద్ర నాయకుల దృష్టికి తీసుకెళ్లాం. ఈ సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తాం. ఇద్దరు ఎన్​పీపీ జాతీయ కార్యదర్శులను మణిపుర్​ ఎమ్మెల్యేలతో చర్చలకు పంపాం."

- కాన్రాడ్ సంగ్మా

ఎన్​పీపీ ఎమ్మెల్యేల రాజీనామా నేపథ్యంలో ప్రభుత్వ ఏర్పాటుపై కాంగ్రెస్​ ప్రయత్నాలు మొదలుపెట్టింది. భాజపా నేతృత్వంలోని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే మణిపుర్​లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం ఖాయంగానే కనిపిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.