ETV Bharat / bharat

'శివసేనతో పొత్తు ప్రసక్తే లేదు.. విపక్షంలోనే ఉంటాం'

author img

By

Published : Oct 25, 2019, 7:45 PM IST

Updated : Oct 25, 2019, 11:01 PM IST

అధికారం కోసం శివసేనతో చేతులు కలిపే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది కాంగ్రెస్​- ఎన్​సీపీ కూటమి. ప్రజలు తమను విపక్షంలో కూర్చోవాలని ఆదేశించారని... తాము అదే చేస్తామని కూటమి నేతలు స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల శివసేనతో కలిసి భాజపా ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దాదాపు అన్ని మార్గాలు సుగమం అయినట్టే.

'శివసేనతో పొత్తు ప్రసక్తే లేదు.. విపక్షంలోనే ఉంటాం'
'శివసేనతో పొత్తు ప్రసక్తే లేదు.. విపక్షంలోనే ఉంటాం'

మహారాష్ట్రలో భాజపాను అధికారానికి దూరం చేయాలనే ఉద్దేశంతో.. కాంగ్రెస్​- నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ(ఎన్​సీపీ) శివసేనతో చేతులు కలుపుతాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. వీటిపై స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు బాలాసాహెబ్​ థోరట్​.. శివసేనతో పొత్తు కుదుర్చుకునేది లేదని తేల్చిచెప్పారు.

"శివసేన నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న వ్యూహం మాకు లేదు. శివసేనతో కాంగ్రెస్​ పొత్తు అనే అంశమే తెరపైకి రాకూడదు. సేన మా వద్దకు వస్తే.. మా హైకమాండ్​తో చర్చిస్తాం. వారిదే తుది నిర్ణయం."

-- బాలాసాహెబ్​​, మహారాష్ట్ర పీసీసీ చీఫ్​

శివసేనతో చేతులు కలిపే అంశాన్ని ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​ కొట్టిపారేశారు. భవిష్యత్తు కార్యచరణపై కాంగ్రెస్​తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

"ప్రజలు మమ్మల్ని విపక్షంలో కూర్చోమన్నారు. మేము ప్రజల ఆదేశాలను అంగీకరిస్తాం. అధికారం చేపట్టాలన్న ఆలోచనే మాకు లేదు."

---- శరద్​ పవార్​, ఎన్​సీపీ అధ్యక్షుడు.

ఇక శివసేన మైత్రితో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని మార్గాలు సుగమమయ్యాయి.

288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. భాజపా-105, శివసేన- 56 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్​- 44, ఎన్​సీపీ- 54 సీట్లు దక్కించుకున్నాయి. ప్రభుత్వ స్థాపనకు కావాల్సిన మెజారిటీ 145 సీట్లు. శివసేన మద్దతు లేకపోతే కాషాయ దళం అధికారం దక్కించుకునే అవకాశం లేదు.

'శివసేనతో పొత్తు ప్రసక్తే లేదు.. విపక్షంలోనే ఉంటాం'

మహారాష్ట్రలో భాజపాను అధికారానికి దూరం చేయాలనే ఉద్దేశంతో.. కాంగ్రెస్​- నేషనలిస్ట్​ కాంగ్రెస్​ పార్టీ(ఎన్​సీపీ) శివసేనతో చేతులు కలుపుతాయన్న ఊహాగానాలు జోరందుకున్నాయి. వీటిపై స్పందించిన మహారాష్ట్ర కాంగ్రెస్​ అధ్యక్షుడు బాలాసాహెబ్​ థోరట్​.. శివసేనతో పొత్తు కుదుర్చుకునేది లేదని తేల్చిచెప్పారు.

"శివసేన నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న వ్యూహం మాకు లేదు. శివసేనతో కాంగ్రెస్​ పొత్తు అనే అంశమే తెరపైకి రాకూడదు. సేన మా వద్దకు వస్తే.. మా హైకమాండ్​తో చర్చిస్తాం. వారిదే తుది నిర్ణయం."

-- బాలాసాహెబ్​​, మహారాష్ట్ర పీసీసీ చీఫ్​

శివసేనతో చేతులు కలిపే అంశాన్ని ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​ కొట్టిపారేశారు. భవిష్యత్తు కార్యచరణపై కాంగ్రెస్​తో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

"ప్రజలు మమ్మల్ని విపక్షంలో కూర్చోమన్నారు. మేము ప్రజల ఆదేశాలను అంగీకరిస్తాం. అధికారం చేపట్టాలన్న ఆలోచనే మాకు లేదు."

---- శరద్​ పవార్​, ఎన్​సీపీ అధ్యక్షుడు.

ఇక శివసేన మైత్రితో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అన్ని మార్గాలు సుగమమయ్యాయి.

288 అసెంబ్లీ స్థానాలున్న మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. భాజపా-105, శివసేన- 56 స్థానాల్లో గెలుపొందాయి. కాంగ్రెస్​- 44, ఎన్​సీపీ- 54 సీట్లు దక్కించుకున్నాయి. ప్రభుత్వ స్థాపనకు కావాల్సిన మెజారిటీ 145 సీట్లు. శివసేన మద్దతు లేకపోతే కాషాయ దళం అధికారం దక్కించుకునే అవకాశం లేదు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Manchester, England, UK - date
1. 00:00 X arrives for news conference
2. SOUNDBITE (English):
++TRANSCRIPTION TO FOLLOW++
SOURCE: Premier League Productions
DURATION:
STORYLINE:
Last Updated : Oct 25, 2019, 11:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.