ETV Bharat / bharat

చంద్రయాన్​-3: భూమిపై జాబిల్లి బిలాల సృష్టి!

author img

By

Published : Aug 28, 2020, 5:21 PM IST

భారత్​ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న చంద్రయాన్​-3 మిషన్​ను విజయవంతంగా పూర్తి చేసేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తోంది. చంద్రునిపై సాఫ్ట్​ ల్యాండింగ్​లో​ వైఫల్యాలను అధిగమించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. బెంగళూరు సమీపంలో చంద్రుని ఉపరితలాన్ని కృత్రిమంగా సృష్టించి ల్యాండర్​ను పరీక్షించనుంది.

ISRO CHANDRAYAN-3
చంద్రయాన్​-3

ఎలాంటి ఆటంకాలు లేకుండా 'చంద్రయాన్​-3' విజయవంతంగా ప్రయోగించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్​-2లో సాఫ్ట్ ల్యాండింగ్​ వైఫల్యంపై దృష్టి పెట్టింది. చంద్రునిపై ఉన్న బిలాలను కృత్రిమంగా సృష్టించి ల్యాండింగ్ ప్రక్రియను పరిశీలించాలని భావిస్తోంది.

ఈ మేరకు బెంగళూరుకు 215 కిలోమీటర్ల దూరం ఉన్న చల్లాకేరెలో ఉల్లార్తిలో కృత్రిమ చంద్ర బిలాలను సృష్టించనుంది. దీనికి సుమారు రూ.24.2 లక్షలు ఖర్చవుతుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

టెండర్లకు ఆహ్వానం..

ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్లకు ఇస్రో ఆహ్వానించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తవ్వకాల పనులను ఏదైనా ఒక సంస్థకు అప్పగించే ప్రక్రియ ఆగస్టు చివరినాటికి లేదా సెప్టెంబర్​ మొదటి వారంలో పూర్తవుతుందని తెలుస్తోంది.

ఈ బిలాలు 10 మీటర్ల వ్యాసం, 3 మీటర్ల లోతు ఉంటాయని మరో శాస్త్రవేత్త తెలిపారు. చంద్రుని ఉపరితలంపై ఉన్న మాదిరిగా వీటిని నిర్మిస్తారని.. ఇక్కడ ల్యాండింగ్​ ప్రక్రియను పరిశీలిస్తారని చెప్పారు.

సెన్సార్ల పనితీరుపై పరీక్ష..

ఈ పరీక్షల్లో సెన్సార్లు అమర్చిన ఇస్రో విమానాన్ని ఉపయోగించనున్నారు. ఆ ప్రదేశంలో 7 కిలోమీటర్ల ఎత్తు నుంచి నిర్ధిష్ట ప్రదేశంలో ల్యాండింగ్​ను పరీక్షిస్తారు. సుమారు 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు విమానానికి సెన్సార్లు ఎలా మార్గనిర్దేశం చేస్తాయో పరిశీలించనున్నారు.

ల్యాండర్​లో వినియోగించే సెన్సార్ల పనితీరు పరీక్ష (ఎల్​ఎస్​పీటీ) నిర్వహిస్తారు. దీనిద్వారా కృత్రిమంగా రూపొందించిన చంద్రుని ఉపరితలంపై ఇస్రో ల్యాండర్​కు మార్గనిర్దేశం చేయటంలో సెన్సార్లు ఎంత సమర్థంగా పనిచేస్తాయో అవగాహనకు వస్తారు.

చంద్రయాన్​-3 కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినది కావటం గమనార్హం. ఈ మిషన్​లో అనేక సెన్సార్లను వినియోగనుంది ఇస్రో. ల్యాండింగ్​ వేగంతో పాటు చంద్రుని ఉపరితలంపై అసమానతలను గుర్తించి ల్యాండర్​కు సమాచారం ఇస్తుంది.

పూర్తి స్థాయి ల్యాండర్​..

చంద్రయాన్​-2కు మించి ఈ సారి ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తోంది ఇస్రో. బెంగళూరులోని 'ఇస్రో శాటిలైట్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ ఎస్టాబిలిష్​మెంట్​' (ఐసైట్​)లో పూర్తి స్థాయి ల్యాండర్​పై పరిశోధనలు చేస్తున్నట్లు ఓ శాస్త్రవేత్త వెల్లడించారు. అది ఏ స్థాయి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.

నాణ్యత లేమి కారణంగా..

చంద్రయాన్ -2 ప్రయోగానికి ముందు కూడా ఇలాంటి బిలాలపై ప్రయోగాలు చేశారు శాస్త్రవేత్తలు. అయితే ఇవి బహిరంగ ప్రదేశంలో జరిగాయని, అందుకే వాటిలో నాణ్యత కొరవడిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే కొత్త బిలాలను సృష్టిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2 : 'విక్రమ్' కథ ముగిసినట్లేనా?

