ETV Bharat / bharat

ఒక్కరోజులో 24,248 కేసులు.. మూడో స్థానానికి భారత్​

author img

By

Published : Jul 6, 2020, 9:28 AM IST

Updated : Jul 6, 2020, 10:15 AM IST

భారత్​పై కరోనా వైరస్​ పంజా విసురుతోంది. కొత్తగా 24,248కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 6,97,413కు చేరింది. మరో 425మంది మరణించారు. దీంతో మృతుల సంఖ్య 19,693కు పెరిగింది. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కేసుల జాబితాలో మూడో స్థానానికి చేరింది భారత్​.

India reports a spike of 24,248 new #COVID19 cases and 425 deaths in the last 24 hours.
ఒక్కరోజులో 24,248 కేసులు.. 425 మరణాలు

దేశంలో కరోనా వైరస్​ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా 24,248మందికి వైరస్​ సోకింది. మరో 425మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

India reports a spike of 24,248 new #COVID19 cases and 425 deaths in the last 24 hours.
ఒక్కరోజులో 24,248 కేసులు.. 425 మరణాలు
  • మహారాష్ట్రలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2,06,619చేరింది. వీరిలో 8,822 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 1.10లక్షలు దాటింది. ఇప్పటి వరకు 1,11,151మందికి వైరస్​ సోకింది. 1,510మంది మరణించారు.
  • దిల్లీలో కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. మొత్తం మీద 99,444 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 3,067కు పెరిగింది.
  • గుజరాత్​లో మొత్తం 36,037 కేసులు వెలుగుచూశాయి. 1,943 మంది కరోనా కారణంగా చనిపోయారు.

మూడో స్థానానికి భారత్​...

తాజా గణాంకాలతో అత్యధిక కేసులున్న దేశాల జాబితాలో రష్యా(6,81,251)ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరింది భారత్. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్​ దేశాలు కొనసాగుతున్నాయి. భారత్​- బ్రెజిల్​ మధ్య దాదాపు 10లక్షల కేసుల వ్యత్యాసముంది.

ఇదీ చూడండి:- నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు

దేశంలో కరోనా వైరస్​ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. తాజాగా 24,248మందికి వైరస్​ సోకింది. మరో 425మంది వైరస్​ ధాటికి ప్రాణాలు కోల్పోయారు.

India reports a spike of 24,248 new #COVID19 cases and 425 deaths in the last 24 hours.
ఒక్కరోజులో 24,248 కేసులు.. 425 మరణాలు
  • మహారాష్ట్రలో వైరస్​ ఉద్ధృతి కొనసాగుతోంది. మొత్తం కేసుల సంఖ్య 2,06,619చేరింది. వీరిలో 8,822 మంది వైరస్​కు బలయ్యారు.
  • తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 1.10లక్షలు దాటింది. ఇప్పటి వరకు 1,11,151మందికి వైరస్​ సోకింది. 1,510మంది మరణించారు.
  • దిల్లీలో కేసుల సంఖ్య లక్షకు చేరువైంది. మొత్తం మీద 99,444 కేసులు నమోదయ్యాయి. మృతుల సంఖ్య 3,067కు పెరిగింది.
  • గుజరాత్​లో మొత్తం 36,037 కేసులు వెలుగుచూశాయి. 1,943 మంది కరోనా కారణంగా చనిపోయారు.

మూడో స్థానానికి భారత్​...

తాజా గణాంకాలతో అత్యధిక కేసులున్న దేశాల జాబితాలో రష్యా(6,81,251)ను వెనక్కి నెట్టి మూడో స్థానానికి చేరింది భారత్. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రెజిల్​ దేశాలు కొనసాగుతున్నాయి. భారత్​- బ్రెజిల్​ మధ్య దాదాపు 10లక్షల కేసుల వ్యత్యాసముంది.

ఇదీ చూడండి:- నాడు ఫ్లూ.. నేడు కరోనాను జయించిన 106 ఏళ్ల వృద్ధుడు

Last Updated : Jul 6, 2020, 10:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.