ఝార్ఖండ్ పలాములోని ఓ పోలీస్ స్టేషన్లో నిబంధనలకు విరుద్ధంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించారనే ఆరోపణలపై దర్యాప్తు చేపట్టారు అధికారులు.
చైన్పుర్ ఠాణాలో నిందితులను విచారించే క్రమంలో వారిని ఎలక్ట్రిక్ షాక్కు గురిచేశారని ఇద్దరు వ్యక్తులు(రజనీకాంత్ దుబె, వికాస్ కుమార్ పాసవాన్) ఆరోపించారు. ఈ మేరకు స్థానిక ఎస్పీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
ఈ చర్యను అమానవీయ ఘటనగా భావిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు స్థానికులు. సంబంధిత పోలీస్ అధికారిని తొలగించాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపై బైటాయించి నిరసన చేపట్టారు. అనంతరం.. సబ్ డివిజనల్ పోలీస్ అధికారి(ఎస్డీపీఓ), చైన్పుర్ ఇన్స్పెక్టర్ న్యాయపరమైన దర్యాప్తునకు హామీ ఇవ్వడం వల్ల ఆందోళన విరమించుకున్నారు.
ఇదీ చదవండి: చితిలో సగం కాలిన మృతదేహాన్ని తీసుకెళ్లిన పోలీసులు