ETV Bharat / bharat

సరిహద్దు ఉద్రిక్తతలతో రామ మందిర నిర్మాణం వాయిదా

author img

By

Published : Jun 19, 2020, 1:04 PM IST

భారత్​-చైనా సరిహద్దులో ప్రతిష్టంభన కారణంగా అయోధ్యలోని రామ మందిర నిర్మాణ పనుల ప్రారంభాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. కొత్త తేదిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.

Indo-China border standoff: Plan to start construction of Ram Temple in Ayodhya suspended
సరిహద్దు ఉద్రిక్తతలతో రామ మందిర నిర్మాణం వాయిదా

సరిహద్దు ఘర్షణతో భారత-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జాతీయ ప్రయోజనాలే ముఖ్యమన్న రామ మందిర్​ ట్రస్ట్​.. అయోధ్యలో మందిర నిర్మాణ పనులను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు ఘర్షణలో 20 మంది సైనికులు అమరులైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ట్రస్ట్ స్పష్టం చేసింది​.

భారత సైనికుల మరణం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్ సభ్యులు.​. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా మందిర పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు సభ్యుడు అనిల్​ మిశ్రా.

సరిహద్దు ఘర్షణతో భారత-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో జాతీయ ప్రయోజనాలే ముఖ్యమన్న రామ మందిర్​ ట్రస్ట్​.. అయోధ్యలో మందిర నిర్మాణ పనులను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. సరిహద్దు ఘర్షణలో 20 మంది సైనికులు అమరులైన నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని ట్రస్ట్ స్పష్టం చేసింది​.

భారత సైనికుల మరణం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన ట్రస్ట్ సభ్యులు.​. అమర జవాన్లకు నివాళులు అర్పించారు. దేశంలోని పరిస్థితులకు అనుగుణంగా మందిర పనుల ప్రారంభంపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు సభ్యుడు అనిల్​ మిశ్రా.

ఇదీ చూడండి: గల్వాన్‌ ఘటనలో 76 మంది సైనికులకు గాయాలు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.