ETV Bharat / bharat

జూన్​లో కరోనాతో పాటు మరో రాకాసి ఉగ్రరూపం!

దేశం మొత్తం కరోనాపై పోరాడుతున్న సమయంలో మరో విపత్తు ప్రజలను బెంబేలెత్తిస్తోంది. పంటపొలాలను సర్వనాశనం చేసే మిడతల రూపంలో ఈ ఆపద ముంచుకొస్తోంది. దక్షిణాదికీ పోటెత్తిన ఈ మిడతల దండు.. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉంది. జూన్​ నెలలో కరోనా వైరస్ తారస్థాయికి చేరుతుందని నిపుణులు హెచ్చరిస్తుంటే.. ఈ మిడతల బెడద సైతం ఆ నెలలోనే తీవ్రంగా మారనుందన్న విషయం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.

author img

By

Published : May 27, 2020, 7:24 PM IST

Updated : May 27, 2020, 7:29 PM IST

locust attack in india expected to peak in july along with the deadly virus covid-19
జూన్​లో కరోనాతో పాటు మరో విపత్తు విజృంభణ!

"కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం".... కరోనాతో పోరు గురించి ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాట ఇది. అనేక నెలలుగా ఈ యుద్ధం సాగుతూనే ఉంది. విజయం ఎప్పటికో తెలియకపోయినా.... మొక్కవోని విశ్వాసం, ధైర్యంతో ముందుకు సాగుతోంది యావత్ భారతావని. అయితే... కనిపించే శత్రువు రూపంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. దేశదేశాలను దాటి వచ్చిన మిడతల దండు... ఒక్కో రాష్ట్రంపై పంజా విసురుతోంది.

ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ మిడతలు పంటపొలాలపై పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్​ రాష్ట్రాల్లోని రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్లల్లోకీ ఈ మిడతలు చేరుతున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.

ఇదీ చదవండి: మిడతల 'దండు'యాత్ర- 5 రాష్ట్రాలకు ముప్పు

మరోవైపు ఈ సమస్యకు పరిష్కారం చూపలేమంటూ పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. వ్యవసాయ శాఖ వద్దే సరైన సాంకేతిక పరిజ్ఞానం ఉందని చెబుతున్నారు. మిడతల నివారణకు రసాయనాలు అధికంగా చల్లడం వల్ల పంట నాశనమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలకూ...

ఉత్తర భారత దేశంలో ప్రవేశించిన ఈ మహమ్మారి మిడతలు దక్షిణాదికీ విస్తరిస్తున్నాయి. కేరళలోని పలు ప్రాంతాల్లోనూ ఈ మిడతల దండు దాడి చేస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాలకూ ఈ మిడతల బెడద తప్పట్లేదు. వాయు వేగంతో తెలంగాణకు ఈ మిడతలు చేరుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. లాక్​డౌన్ సడలిస్తున్న ఈ సమయంలో రైతులకు ఇదో శరాఘాతంగా మారుతుందని అంటున్నారు.

ఒకే నెలలో రెండు విపత్తులు

జూన్​, జులై నెలల్లో దేశంలో కరోనా ఉద్ధృతి కట్టలు తెంచుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జులైలో కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని చెబుతున్నారు. మూడు నుంచి ఆరు లక్షల కేసులతో సుమారు 12-18 వేల మంది మరణించే అవకాశం ఉందని లెక్కగడుతున్నారు.

ఇదీ చదవండి: భారత్​లో కరోనా ఉగ్ర రూపం అప్పుడే!

మరోవైపు.. ఆ సమయంలోనే మిడతల బెడద మరింత తీవ్రమవుతుందని పర్యావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. జులై నాటికి మరిన్ని మిడతల దండ్లు భారత్​లోకి ప్రవేశించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

కారణమేంటి?

సాధారణంగా శుష్క ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి పచ్చదనం పెరగడం వల్ల మిడతల సంతానోత్పత్తి పెరుగుతుంది.

భూతాపం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి హిందూ మహా సముద్రంలో 'డైపోల్​' అనే వాతావరణం ఏర్పడుతుంది. ఆ సమయంలో సముద్రం పశ్చిమ వైపు జలాలు వేడిగా.. తూర్పు వైపు ఉన్న నీరు చల్లగా మారతాయి.

2019 చివర్లో హిందూ మాహా సముద్రంలో ఈ పరిస్థితి తలెత్తడం వల్ల అరేబియా ద్వీపకల్పంలో భారీ వర్షాలు కురిశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల ఈ మిడతల సంతానం భారీగా పెరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

దేశంలోకి ఎందుకొచ్చాయంటే

మార్చి-మే మధ్య ఉత్తర భారతదేశంలో కురిసి వర్షాలే దేశంలో మిడతలు దండెత్తడానికి కారణమని అధికారులు అంటున్నారు. వర్షాలతో పచ్చిక ఏర్పడటం వల్ల ఈ ప్రాంతంలోకి మిడతలు భారీగా వచ్చినట్లు చెబుతున్నారు.

