కర్ణాటకలోని మంగళూరులో దేశంలోనే తొలి కోస్ట్ గార్డ్ అకాడమీని ప్రారంభించనున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్ చేసింది.

కర్ణాటక పారిశ్రామిక ప్రాంతీయ అభివృద్ధి బోర్డుకు(కేఐఏడీబీ) చెందిన 158 ఎకరాల్లో ఈ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. కోస్ట్ గార్డ్ అధికారులకు సమర్థమైన శిక్షణ ఇవ్వడానికి ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది. ఇదో మైలురాయిగా అభివర్ణించింది.
ఇదీ చూడండి: నెటిజన్ల మనసుదోచిన నీలి రంగు పాము