ETV Bharat / bharat

అక్టోబర్​ 19 నుంచి ముంబయిలో మెట్రో పరుగులు

author img

By

Published : Oct 14, 2020, 6:09 PM IST

Updated : Oct 14, 2020, 7:55 PM IST

ముంబయిలో మెట్రో సేవల పునః ప్రారంభంపై మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం నుంచి మెట్రో రైళ్లు నడిపేందుకు అనుమతులిచ్చింది. అయితే పునరుద్ధరణ పనుల వల్ల ఈ నెల 19 నుంచి మెట్రో సేవలు అందుబాటులోకి వస్తాయని అధికారులు స్పష్టం చేశారు.

Maha allows metro trains to run from Oct 15, reopens libraries
గురువారం నుంచి ముంబయిలో మెట్రో కూత

కరోనా ధాటికి రాష్ట్రంలో నిలిచిపోయిన మెట్రో కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'బిగిన్​ అగైన్​' మిషన్​లో భాగంగా.. గురువారం నుంచి ఈ ప్రయాణాలకు అనుమతులిచ్చింది. దశలవారీగా మెట్రో సేవలు పునరుద్ధరించాలని స్పష్టం చేసింది.

మహారాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన కొద్దిసేపటికి ఎమ్​ఎమ్​ఓపీఎల్​(ముంబయి మెట్రో వన్​ ప్రైవేట్​ లిమిటెడ్​) ఓ ప్రకటన విడుదల చేసింది. మెట్రో రైళ్ల పునరుద్ధరణ వల్ల ఈ నెల 19 నుంచి ప్రజలకు సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.

మరిన్ని...

కరోనా నిబంధనలను పాటిస్తూ.. ప్రభుత్వ-ప్రైవేటు నేతృత్వంలోని గ్రంథాలయాలు తెరుచుకోవచ్చని మార్గదర్శకాలు విడుదల చేసింది మహా సర్కార్​. కంటైన్​మెంట్​ జోన్ల వెలుపల వ్యాపారాలకు సంబంధించిన ఎగ్జిబిషన్లకు కూడా అనుమతులిచ్చింది.

స్థానిక వారాంతపు సంతలు తెరుచుకునేందుకు అవకాశమిచ్చింది ప్రభుత్వం. వినియోగదారుల రద్దీని నియంత్రించేందుకు గురువారం నుంచి అదనంగా రెండు గంటల పాటు(రాత్రి 9గంటల వరకు) షాపులు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది.

విద్యాసంస్థలు మాత్రం ఈ నెల 31వరకు మూతపడే ఉంటాయని స్పష్టం చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.

ఇదీ చూడండి:- ఆలయాలపై సీఎం, గవర్నర్​ మాటల యుద్ధం

కరోనా ధాటికి రాష్ట్రంలో నిలిచిపోయిన మెట్రో కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 'బిగిన్​ అగైన్​' మిషన్​లో భాగంగా.. గురువారం నుంచి ఈ ప్రయాణాలకు అనుమతులిచ్చింది. దశలవారీగా మెట్రో సేవలు పునరుద్ధరించాలని స్పష్టం చేసింది.

మహారాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిన కొద్దిసేపటికి ఎమ్​ఎమ్​ఓపీఎల్​(ముంబయి మెట్రో వన్​ ప్రైవేట్​ లిమిటెడ్​) ఓ ప్రకటన విడుదల చేసింది. మెట్రో రైళ్ల పునరుద్ధరణ వల్ల ఈ నెల 19 నుంచి ప్రజలకు సేవలు అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది.

మరిన్ని...

కరోనా నిబంధనలను పాటిస్తూ.. ప్రభుత్వ-ప్రైవేటు నేతృత్వంలోని గ్రంథాలయాలు తెరుచుకోవచ్చని మార్గదర్శకాలు విడుదల చేసింది మహా సర్కార్​. కంటైన్​మెంట్​ జోన్ల వెలుపల వ్యాపారాలకు సంబంధించిన ఎగ్జిబిషన్లకు కూడా అనుమతులిచ్చింది.

స్థానిక వారాంతపు సంతలు తెరుచుకునేందుకు అవకాశమిచ్చింది ప్రభుత్వం. వినియోగదారుల రద్దీని నియంత్రించేందుకు గురువారం నుంచి అదనంగా రెండు గంటల పాటు(రాత్రి 9గంటల వరకు) షాపులు తెరుచుకునేందుకు అనుమతినిచ్చింది.

విద్యాసంస్థలు మాత్రం ఈ నెల 31వరకు మూతపడే ఉంటాయని స్పష్టం చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం.

ఇదీ చూడండి:- ఆలయాలపై సీఎం, గవర్నర్​ మాటల యుద్ధం

Last Updated : Oct 14, 2020, 7:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.