ETV Bharat / bharat

కశ్మీర్​కు ఈ పంద్రాగస్టు ఎంతో ప్రత్యేకం!

author img

By

Published : Aug 14, 2019, 6:30 PM IST

Updated : Sep 27, 2019, 12:31 AM IST

జమ్ముకశ్మీర్​లో గ్రామగ్రామాన స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించాలని గవర్నర్ సత్యపాల్ మాలిక్ అధికారులను ఆదేశించారు. ప్రతి సర్పంచ్​ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. షేర్​-ఏ-కశ్మీర్​ స్టేడియంలో రేపు జెండావందన కార్యక్రమంలో పాల్గొనున్నారు సత్యపాల్.

కశ్మీర్​కు ఈ పంద్రాగస్టు ఎంతో ప్రత్యేకం!

ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. షేర్​-ఏ-కశ్మీర్​ స్టేడియంలో జరిగే జెండావందన కార్యక్రమంలో పాల్గొనున్నారు కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కశ్మీర్​లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

గ్రామగ్రామాన జెండా పండుగ

కశ్మీర్​ లోయలోని ప్రతి గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించాలని, ప్రతి సర్పంచ్​ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా అదేశాలు జారీ చేయాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించారు ఆ రాష్ట్ర గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​. ప్రతి జిల్లాలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు గవర్నర్​.

భాజపా 'జష్న్​​-ఎ-ఆజాదీ'

కశ్మీర్​లో 'జష్న్​​-ఎ-ఆజాదీ' పేరిట సంబరాలు జరిపేందుకు సిద్ధమైంది భాజపా. పంచాయతీ స్థాయిలో ఈ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇదీ చూడండి: మోదీ 'ఎర్రకోట' ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

ప్రత్యేక ప్రతిపత్తి రద్దు, రాష్ట్ర విభజన నేపథ్యంలో జమ్ముకశ్మీర్​లో స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. షేర్​-ఏ-కశ్మీర్​ స్టేడియంలో జరిగే జెండావందన కార్యక్రమంలో పాల్గొనున్నారు కశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. కశ్మీర్​లో పరిస్థితులు ప్రశాంతంగా ఉన్నట్లు స్పష్టం చేశారు.

గ్రామగ్రామాన జెండా పండుగ

కశ్మీర్​ లోయలోని ప్రతి గ్రామంలో స్వాతంత్ర్య దినోత్సవం నిర్వహించాలని, ప్రతి సర్పంచ్​ ఈ కార్యక్రమంలో పాల్గొనేలా అదేశాలు జారీ చేయాలని డిప్యూటీ కమిషనర్లకు సూచించారు ఆ రాష్ట్ర గవర్నర్​ సత్యపాల్​ మాలిక్​. ప్రతి జిల్లాలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేడుకలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు గవర్నర్​.

భాజపా 'జష్న్​​-ఎ-ఆజాదీ'

కశ్మీర్​లో 'జష్న్​​-ఎ-ఆజాదీ' పేరిట సంబరాలు జరిపేందుకు సిద్ధమైంది భాజపా. పంచాయతీ స్థాయిలో ఈ ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తోంది.

ఇదీ చూడండి: మోదీ 'ఎర్రకోట' ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి

Intro:Body:

aaaaaaaaaaaaa


Conclusion:
Last Updated : Sep 27, 2019, 12:31 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.