ETV Bharat / bharat

'దిల్లీని అభివృద్ధి చేద్దాం.. మోదీ ఆశీర్వదించండి' - kejriwal oath

దిల్లీ ముఖ్యమంత్రిగా ఆమ్ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణస్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో లెఫ్టినెంట్​ గవర్నర్ అనిల్ బైజాల్ సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ప్రజలనుద్దేశించి కేజ్రీ ప్రసంగిస్తూ.. దిల్లీ అభివృద్ధికి మోదీ ఆశీస్సులు కావాలన్నారు.

kejriwal oath
అరవింద్ కేజ్రీవాల్
author img

By

Published : Feb 16, 2020, 1:28 PM IST

Updated : Mar 1, 2020, 12:34 PM IST

దిల్లీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు కోరుకుంటున్నట్లు తెలిపారు. రాంలీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కేజ్రీవాల్. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ విజయం ప్రజలదే అని ఉద్ఘాటించారు.

అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

"దిల్లీని ప్రపంచంలో నెం.1గా తీర్చిదిద్దుతాం. దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రికి కూడా ఆహ్వానం పంపించాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. దిల్లీని ముందుకు తీసుకెళ్లాడనికి, అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ వేదిక నుంచే కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఆశీస్సులు కోరుతున్నా."-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

దిల్లీ ప్రజలు దేశ రాజకీయాలను మార్చేశారని కితాబిచ్చారు కేజ్రీవాల్. వచ్చే ఐదేళ్ల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. దిల్లీని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా కేజ్రీ పాడిన పాట అభిమానులను, కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంది.

దిల్లీ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆశీస్సులు కోరుకుంటున్నట్లు తెలిపారు. రాంలీలా మైదానంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు కేజ్రీవాల్. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ విజయం ప్రజలదే అని ఉద్ఘాటించారు.

అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

"దిల్లీని ప్రపంచంలో నెం.1గా తీర్చిదిద్దుతాం. దీనికోసం కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రికి కూడా ఆహ్వానం పంపించాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. దిల్లీని ముందుకు తీసుకెళ్లాడనికి, అభివృద్ధి పథంలో నడిపించడానికి ఈ వేదిక నుంచే కేంద్ర ప్రభుత్వం, ప్రధానమంత్రి ఆశీస్సులు కోరుతున్నా."-అరవింద్ కేజ్రీవాల్, దిల్లీ ముఖ్యమంత్రి

దిల్లీ ప్రజలు దేశ రాజకీయాలను మార్చేశారని కితాబిచ్చారు కేజ్రీవాల్. వచ్చే ఐదేళ్ల అభివృద్ధికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. దిల్లీని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ సందర్భంగా కేజ్రీ పాడిన పాట అభిమానులను, కార్యకర్తలను విశేషంగా ఆకట్టుకుంది.

Last Updated : Mar 1, 2020, 12:34 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.