ETV Bharat / bharat

'9న లాలూ రిలీజ్​- 10న నితీశ్​కు ఫేర్​వెల్​'

ఆర్​జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ నవంబర్​ 9న జైలు నుంచి విడుదలవుతున్నారని తెలిపారు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్​. ఆ మరుసటి రోజునే సీఎం నితీశ్​ కుమార్​కు వీడ్కోలు పలుకుతామని పేర్కొన్నారు. కరోనా భయంతో బయటకు రాని ముఖ్యమంత్రి, ఓట్ల కోసం వచ్చారని విమర్శించారు. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

author img

By

Published : Oct 23, 2020, 4:36 PM IST

Tejashwi
తేజస్వీ యాదవ్

రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ) అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ నవంబర్​ 9న బెయిల్​పై విడుదలవుతున్నారని తెలిపారు ఆయన కుమారుడు, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్​. ఆ మరుసటి రోజునే బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ వీడ్కోలు అందుకుంటారని పేర్కొన్నారు. నవంబర్ 10న బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడడాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హిసువాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు తేజస్వీ​. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

" లాలూ జీ నవంబర్​ 9న విడుదల అవుతున్నారు. ఇప్పటికే ఓ కేసులో బెయిల్​ వచ్చింది. మరో కేసులో నవంబర్​ 9న బెయిల్​ వస్తుంది. అదే రోజు నా పుట్టిన రోజు కూడా. ఆ మరుసటి రోజు నితీశ్​ కుమార్​కు వీడ్కోలు.

నితీశ్​ జీ.. మీరు అలసిపోయారు. బిహార్​ యోగక్షేమాలు చూసే స్థితిలో లేరు. 15 ఏళ్లలో ఉద్యోగాలు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించలేని వారు వచ్చే ఐదేళ్లలోనూ ఆ పని చేయలేరు. ప్రధాని బిహార్​కు వచ్చిన క్రమంలో.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్రాకేజీ ఎప్పుడు ఇస్తారో చెబుతారని ఊహించా. కానీ, అలా జరగలేదు. "

- తేజస్వీ యాదవ్​, ఆర్​జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి

కరోనా వైరస్​ భయంతో 144 రోజుల పాటు సీఎం కార్యాలయం నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారని ఆరోపించారు తేజస్వీ. మహాకూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి.. నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్న ఎన్​డీఏ ప్రశ్నకు సమధానమిచ్చారు ఆర్​జేడీ నేత. బిహార్​ బడ్జెట్​ రూ.2.13 లక్షల కోట్లు అయితే.. నితీశ్​ ప్రభుత్వం కేవలం 60 శాతం ఖర్చు చేసిందని.. ఇంకా రూ.80,000 కోట్లు మిగిలి ఉంటాయన్నారు.

ప్రస్తుతం నడుస్తోన్న పోటీ నితీశ్​, తేజస్వీ మధ్య కాదని.. రాహుల్​ గాంధీ, మోదీ మధ్య సమరంగా పేర్కొన్నారు యాదవ్​. నియంతృత్వ ప్రభుత్వం, ప్రజల మధ్య పోటీగా అభివర్ణించారు.

ఇదీ చూడండి: 'ఆ వ్యాఖ్యలతో జవాన్లను అవమానించిన మోదీ'

రాష్ట్రీయ జనతా దళ్​(ఆర్​జేడీ) అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ నవంబర్​ 9న బెయిల్​పై విడుదలవుతున్నారని తెలిపారు ఆయన కుమారుడు, మహాకూటమి ముఖ్యమంత్రి అభ్యర్థి తేజస్వీ యాదవ్​. ఆ మరుసటి రోజునే బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్​ కుమార్​ వీడ్కోలు అందుకుంటారని పేర్కొన్నారు. నవంబర్ 10న బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాలు వెలువడడాన్ని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హిసువాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు తేజస్వీ​. ఎన్నికల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

" లాలూ జీ నవంబర్​ 9న విడుదల అవుతున్నారు. ఇప్పటికే ఓ కేసులో బెయిల్​ వచ్చింది. మరో కేసులో నవంబర్​ 9న బెయిల్​ వస్తుంది. అదే రోజు నా పుట్టిన రోజు కూడా. ఆ మరుసటి రోజు నితీశ్​ కుమార్​కు వీడ్కోలు.

నితీశ్​ జీ.. మీరు అలసిపోయారు. బిహార్​ యోగక్షేమాలు చూసే స్థితిలో లేరు. 15 ఏళ్లలో ఉద్యోగాలు, విద్య, వైద్య సదుపాయాలు కల్పించలేని వారు వచ్చే ఐదేళ్లలోనూ ఆ పని చేయలేరు. ప్రధాని బిహార్​కు వచ్చిన క్రమంలో.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్రాకేజీ ఎప్పుడు ఇస్తారో చెబుతారని ఊహించా. కానీ, అలా జరగలేదు. "

- తేజస్వీ యాదవ్​, ఆర్​జేడీ నేత, మహాకూటమి సీఎం అభ్యర్థి

కరోనా వైరస్​ భయంతో 144 రోజుల పాటు సీఎం కార్యాలయం నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి.. ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారని ఆరోపించారు తేజస్వీ. మహాకూటమి అధికారంలోకి వస్తే 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీకి.. నిధులు ఎక్కడి నుంచి తెస్తారన్న ఎన్​డీఏ ప్రశ్నకు సమధానమిచ్చారు ఆర్​జేడీ నేత. బిహార్​ బడ్జెట్​ రూ.2.13 లక్షల కోట్లు అయితే.. నితీశ్​ ప్రభుత్వం కేవలం 60 శాతం ఖర్చు చేసిందని.. ఇంకా రూ.80,000 కోట్లు మిగిలి ఉంటాయన్నారు.

ప్రస్తుతం నడుస్తోన్న పోటీ నితీశ్​, తేజస్వీ మధ్య కాదని.. రాహుల్​ గాంధీ, మోదీ మధ్య సమరంగా పేర్కొన్నారు యాదవ్​. నియంతృత్వ ప్రభుత్వం, ప్రజల మధ్య పోటీగా అభివర్ణించారు.

ఇదీ చూడండి: 'ఆ వ్యాఖ్యలతో జవాన్లను అవమానించిన మోదీ'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.