కశ్మీర్ను చలి పులి వణికిస్తోంది. రోజు రోజుకు ఉష్టోగ్రతలు పడిపోతున్నాయి. సోమవారం కశ్మీర్ లోయలో కనిష్ఠానికి కంటే తక్కువ ఉష్టోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. జమ్ముకశ్మీర్, లద్దాఖ్లో రికార్డు స్థాయిలో దాదాపు -30 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు ప్రకటించారు.
కార్గిల్లో ఎన్నడూ లేని విధంగా -27.8 డిగ్రీలు, లద్దాఖ్ లోని లేహ్ జిల్లాలో -16.4 డిగ్రీలు, పాహల్గ్రామ్ ప్రాంతంలో -12.5 డిగ్రీలు, ఉత్తర కశ్మీర్లోని గుల్మార్గ్లో -11.5 డిగ్రీల సెల్సియస్ ఉష్టోగ్రతలు నమోదయ్యాయి.
గరిష్ట ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలు..
లోయలోని చాలా ప్రాంతాల్లో గరిష్ఠ స్థాయి ఉష్ణోగ్రతలు సరాసరి 5 డిగ్రీల సెల్సియస్ ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దాదాపు 40 రోజులుగా అతి భయంకరమైన శీతల కాలాన్ని ఎదుర్కొంటున్న చిల్లయి కలాన్ ప్రాంతంలో మరికొంత కాలం ఈ పరిస్థితి కొనసాగనుందని స్పష్టం చేసింది.
అయితే జమ్ముకశ్మీర్, లద్దాఖ్లో వచ్చేవారం వాతావరణం పొడిగా ఉండి.. వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: కరోనా వైరస్పై కేంద్ర ప్రత్యేక టాస్క్ఫోర్స్