ETV Bharat / bharat

రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడు ఎవరో తెలుసా?

author img

By

Published : Nov 26, 2019, 8:41 AM IST

రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఎన్నికవడానికి ముందే.. మధ్యంతర అధ్యక్షుడిగా డాక్టర్​ సచిదానంద సిన్హా పనిచేసిన విషయం మనలో చాలామందికి తెలియకపోవచ్చు. ప్రత్యేక బిహార్ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన సిన్హాను 1946 డిసెంబరు 9న భారతదేశ రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడిగా ఎంపిక చేశారు ఆనాటి కాంగ్రెస్​ అధ్య​క్షుడు ఆచార్య జేబీ కృప్లానీ. ఆ తర్వాత రెండు రోజులకే 1946 డిసెంబరు 11న డాక్టర్​ రాజేంద్ర ప్రసాద్​.. రాజ్యాంగ పరిషత్​ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.

రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడు ఎవరో తెలుసా?

భారతదేశ రాజ్యాంగ పరిషత్ తొలి అధ్యక్షుడు ఎవరు? అని ప్రశ్నిస్తే మనలో చాలామంది డాక్టర్​ బాబూ రాజేంద్రప్రసాద్​ అని టక్కున సమాధానం చెప్తారు. మరి ఆయన కంటే ముందే రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడిగా సేవలందించిన వ్యక్తి ఎవరు? అని ప్రశ్నిస్తే..!! బహుశా చాలామందికి ఆయన పేరు కూడా తెలియకపోవచ్చు. ఆయనే బిహార్​కు చెందిన డాక్టర్​ సచిదానంద సిన్హా.

సిన్హాను మాజీ రాష్ట్రపతి డాక్టర్​ బాబూ రాజేంద్ర ప్రసాద్​... 'ఫాదర్​ ఆఫ్ ​ద మోడర్న్​ బిహార్​'గా కీర్తించారు. అలాంటి వ్యక్తిని 1946 డిసెంబరు 9న భారతదేశ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు ఆనాటి కాంగ్రెస్​ అధ్య​క్షుడు ఆచార్య జేబీ కృప్లానీ. మరి ఆయన ఎవరో? రాజ్యాంగ పరిషత్​ అధ్యక్షుడిగా ఎలా ఎదిగారో చూద్దాం..

సిన్హా బాల్యం

సచిదానంద సిన్హా 1871 నవంబరు 10న బిహార్​లోని బక్సర్ జిల్లా మహర్షి విశ్వామిత్రా మురార్​ గ్రామంలో జన్మించారు. సిన్హా తండ్రి బక్సి శివప్రసాద్​ సిన్హా.. దుమరన్​ మహరాజ్ ముఖ్య తహశీల్దార్​గా ఉండేవారు. సిన్హా ప్రాథమిక విద్య అంతా ఆయన స్వగ్రామంలోనే గడిచింది. 1889 డిసెంబరు 26న 18 ఏళ్ల వయసున్నప్పుడు బారిస్టర్​ అభ్యసించేందుకు ఇంగ్లాండ్​కు వెళ్లారు సిన్హా. 1893లో కోల్​కతా హైకోర్టులో న్యాయవాది​గా వృత్తిజీవితం​ ప్రారంభించారు. ఆ తర్వాత అలహాబాద్​ హైకోర్టులో 10ఏళ్లు లాయర్​గా కొనసాగారు. అదే సమయంలో ఇండియన్ పీపుల్స్​, హిందుస్థాన్ రివ్యూ పత్రికలకు సంపాదకులుగా చాలా సంవత్సరాలు సేవలందించారు.

రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడిగా..

1946లో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇస్తున్నట్లు ప్రకటించింది బ్రిటీష్​ ప్రభుత్వం. అదే ఏడాది డిసెంబరు 9న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలందరూ దిల్లీలోని పార్లమెంటు హాలులో సమావేశమయ్యారు. చాలా మంది స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొన్న అదే సమావేశంలో రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడిగా సచిదానంద సిన్హా పేరును ప్రతిపాదించారు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు కృప్లానీ. అందుకు అందరూ అంగీకరించినందున సిన్హాను మధ్యంతర అధ్యక్షుడిగా నియమించారు.

