ఆసియా నోబెల్ బహుమతిగా పరిగణించే రామన్ మెగసెసె అవార్డు ప్రముఖ పాత్రికేయుడు రవీష్ కుమార్ను వరించింది. ఓ జాతీయ టీవీ ఛానల్లో సీనియర్ పాత్రికేయుడిగా పని చేస్తోన్న రవీష్... 2019 ఏడాదికిగాను ఈ అవార్డుకు ఎంపికయ్యారు. రవీష్తో పాటు కో స్వే విన్ (మయన్మార్), అంఖానా నీలపైజిత్ (థాయ్లాండ్), రేముండో పుజంతే కాయబ్యాబ్ (ఫిలిప్పీన్స్), కిమ్ జోంగ్ కీ (దక్షిణ కొరియా) మెగసెసె అవార్డును గెలుచుకున్నారు.
'ప్రైమ్ టైమ్' అనే కార్యక్రమం ద్వారా పౌరుల సమస్యలను, వారి వాస్తవ స్థితిగతులను రవీష్ కుమార్ ప్రపంచానికి తెలియజేస్తున్నారని అవార్డు కమిటీ తెలిపింది. ప్రజల గొంతుకగా ఉన్నవారే పాత్రికేయుడని ఈ సందర్భంగా పేర్కొంది.