ఎలాంటి ఆటంకాలు లేకుండా 'చంద్రయాన్​-3' విజయవంతంగా ప్రయోగించేందుకు భారత అంతరిక్ష సంస్థ ఇస్రో సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్​-2లో సాఫ్ట్ ల్యాండింగ్​ వైఫల్యంపై దృష్టి పెట్టింది. చంద్రునిపై ఉన్న బిలాలను కృత్రిమంగా సృష్టించి ల్యాండింగ్ ప్రక్రియను పరిశీలించాలని భావిస్తోంది.

ఈ మేరకు బెంగళూరుకు 215 కిలోమీటర్ల దూరం ఉన్న చల్లాకేరెలో ఉల్లార్తిలో కృత్రిమ చంద్ర బిలాలను సృష్టించనుంది. దీనికి సుమారు రూ.24.2 లక్షలు ఖర్చవుతుందని ఇస్రో వర్గాలు తెలిపాయి.

టెండర్లకు ఆహ్వానం..

ఇందుకు సంబంధించి ఇప్పటికే టెండర్లకు ఇస్రో ఆహ్వానించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తవ్వకాల పనులను ఏదైనా ఒక సంస్థకు అప్పగించే ప్రక్రియ ఆగస్టు చివరినాటికి లేదా సెప్టెంబర్​ మొదటి వారంలో పూర్తవుతుందని తెలుస్తోంది.

ఈ బిలాలు 10 మీటర్ల వ్యాసం, 3 మీటర్ల లోతు ఉంటాయని మరో శాస్త్రవేత్త తెలిపారు. చంద్రుని ఉపరితలంపై ఉన్న మాదిరిగా వీటిని నిర్మిస్తారని.. ఇక్కడ ల్యాండింగ్​ ప్రక్రియను పరిశీలిస్తారని చెప్పారు.

సెన్సార్ల పనితీరుపై పరీక్ష..

ఈ పరీక్షల్లో సెన్సార్లు అమర్చిన ఇస్రో విమానాన్ని ఉపయోగించనున్నారు. ఆ ప్రదేశంలో 7 కిలోమీటర్ల ఎత్తు నుంచి నిర్ధిష్ట ప్రదేశంలో ల్యాండింగ్​ను పరీక్షిస్తారు. సుమారు 2 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు విమానానికి సెన్సార్లు ఎలా మార్గనిర్దేశం చేస్తాయో పరిశీలించనున్నారు.

ల్యాండర్​లో వినియోగించే సెన్సార్ల పనితీరు పరీక్ష (ఎల్​ఎస్​పీటీ) నిర్వహిస్తారు. దీనిద్వారా కృత్రిమంగా రూపొందించిన చంద్రుని ఉపరితలంపై ఇస్రో ల్యాండర్​కు మార్గనిర్దేశం చేయటంలో సెన్సార్లు ఎంత సమర్థంగా పనిచేస్తాయో అవగాహనకు వస్తారు.

చంద్రయాన్​-3 కూడా పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినది కావటం గమనార్హం. ఈ మిషన్​లో అనేక సెన్సార్లను వినియోగనుంది ఇస్రో. ల్యాండింగ్​ వేగంతో పాటు చంద్రుని ఉపరితలంపై అసమానతలను గుర్తించి ల్యాండర్​కు సమాచారం ఇస్తుంది.

పూర్తి స్థాయి ల్యాండర్​..

చంద్రయాన్​-2కు మించి ఈ సారి ప్రతి అంశాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తోంది ఇస్రో. బెంగళూరులోని 'ఇస్రో శాటిలైట్ ఇంటిగ్రేషన్ అండ్ టెస్ట్ ఎస్టాబిలిష్​మెంట్​' (ఐసైట్​)లో పూర్తి స్థాయి ల్యాండర్​పై పరిశోధనలు చేస్తున్నట్లు ఓ శాస్త్రవేత్త వెల్లడించారు. అది ఏ స్థాయి ఫలితాలను ఇస్తుందో ఇప్పుడే చెప్పలేమని అన్నారు.

నాణ్యత లేమి కారణంగా..

చంద్రయాన్ -2 ప్రయోగానికి ముందు కూడా ఇలాంటి బిలాలపై ప్రయోగాలు చేశారు శాస్త్రవేత్తలు. అయితే ఇవి బహిరంగ ప్రదేశంలో జరిగాయని, అందుకే వాటిలో నాణ్యత కొరవడిందని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అందుకే కొత్త బిలాలను సృష్టిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2 : 'విక్రమ్' కథ ముగిసినట్లేనా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.