ETV Bharat / bharat

ఎన్​ఐఏ చేతికి దిల్లీ పేలుడు కేసు - జాతీయ దర్యాప్తు సంస్థ

గత నెల 29న దిల్లీలోని ఇజ్రాయెల్​ రాయబార కార్యాలయం సమీపంలో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన కేసును ఎన్​ఐఏకు అప్పగించింది కేంద్ర హోంశాఖ. ఈ ఘటనపై ఇప్పటికే దిల్లీ పోలీసు స్పెషల్​ సెల్​, దిల్లీ ఫోరెన్సిక్​, ఇంటిలిజెన్స్​ బ్యూరోలు దర్యాప్తు చేస్తున్నాయి.

Israel Embassy blast case has been handed over to National Investigation Agency by Ministry of Home Affairs: Government sources
ఎన్​ఐఏ చేతికి దిల్లీ దిల్లీ పేలుడు కేసు!
author img

By

Published : Feb 2, 2021, 1:45 PM IST

దిల్లీ పేలుడు కేసును కేంద్ర హోంశాఖ.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ)కు అప్పగించింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో గత నెల 29న జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే దిల్లీ పోలీసు స్పెషల్ సెల్, దిల్లీ ఫోరెన్సిక్, ఇంటిలిజెన్స్ బ్యూరో దర్యాప్తు చేపట్టాయి.. నేషనల్​ సెక్యూరిటీ గార్డు బృందం ఇప్పటికే ఘటనాస్థలాన్ని సందర్శించి ఆధారాలను సేకరించింది.

ఇజ్రాయెల్​ రాయబార కార్యాలయం వద్ద తక్కువ సామర్థ్యంతో పేలుడు సంభవించినట్లు పోలీసు విచారణ బృందం నిర్ధరించింది. దేశంలో ఎటువంటి పేలుడు సంభవించినా ఎన్ఐఏ విచారించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు కేసును కూడా ఎన్ఐఏకి అప్పగించినట్టు తెలుస్తోంది.

పేలుడుకు కారణమైన వారిని శిక్షిస్తామని ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహుకు హామీనిచ్చారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీనిపై మోదీకి కృతజ్ఞతలు తెలిపారు నెతన్యాహు.

ఇదీ చూడండి:- 'దిల్లీ' పేలుడులో ఇరాన్​ హస్తం!

దిల్లీ పేలుడు కేసును కేంద్ర హోంశాఖ.. జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ)కు అప్పగించింది. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం సమీపంలో గత నెల 29న జరిగిన ఈ ఘటనపై ఇప్పటికే దిల్లీ పోలీసు స్పెషల్ సెల్, దిల్లీ ఫోరెన్సిక్, ఇంటిలిజెన్స్ బ్యూరో దర్యాప్తు చేపట్టాయి.. నేషనల్​ సెక్యూరిటీ గార్డు బృందం ఇప్పటికే ఘటనాస్థలాన్ని సందర్శించి ఆధారాలను సేకరించింది.

ఇజ్రాయెల్​ రాయబార కార్యాలయం వద్ద తక్కువ సామర్థ్యంతో పేలుడు సంభవించినట్లు పోలీసు విచారణ బృందం నిర్ధరించింది. దేశంలో ఎటువంటి పేలుడు సంభవించినా ఎన్ఐఏ విచారించవచ్చు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు కేసును కూడా ఎన్ఐఏకి అప్పగించినట్టు తెలుస్తోంది.

పేలుడుకు కారణమైన వారిని శిక్షిస్తామని ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నెతన్యాహుకు హామీనిచ్చారు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దీనిపై మోదీకి కృతజ్ఞతలు తెలిపారు నెతన్యాహు.

ఇదీ చూడండి:- 'దిల్లీ' పేలుడులో ఇరాన్​ హస్తం!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.