జస్టిస్ ఖుదా బక్స్​ ఖాన్​ గ్రంథాలయం

1894లో అలహాబాద్​ హైకోర్టులో న్యాయవాదిగా శిక్షణ పొందుతున్న సమయంలో.. జస్టిస్​ ఖుదా బక్స్​ ఖాన్​ను కలిశారు సిన్హా. జస్టిస్​ ఖాన్​.. 1891 అక్టోబరు 29న ఆయన పేరుమీద పట్నాలో గ్రంథాలయాన్ని స్థాపించారు. ఆ తర్వాత జస్టిస్​ ఖాన్​.. హైదరాబాద్​లోని నిజాం హైకోర్టుకు బదిలీ అయ్యారు. అనంతరం 1894 నుంచి 1898 వరకు ఖాన్​ కార్యదర్శిగా గ్రంథాలయ బాధ్యతలు నిర్వర్తించారు సిన్హా.

ప్రత్యేక బిహార్ ఉద్యమం

ఒకప్పుడు బెంగాల్ ప్రావిన్స్​లో భాగంగా ఉన్న ఇప్పటి బిహార్​ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు సచిదానంద సిన్హా. జర్నలిజాన్ని ఆయుధంగా చేసుకుని.. ద బిహార్​ హెరాల్డ్​ పత్రికతో ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఆ తర్వాత 1894లో ద బిహార్​ టైమ్స్​ పేరుతో ఒక ఇంగ్లీష్​ పత్రికను స్థాపించారు సిన్హా. 1906లో అదే పత్రికను 'బిహారీ'గా పేరు మార్చారు. ప్రత్యేక బిహార్​ కోసం హిందూ, ముస్లింలు ఏకం కావాలని ఈ పత్రిక ద్వారా నినదించారు. ఆ తర్వాత 1905లో బంగాల్​ నుంచి విడిపోయి ప్రత్యేక బిహార్​ రూపుదిద్దుకుంది.

సిన్హా గ్రంథాలయం.. మరణం

ప్రజలను చైతన్యవంతులను చేయాలనే ఆకాంక్షతో ఆయన భార్య స్వర్గీయ రాధికా సిన్హా జ్ఞాపకార్థం 1924లో గ్రంథాలయాన్ని నెలకొల్పారు సిన్హా. ఈ లైబ్రరీ కార్యకలాపాలు చూసుకునేందుకు ఓ ట్రస్టును కూడా ఏర్పాటు చేశారు. అనంతరం 1950 మార్చి 6న పట్నాలో తుది శ్వాస విడిచారు సిన్హా.

భారతదేశ రాజ్యాంగ పరిషత్ తొలి అధ్యక్షుడు ఎవరు? అని ప్రశ్నిస్తే మనలో చాలామంది డాక్టర్​ బాబూ రాజేంద్రప్రసాద్​ అని టక్కున సమాధానం చెప్తారు. మరి ఆయన కంటే ముందే రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడిగా సేవలందించిన వ్యక్తి ఎవరు? అని ప్రశ్నిస్తే..!! బహుశా చాలామందికి ఆయన పేరు కూడా తెలియకపోవచ్చు. ఆయనే బిహార్​కు చెందిన డాక్టర్​ సచిదానంద సిన్హా.

సిన్హాను మాజీ రాష్ట్రపతి డాక్టర్​ బాబూ రాజేంద్ర ప్రసాద్​... 'ఫాదర్​ ఆఫ్ ​ద మోడర్న్​ బిహార్​'గా కీర్తించారు. అలాంటి వ్యక్తిని 1946 డిసెంబరు 9న భారతదేశ రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా ఎంపిక చేశారు ఆనాటి కాంగ్రెస్​ అధ్య​క్షుడు ఆచార్య జేబీ కృప్లానీ. మరి ఆయన ఎవరో? రాజ్యాంగ పరిషత్​ అధ్యక్షుడిగా ఎలా ఎదిగారో చూద్దాం..

సిన్హా బాల్యం

సచిదానంద సిన్హా 1871 నవంబరు 10న బిహార్​లోని బక్సర్ జిల్లా మహర్షి విశ్వామిత్రా మురార్​ గ్రామంలో జన్మించారు. సిన్హా తండ్రి బక్సి శివప్రసాద్​ సిన్హా.. దుమరన్​ మహరాజ్ ముఖ్య తహశీల్దార్​గా ఉండేవారు. సిన్హా ప్రాథమిక విద్య అంతా ఆయన స్వగ్రామంలోనే గడిచింది. 1889 డిసెంబరు 26న 18 ఏళ్ల వయసున్నప్పుడు బారిస్టర్​ అభ్యసించేందుకు ఇంగ్లాండ్​కు వెళ్లారు సిన్హా. 1893లో కోల్​కతా హైకోర్టులో న్యాయవాది​గా వృత్తిజీవితం​ ప్రారంభించారు. ఆ తర్వాత అలహాబాద్​ హైకోర్టులో 10ఏళ్లు లాయర్​గా కొనసాగారు. అదే సమయంలో ఇండియన్ పీపుల్స్​, హిందుస్థాన్ రివ్యూ పత్రికలకు సంపాదకులుగా చాలా సంవత్సరాలు సేవలందించారు.

రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడిగా..

1946లో భారతదేశానికి స్వాతంత్ర్యం ఇస్తున్నట్లు ప్రకటించింది బ్రిటీష్​ ప్రభుత్వం. అదే ఏడాది డిసెంబరు 9న దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నేతలందరూ దిల్లీలోని పార్లమెంటు హాలులో సమావేశమయ్యారు. చాలా మంది స్వాతంత్ర్య సమరయోధులు పాల్గొన్న అదే సమావేశంలో రాజ్యాంగ పరిషత్​ మధ్యంతర అధ్యక్షుడిగా సచిదానంద సిన్హా పేరును ప్రతిపాదించారు అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు కృప్లానీ. అందుకు అందరూ అంగీకరించినందున సిన్హాను మధ్యంతర అధ్యక్షుడిగా నియమించారు.

జస్టిస్ ఖుదా బక్స్​ ఖాన్​ గ్రంథాలయం

1894లో అలహాబాద్​ హైకోర్టులో న్యాయవాదిగా శిక్షణ పొందుతున్న సమయంలో.. జస్టిస్​ ఖుదా బక్స్​ ఖాన్​ను కలిశారు సిన్హా. జస్టిస్​ ఖాన్​.. 1891 అక్టోబరు 29న ఆయన పేరుమీద పట్నాలో గ్రంథాలయాన్ని స్థాపించారు. ఆ తర్వాత జస్టిస్​ ఖాన్​.. హైదరాబాద్​లోని నిజాం హైకోర్టుకు బదిలీ అయ్యారు. అనంతరం 1894 నుంచి 1898 వరకు ఖాన్​ కార్యదర్శిగా గ్రంథాలయ బాధ్యతలు నిర్వర్తించారు సిన్హా.

ప్రత్యేక బిహార్ ఉద్యమం

ఒకప్పుడు బెంగాల్ ప్రావిన్స్​లో భాగంగా ఉన్న ఇప్పటి బిహార్​ రాష్ట్ర ఏర్పాటులో కీలకపాత్ర పోషించారు సచిదానంద సిన్హా. జర్నలిజాన్ని ఆయుధంగా చేసుకుని.. ద బిహార్​ హెరాల్డ్​ పత్రికతో ప్రజలను చైతన్యవంతులను చేశారు. ఆ తర్వాత 1894లో ద బిహార్​ టైమ్స్​ పేరుతో ఒక ఇంగ్లీష్​ పత్రికను స్థాపించారు సిన్హా. 1906లో అదే పత్రికను 'బిహారీ'గా పేరు మార్చారు. ప్రత్యేక బిహార్​ కోసం హిందూ, ముస్లింలు ఏకం కావాలని ఈ పత్రిక ద్వారా నినదించారు. ఆ తర్వాత 1905లో బంగాల్​ నుంచి విడిపోయి ప్రత్యేక బిహార్​ రూపుదిద్దుకుంది.

సిన్హా గ్రంథాలయం.. మరణం

ప్రజలను చైతన్యవంతులను చేయాలనే ఆకాంక్షతో ఆయన భార్య స్వర్గీయ రాధికా సిన్హా జ్ఞాపకార్థం 1924లో గ్రంథాలయాన్ని నెలకొల్పారు సిన్హా. ఈ లైబ్రరీ కార్యకలాపాలు చూసుకునేందుకు ఓ ట్రస్టును కూడా ఏర్పాటు చేశారు. అనంతరం 1950 మార్చి 6న పట్నాలో తుది శ్వాస విడిచారు సిన్హా.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY/DO NOT OBSCURE LOGO
SHOTLIST:
++PRELIMINARY ONLY - MORE TO FOLLOW++
ITALIAN COAST GUARD - AP CLIENTS ONLY/DO NOT OBSCURE LOGO
At Sea, off Italian coast near Lampedusa - 24 November 2019
1. Various of rescue operation after shipwreck, people including children struggling to stay above water in freezing conditions, toddler being pulled aboard rescue ship
STORYLINE:
Italian coast guard footage shows the immediate aftermath of a shipwreck off the coast of the island of Lampedusa, with people struggling to stay above water in freezing conditions as rescuers try to save them.
The coast guard said it was still searching for bodies of those missing in Sunday's shipwreck.
According to the coast guard the migrants' boat sank about a nautical mile off the coast.
The coast guard says the rescued 149 people including 13 women and three children.
The Italian news agency ANSA reported Monday that the bodies of five women have been recovered.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.