మొట్టమొదటి దేశీయ యాంటీ రేడియేషన్ క్షిపణి రుద్రం పరీక్ష విజయవంతమైంది. ఒడిశాలోని బాలేశ్వర్లో సుఖోయ్-30 యుద్ధవిమానం నుంచి దీన్ని పరీక్షించారు.
గగనతలం నుంచి భూఉపరితలానికి ప్రయోగించే రుద్రం క్షిపణిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) దేశీయంగా అభివృద్ధి చేసింది. శత్రు దేశాల నిఘా రాడార్లు, సమాచార వ్యవస్థలను ధ్వంసం చేయగల ఈ క్షిపణిని ఎత్తైన ప్రాంతాల నుంచి ప్రయోగించవచ్చు. భారత వాయుసేన వద్ద ఉన్న పోరాట విమానాలు.. మిరాజ్, జాగ్వార్, తేజస్ వంటి వాటిపై నుంచి రుద్రంను ప్రయోగించవచ్చని అధికారులు తెలిపారు.
లక్ష్యాన్ని కచ్చితంగా చేరుకునేలా రూపొందించిన రుద్రం క్షిపణి ఐఎన్ఎస్-జీపీఎస్ నావిగేషన్ వ్యవస్థను కలిగి ఉందని డీఆర్డీఓ శాస్త్రవేత్తలు తెలిపారు.
రుద్రం క్షిపణి పరీక్ష విజయవంతం కావడంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీఓ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.
-
The New Generation Anti-Radiation Missile (Rudram-1) which is India’s first indigenous anti-radiation missile developed by @DRDO_India for Indian Air Force was tested successfully today at ITR,Balasore. Congratulations to DRDO & other stakeholders for this remarkable achievement.
— Rajnath Singh (@rajnathsingh) October 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">The New Generation Anti-Radiation Missile (Rudram-1) which is India’s first indigenous anti-radiation missile developed by @DRDO_India for Indian Air Force was tested successfully today at ITR,Balasore. Congratulations to DRDO & other stakeholders for this remarkable achievement.
— Rajnath Singh (@rajnathsingh) October 9, 2020The New Generation Anti-Radiation Missile (Rudram-1) which is India’s first indigenous anti-radiation missile developed by @DRDO_India for Indian Air Force was tested successfully today at ITR,Balasore. Congratulations to DRDO & other stakeholders for this remarkable achievement.
— Rajnath Singh (@rajnathsingh) October 9, 2020
ఇదీ చూడండి- భార్య తల నరికి పోలీస్ స్టేషన్కు పట్టుకెళ్లిన భర్త