ETV Bharat / bharat

మరోసారి కమాండర్​ స్థాయి చర్చలు

author img

By

Published : Sep 21, 2020, 5:50 AM IST

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి బలగాలను ఉపసంహరించుకునే విషయమై భారత్‌-చైనా సైనికాధికారులు ఆరోసారి భేటీ కానున్నారు. ఈ సమావేశంలో ఫింగర్​ ప్రాంతంలో బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు సైనిక వర్గాలు తెలిపాయి. తొలిసారిగా విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి ఈ సమావేశంలో పాల్గొంటున్నట్లు సమాచారం.

Ladakh row: Corps Commander talks on Monday; Army strengthens dominance in over 20 strategic height
మరోసారి కమాండర్​ స్థాయి చర్చలు

తూర్పు లద్దాఖ్​లో సరిహద్దుల వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించడమే లక్ష్యంగా.. భారత్​-చైనా మధ్య సోమవారం ఆరోసారి కమాండర్​ స్థాయిలో చర్చలు జరగునున్నాయి. ఎల్‌ఏసీ వెంబడి చైనా పరిధిలో ఉన్న మోల్డోలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. తొలిసారిగా.. విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం.

కార్ప్స్​ కమాండర్​ స్థాయిలో జరగునున్న ఈ భేటీలో ఫింగర్‌ ప్రాంతంలో బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఉద్రిక్తతలు పెరిగే చర్యలను నివారించడం, సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వెంబడి బలగాలను సత్వరం వెనక్కి తీసుకోనే అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

20 వ్యూహాత్మక పర్వతాల్లో భారత్​ ఆధిపత్యం..

ఇరుపక్షాలు మరోసారి చర్చలు జరుపుతున్నప్పటికీ, పాంగాంగ్ సరస్సు సమీపంలో ఉన్న 20కి పైగా వ్యూహాత్మక పర్వతాల్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది భారత్​. ఈ నేపథ్యంలో ఇటీవల భారత్ వాయసేన అమ్ములపొదిలోకి వచ్చి చేరిన రఫెల్​ యుద్ధ విమానాన్ని సరిహద్దులో మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్​ సిద్ధంగా ఉందని హెచ్చరిస్తూనే ఉంది భారత్​.

సెప్టెంబర్ 10న మాస్కోలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్​సీఓ) సదస్సు విరామంలో.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్​, చైనా ప్రతినిధి వాంగ్​ యీ మధ్య జరిగిన భేటీలో సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి కీలక ఒప్పందం కుదరటం గమనార్హం.

ఇదీ చూడండి: రాజ్యసభలో విపక్షాల ప్రవర్తన సిగ్గుచేటు: రాజ్​నాథ్

తూర్పు లద్దాఖ్​లో సరిహద్దుల వెంబడి నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించడమే లక్ష్యంగా.. భారత్​-చైనా మధ్య సోమవారం ఆరోసారి కమాండర్​ స్థాయిలో చర్చలు జరగునున్నాయి. ఎల్‌ఏసీ వెంబడి చైనా పరిధిలో ఉన్న మోల్డోలో వివిధ అంశాలపై చర్చించనున్నారు. తొలిసారిగా.. విదేశాంగ మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారి ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు సమాచారం.

కార్ప్స్​ కమాండర్​ స్థాయిలో జరగునున్న ఈ భేటీలో ఫింగర్‌ ప్రాంతంలో బలగాల ఉపసంహరణపైనే ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు భారత సైనిక వర్గాలు వెల్లడించాయి. ఉద్రిక్తతలు పెరిగే చర్యలను నివారించడం, సరిహద్దుల్లో శాంతి స్థాపన కోసం తూర్పు లద్దాఖ్‌లో ఎల్‌ఏసీ వెంబడి బలగాలను సత్వరం వెనక్కి తీసుకోనే అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

20 వ్యూహాత్మక పర్వతాల్లో భారత్​ ఆధిపత్యం..

ఇరుపక్షాలు మరోసారి చర్చలు జరుపుతున్నప్పటికీ, పాంగాంగ్ సరస్సు సమీపంలో ఉన్న 20కి పైగా వ్యూహాత్మక పర్వతాల్లో తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకుంది భారత్​. ఈ నేపథ్యంలో ఇటీవల భారత్ వాయసేన అమ్ములపొదిలోకి వచ్చి చేరిన రఫెల్​ యుద్ధ విమానాన్ని సరిహద్దులో మోహరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి భారత్​ సిద్ధంగా ఉందని హెచ్చరిస్తూనే ఉంది భారత్​.

సెప్టెంబర్ 10న మాస్కోలో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్​సీఓ) సదస్సు విరామంలో.. భారత విదేశాంగ మంత్రి జైశంకర్​, చైనా ప్రతినిధి వాంగ్​ యీ మధ్య జరిగిన భేటీలో సరిహద్దు సమస్యను పరిష్కరించడానికి కీలక ఒప్పందం కుదరటం గమనార్హం.

ఇదీ చూడండి: రాజ్యసభలో విపక్షాల ప్రవర్తన సిగ్గుచేటు: రాజ్​నాథ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.