ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​ను ముంచెత్తిన వరదలు.. ఒకరు మృతి

భారీ వర్షాలు, వరదలతో మధ్యప్రదేశ్​లోని చాలా ప్రాంతాలు నీటమునిగాయి. భోపాల్​లోని చిరయు ఆసుపత్రిలోకి వరద నీరు చేరింది. సెహోర్​ జిల్లాలోని అస్తా నగరంలో ఓ భవనం కూలిపోయి ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

author img

By

Published : Aug 30, 2020, 10:58 AM IST

MADYA PRADESH FLOOD SITUATION
మధ్యప్రదేశ్​ను ముంచెత్తిన వరదలు

మధ్యప్రదేశ్​ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

భోపాల్​లోని 'బడా తలాబ్' సరస్సు నిండుకుండలా మారి నగరంలోని చిరయు ఆసుపత్రిలోకి నీరు చేరింది. ఆసుపత్రి వార్డుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

సెహోర్​ జిల్లాలోని అస్తా నగరంలో వరదల కారణంగా ఓ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

MADYA PRADESH FLOOD SITUATION
అస్తా నగరంలో కూలిపోయిన భవనం
MADYA PRADESH FLOOD SITUATION
అస్తా నగరంలో కూలిపోయిన భవనం

షాజాపుర్ జిల్లాలోని చాలా​ ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. జిల్లా కేంద్రం, పరిసర లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

MADYA PRADESH FLOOD SITUATION
షాజాపుర్ జిల్లాలో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
MADYA PRADESH FLOOD SITUATION
వరదలో కొట్టుకుపోయిన రోడ్లు
MADYA PRADESH FLOOD SITUATION
ఉప్పొంగిన నదులు
MADYA PRADESH FLOOD SITUATION
షాజాపుర్​లో ఇళ్లల్లోకి చేరిన నీరు

మోదీకి ఫోన్​..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో..మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్ మాట్లాడారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ప్రధానికి వివరించారు. ​

ఇదీ చూడండి: అన్​లాక్​-4: 7 నుంచి మెట్రో కూత- థియేటర్లకు నో

మధ్యప్రదేశ్​ను వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు నదులు ఉప్పొంగి లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం స్తంభించింది. పలు ప్రాంతాలు చెరువులను తలపిస్తున్నాయి. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అధికారులు.

భోపాల్​లోని 'బడా తలాబ్' సరస్సు నిండుకుండలా మారి నగరంలోని చిరయు ఆసుపత్రిలోకి నీరు చేరింది. ఆసుపత్రి వార్డుల్లో రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

సెహోర్​ జిల్లాలోని అస్తా నగరంలో వరదల కారణంగా ఓ భవనం కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

MADYA PRADESH FLOOD SITUATION
అస్తా నగరంలో కూలిపోయిన భవనం
MADYA PRADESH FLOOD SITUATION
అస్తా నగరంలో కూలిపోయిన భవనం

షాజాపుర్ జిల్లాలోని చాలా​ ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. జిల్లా కేంద్రం, పరిసర లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి.

MADYA PRADESH FLOOD SITUATION
షాజాపుర్ జిల్లాలో నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు
MADYA PRADESH FLOOD SITUATION
వరదలో కొట్టుకుపోయిన రోడ్లు
MADYA PRADESH FLOOD SITUATION
ఉప్పొంగిన నదులు
MADYA PRADESH FLOOD SITUATION
షాజాపుర్​లో ఇళ్లల్లోకి చేరిన నీరు

మోదీకి ఫోన్​..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో..మధ్యప్రదేశ్​ ముఖ్యమంత్రి శివరాజ్​ సింగ్​ చౌహాన్ మాట్లాడారు. రాష్ట్రంలో వరద పరిస్థితిపై ప్రధానికి వివరించారు. ​

ఇదీ చూడండి: అన్​లాక్​-4: 7 నుంచి మెట్రో కూత- థియేటర్లకు నో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.