ETV Bharat / bharat

నితీశ్​కు షాక్​- ఒంటరిగానే బరిలోకి ఎల్​జేపీ

author img

By

Published : Oct 4, 2020, 4:09 PM IST

Updated : Oct 4, 2020, 5:11 PM IST

LJP contests Bihar elections alone
బిహార్ ఎన్నికల్లో ఒంటరిగానే ఎల్​జేపీ పోటీ

16:48 October 04

నితీశ్​కు గుడ్​బై- భాజపాతో జట్టు?

బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) నిర్ణయించింది. జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్​డీఏ తరఫున ఎన్నికల బరిలో నిలవకూడదని నిర్ణయించింది. ఈ మేరకు చిరాగ్ పాసవాన్ నేతృత్వంలో జరిగిన ఎల్​జేపీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే భాజపాతో కలిసి కూటమి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సమావేశంలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది.  

జేడీయూ పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలపాలని, భాజపా పోటీ చేసే స్థానాల్లో బరిలో నిలవకూడదని నిర్ణయించినట్లు సమాచారం. బిహార్ ప్రస్తుత సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌తో చిరాగ్ పాసవాన్‌కు పొసగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఒంటరిపోరుకు ఎల్​జేపీ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది

16:04 October 04

బిహార్​ శాసనసభ ఎన్నికల వేళ లోక్​ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్​ కుమార్​ నేతృత్వంలోని కూటమి తరఫున పోటీ చేయరాదని తీర్మానించింది. అయితే... భాజపాతో పొత్తు కొనసాగించాలని నిర్ణయించింది. దిల్లీలో ఎల్​జేపీ అధినేత చిరాగ్​ పాసవాన్​ సారథ్యంలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

16:48 October 04

నితీశ్​కు గుడ్​బై- భాజపాతో జట్టు?

బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీచేయాలని లోక్‌ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) నిర్ణయించింది. జేడీయూ అధినేత, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ సారథ్యంలోని ఎన్​డీఏ తరఫున ఎన్నికల బరిలో నిలవకూడదని నిర్ణయించింది. ఈ మేరకు చిరాగ్ పాసవాన్ నేతృత్వంలో జరిగిన ఎల్​జేపీ సెంట్రల్ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే భాజపాతో కలిసి కూటమి ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు సమావేశంలో వ్యక్తమైనట్లు తెలుస్తోంది.  

జేడీయూ పోటీ చేసే స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలపాలని, భాజపా పోటీ చేసే స్థానాల్లో బరిలో నిలవకూడదని నిర్ణయించినట్లు సమాచారం. బిహార్ ప్రస్తుత సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్‌తో చిరాగ్ పాసవాన్‌కు పొసగడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల్లో ఒంటరిపోరుకు ఎల్​జేపీ మొగ్గుచూపినట్లు తెలుస్తోంది

16:04 October 04

బిహార్​ శాసనసభ ఎన్నికల వేళ లోక్​ జనశక్తి పార్టీ(ఎల్​జేపీ) కీలక నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో నితీశ్​ కుమార్​ నేతృత్వంలోని కూటమి తరఫున పోటీ చేయరాదని తీర్మానించింది. అయితే... భాజపాతో పొత్తు కొనసాగించాలని నిర్ణయించింది. దిల్లీలో ఎల్​జేపీ అధినేత చిరాగ్​ పాసవాన్​ సారథ్యంలో జరిగిన పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు చర్చించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Last Updated : Oct 4, 2020, 5:11 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.