ఒకప్పుడు పెళ్లికి సంబంధించిన జ్ఞాపకాల్ని వీడియోలు, ఫొటోల రూపంలో దాచుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్లు వస్తున్నాయి. కేరళలో ఇలాంటి ఫొటోషూట్లో జరిగిన చిన్న పొరపాటు.. నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
కేరళకు చెందిన తిజిన్, శిల్పలకు మే 6న వివాహం జరగనుంది. పంబా నదీ తీరంలో ప్రీ వెడ్డింగ్ ఫొటోషూట్ ప్లాన్ చేసుకున్నారు. ఫొటో తీసుకునేందుకు పడవలో కూర్చున్న వీరిద్దరూ అదుపు తప్పి నీటిలో పడిపోయారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సుమారు 2 లక్షల మందికి పైగా వీక్షించారు.
ఇది చదవండి: నవ వధువుల కోసం ప్రత్యేక డిజైన్లు