నివారణ కోసం

చేతికొచ్చిన పంటను మిడతలపాలు చేయకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మిడతల నివారణ చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మిడతలపై హెచ్చరికలు, సూచనలు అందించడమే కాకుండా.. పురుగుల మందులను పెద్ద ఎత్తున ఏరియల్ స్ప్రే చేయాలని సిఫార్సు చేస్తున్నారు.

ఇదీ చదవండి: జయలలిత ఆస్తులకు వారసులు వారే

"కంటికి కనిపించని శత్రువుతో యుద్ధం".... కరోనాతో పోరు గురించి ప్రభుత్వ పెద్దలు చెప్పిన మాట ఇది. అనేక నెలలుగా ఈ యుద్ధం సాగుతూనే ఉంది. విజయం ఎప్పటికో తెలియకపోయినా.... మొక్కవోని విశ్వాసం, ధైర్యంతో ముందుకు సాగుతోంది యావత్ భారతావని. అయితే... కనిపించే శత్రువు రూపంలో మరో ముప్పు ముంచుకొస్తోంది. దేశదేశాలను దాటి వచ్చిన మిడతల దండు... ఒక్కో రాష్ట్రంపై పంజా విసురుతోంది.

ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈ మిడతలు పంటపొలాలపై పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్​ రాష్ట్రాల్లోని రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇళ్లల్లోకీ ఈ మిడతలు చేరుతున్నాయంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోంది.

ఇదీ చదవండి: మిడతల 'దండు'యాత్ర- 5 రాష్ట్రాలకు ముప్పు

మరోవైపు ఈ సమస్యకు పరిష్కారం చూపలేమంటూ పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారు. వ్యవసాయ శాఖ వద్దే సరైన సాంకేతిక పరిజ్ఞానం ఉందని చెబుతున్నారు. మిడతల నివారణకు రసాయనాలు అధికంగా చల్లడం వల్ల పంట నాశనమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలకూ...

ఉత్తర భారత దేశంలో ప్రవేశించిన ఈ మహమ్మారి మిడతలు దక్షిణాదికీ విస్తరిస్తున్నాయి. కేరళలోని పలు ప్రాంతాల్లోనూ ఈ మిడతల దండు దాడి చేస్తోంది.

ఇక తెలుగు రాష్ట్రాలకూ ఈ మిడతల బెడద తప్పట్లేదు. వాయు వేగంతో తెలంగాణకు ఈ మిడతలు చేరుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. లాక్​డౌన్ సడలిస్తున్న ఈ సమయంలో రైతులకు ఇదో శరాఘాతంగా మారుతుందని అంటున్నారు.

ఒకే నెలలో రెండు విపత్తులు

జూన్​, జులై నెలల్లో దేశంలో కరోనా ఉద్ధృతి కట్టలు తెంచుకుంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. జులైలో కేసులు గరిష్ఠ స్థాయికి చేరుకుంటాయని చెబుతున్నారు. మూడు నుంచి ఆరు లక్షల కేసులతో సుమారు 12-18 వేల మంది మరణించే అవకాశం ఉందని లెక్కగడుతున్నారు.

ఇదీ చదవండి: భారత్​లో కరోనా ఉగ్ర రూపం అప్పుడే!

మరోవైపు.. ఆ సమయంలోనే మిడతల బెడద మరింత తీవ్రమవుతుందని పర్యావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. జులై నాటికి మరిన్ని మిడతల దండ్లు భారత్​లోకి ప్రవేశించే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

కారణమేంటి?

సాధారణంగా శుష్క ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసి పచ్చదనం పెరగడం వల్ల మిడతల సంతానోత్పత్తి పెరుగుతుంది.

భూతాపం వల్ల ఉష్ణోగ్రతలు పెరిగి హిందూ మహా సముద్రంలో 'డైపోల్​' అనే వాతావరణం ఏర్పడుతుంది. ఆ సమయంలో సముద్రం పశ్చిమ వైపు జలాలు వేడిగా.. తూర్పు వైపు ఉన్న నీరు చల్లగా మారతాయి.

2019 చివర్లో హిందూ మాహా సముద్రంలో ఈ పరిస్థితి తలెత్తడం వల్ల అరేబియా ద్వీపకల్పంలో భారీ వర్షాలు కురిశాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దీని వల్ల ఈ మిడతల సంతానం భారీగా పెరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

దేశంలోకి ఎందుకొచ్చాయంటే

మార్చి-మే మధ్య ఉత్తర భారతదేశంలో కురిసి వర్షాలే దేశంలో మిడతలు దండెత్తడానికి కారణమని అధికారులు అంటున్నారు. వర్షాలతో పచ్చిక ఏర్పడటం వల్ల ఈ ప్రాంతంలోకి మిడతలు భారీగా వచ్చినట్లు చెబుతున్నారు.

నివారణ కోసం

చేతికొచ్చిన పంటను మిడతలపాలు చేయకుండా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వాలు తక్షణమే స్పందించి మిడతల నివారణ చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. మిడతలపై హెచ్చరికలు, సూచనలు అందించడమే కాకుండా.. పురుగుల మందులను పెద్ద ఎత్తున ఏరియల్ స్ప్రే చేయాలని సిఫార్సు చేస్తున్నారు.

ఇదీ చదవండి: జయలలిత ఆస్తులకు వారసులు వారే

Last Updated : May 27, 2020, 7:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.