ETV Bharat / bharat

కశ్మీర్​లో 614 ఉగ్ర ఘటనలు-257ముష్కరులు హతం

author img

By

Published : Oct 27, 2019, 7:18 AM IST

Updated : Oct 27, 2019, 7:24 AM IST

జమ్ముకశ్మీర్​లో చొరబడేందుకు పాక్ ఉగ్రవాదులు 2018లో 328సార్లు ప్రయత్నించారని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక తెలిపింది. గతేడాది 614 ఉగ్ర ఘటనలు జరగగా..257 మంది ముష్కరులను మట్టుబెట్టినట్లు నివేదిక వెల్లడించింది.

కశ్మీర్​లో 614 ఉగ్ర ఘటనలు-257ముష్కరులు హతం

పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2018లో జమ్ముకశ్మీర్‌లో చొరబడేందుకు 328 సార్లు ప్రయత్నించాయని.. అందులో 143 సార్లు విజయం సాధించాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో ఈ స్థాయిలో ఉగ్రవాదులు చొరబడటం ఇదే తొలిసారని నివేదిక స్పష్టం చేసింది.

ఏడాదిలో 614 ఉగ్ర ఘటనలు

2018లో జమ్ముకశ్మీర్‌లో 614 ఉగ్ర ఘటనలు జరిగాయని.. ఇందులో మొత్తం 257 మంది ముష్కరులు, 91 మంది భద్రతా సిబ్బంది, 39 మంది పౌరులు మరణించారని నివేదిక పేర్కొంది. గత ఐదేళ్లలో అత్యధిక ప్రాణ నష్టం గత ఏడాదే జరిగిందని వెల్లడించింది. 2017లో జమ్ముకశ్మీర్‌లో 342 ఉగ్రవాద ఘటనలు జరగగా 213 మంది ముష్కరులు, 80 మంది భద్రతా సిబ్బంది, 40 మంది పౌరులు మరణించారని నివేదిక తెలిపింది.

ఉగ్రవాద, వేర్పాటు వాద హింసతో జమ్ముకశ్మీర్ తీవ్రంగా ప్రభావితమైందన్న కేంద్ర ప్రభుత్వ నివేదిక.. రెండున్నర దశాబ్దాలుగా దాయాది దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో 1990 నుంచి ఇప్పటి వరకు 14 వేల మంది పౌరులు, 5 వేల 273 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని హోం మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది.

ఇదీ చూడండి: పీఓకేలో ఉగ్రవాదుల ప్రభుత్వమే నడుస్తోంది: రావత్​

పాకిస్థాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు 2018లో జమ్ముకశ్మీర్‌లో చొరబడేందుకు 328 సార్లు ప్రయత్నించాయని.. అందులో 143 సార్లు విజయం సాధించాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది. గత ఐదేళ్లలో ఈ స్థాయిలో ఉగ్రవాదులు చొరబడటం ఇదే తొలిసారని నివేదిక స్పష్టం చేసింది.

ఏడాదిలో 614 ఉగ్ర ఘటనలు

2018లో జమ్ముకశ్మీర్‌లో 614 ఉగ్ర ఘటనలు జరిగాయని.. ఇందులో మొత్తం 257 మంది ముష్కరులు, 91 మంది భద్రతా సిబ్బంది, 39 మంది పౌరులు మరణించారని నివేదిక పేర్కొంది. గత ఐదేళ్లలో అత్యధిక ప్రాణ నష్టం గత ఏడాదే జరిగిందని వెల్లడించింది. 2017లో జమ్ముకశ్మీర్‌లో 342 ఉగ్రవాద ఘటనలు జరగగా 213 మంది ముష్కరులు, 80 మంది భద్రతా సిబ్బంది, 40 మంది పౌరులు మరణించారని నివేదిక తెలిపింది.

ఉగ్రవాద, వేర్పాటు వాద హింసతో జమ్ముకశ్మీర్ తీవ్రంగా ప్రభావితమైందన్న కేంద్ర ప్రభుత్వ నివేదిక.. రెండున్నర దశాబ్దాలుగా దాయాది దేశం ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తెలిపింది. జమ్ముకశ్మీర్‌లో 1990 నుంచి ఇప్పటి వరకు 14 వేల మంది పౌరులు, 5 వేల 273 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని హోం మంత్రిత్వ శాఖ వార్షిక నివేదిక వెల్లడించింది.

ఇదీ చూడండి: పీఓకేలో ఉగ్రవాదుల ప్రభుత్వమే నడుస్తోంది: రావత్​

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, excluding social. Available worldwide. Max use 90 seconds. Use within 48 hours. No archive. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
BROADCAST: Scheduled news bulletins only. No use in magazine shows.
DIGITAL: Standalone digital clips allowed. No social media allowed. Digital clients may use footage for a period of 7 days for VOD and catch up purposes only.
SHOTLIST: Salvalla to Salou, Spain - 26th October  2019
++ SHOTLIST TO FOLLOW ++
Stages 10-13
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
SOURCE: Sportsman
DURATION: 01:29
STORYLINE:
Last Updated : Oct 27, 2019, 7:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.